వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరోల్లో ఒకరు కార్తికేయ గుమ్మకొండ. కేవలం హీరోగా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా కార్తికేయ నటించి తనని తాను నటుడిగా నిరూపించుకున్నారు. కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : బెదురులంక 2012
- నటీనటులు : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్.
- నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పనేని
- దర్శకత్వం : క్లాక్స్
- సంగీతం : మణి శర్మ
- విడుదల తేదీ : ఆగస్ట్ 25, 2023

స్టోరీ :
2012లో జరిగే కథ ఇది. బెదురులంక అనే ఒక గ్రామానికి చెందిన శివ (కార్తికేయ) హైదరాబాద్ లో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి తన ఊరికి వచ్చేస్తాడు. ఊరిలో యుగాంతం రాబోతోంది అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వార్తలను చూసిన భూషణం (అజయ్ ఘోష్) ఆ ఊరి ప్రజలని మోసం చేద్దాము అనుకుంటాడు. అక్కడ జాతకాలు చూస్తాను అని చెప్పి ప్రజల్ని మోసం చేసే బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు అయిన డేనియల్ (ఆటో రాంప్రసాద్) తో కలిసి యుగాంతం రాబోతోంది అని ఊరి ప్రజలు నమ్మేలాగా చేస్తాడు.

ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కూడా నిజంగానే యుగాంతం రాబోతోంది అని నమ్ముతాడు. ఇంతలో ఆ ఊరిలోని ప్రెసిడెంట్ గారి అమ్మాయి అయిన చిత్ర (నేహా శెట్టి) తో శివ ప్రేమలో పడతాడు. ఇక్కడ జరిగే ఏ విషయాన్ని కూడా శివ నమ్మడు. శివ వాళ్ల మోసాలని ఎలా బయటపెట్టాడు? ఊరి ప్రజలకు ఇదంతా ఎలా చెప్పాడు? ఆ తర్వాత శివ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటన్నిటిని ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
2012 లో యుగాంతం వస్తుంది అని పెద్ద ఎత్తున ప్రచారం అయిన వార్త గురించి తెలిసిందే. ప్రపంచమంతా మునిగిపోతుంది అని అన్నారు. ఇదే విషయం మీద ఇప్పుడు సినిమా వచ్చింది. ఇలాంటి నమ్మకాల వల్ల జనాలు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు అనే విషయాన్ని కాస్త కామెడీ యాడ్ చేసి డైరెక్టర్ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రయోగం.

సినిమా మొదటి నుండి కూడా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అదే పాయింట్ స్ట్రైట్ గా చూపించారు. కానీ కథ బలం మాత్రం ప్రీ ఇంటర్వెల్ లోనే పెరుగుతుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివ పాత్రలో కార్తికేయ బాగా నటించారు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా, తన ఊరి ప్రజలని ఆ నమ్మకాల నుండి బయటకు తీసుకురావాలి అని శివ మాట్లాడే డైలాగ్స్ బాగున్నాయి.

హీరోయిన్ నేహా శెట్టి పాత్ర పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తన పాత్రకి తగ్గట్టు నటించారు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వారందరికీ మంచి పాత్రలు దొరికాయి. వారందరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. దర్శకుడు కామెడీ కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ రాయకుండా, వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండే కామెడీ జనరేట్ చేయడానికి ప్రయత్నించారు. దాంతో సినిమాలో చూస్తున్నంతసేపు కామెడీ సీన్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. ఒక రకంగా సినిమాకి ఇది పెద్ద ప్లస్ అయ్యింది.

అందులోనూ నటీనటులు అందరూ కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న వారు అవ్వడంతో సీన్స్ ఇంకా బాగా కనిపించాయి. అయితే సినిమా ఒక ఫ్లోలో నడుస్తున్నప్పుడు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మాత్రం మధ్యలో ఏదో అడ్డు లాగా అనిపిస్తుంది. మణిశర్మ పాటలు కూడా అంత చెప్పుకోదగ్గట్టుగా ఏమీ లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి మరొక బలం అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం అనవసరమేమో అనిపిస్తాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- కామెడీ
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- క్లైమాక్స్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్:
- హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్
- ఫస్ట్ హాఫ్ లో సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా లోపాలు అయితే ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చూద్దాం అని అనుకునే వారికి బెదురులంక 2012 సినిమా ఒక్కసారి చూడగలిగే కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :

చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇస్రోను అభినందించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రభాస్ ఇస్రోను ట్యాగ్ చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులలో జోష్ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో తమ సంతోషాన్ని తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు అక్కడికే పరిమితం కాకుండా చంద్రయాన్ 3 మిషన్ విజయాన్ని ప్రభాస్ నటిస్తున్న సలార్ తో లింక్ చేస్తున్నారు.
చంద్రయాన్ 3 విజయం కావడం ప్రభాస్ సలార్ మూవీకి కి కలిసి వస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే 2019 జులైలో చంద్రయాన్ 2 లాంచ్ అయ్యింది, కానీ విఫలం అయ్యింది. అదే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ అయిన సాహో మూవీ కూడా నిరాశ పరిచింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. సలార్ కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుండడంతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హిట్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
సలార్ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.








సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా ‘జైలర్’. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయ్యి, తమిళంలోనే కాకుండా తెలుగులోనూ రజనీకాంత్ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్లాల్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ కీలక పాత్రలో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందించారు. జైలర్ మూవీతో రజనీకాంత్ చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. దీంతో ‘తలైవా ఈజ్ బ్యాక్’ అని రజనీ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
అయితే ఈ మూవీ గురించి తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ మాట్లాడుతూ రజినికాంత్ ఈ మూవీలో చెప్పిన డైలాగ్ ఆయన జీవితానికి సంబంధించినదే అని చెప్పారు. క్లైమాక్స్ సీన్లో రజిని తన కుమారుడితో ఏదైనా చెప్పాలని ఉందా నాన్న? అంటూ పదేపదే అడిగే సీన్ ఉంటుంది. ఆ సమయంలో రజినికాంత్ రియల్ లైఫ్ లో బాధను చూపిస్తుందని అన్నారు. ఇది డైలాగ్ మాత్రమే కాదు.
ఆయన జీవితం అని ఆ డైలాగ్ చెప్పే సమయంలో రజనీకాంత్ కి కుమార్తె ఐశ్వర్య మరియు ధనుష్ గుర్తుకు వచ్చి ఉంటారని అన్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న డిసిషన్ కాదు. దీని గురించి రజనీ తన కుమార్తెను నేరుగా అడగలేరు. అందువల్ల ఆయన ‘ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అంటూ ఐశ్వర్యను చాలాసార్లు అడిగారు’ అంటూ ప్రవీణ్ గాంధీ వెల్లడించారు.
గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.
నిర్మాత ఎస్కేఎన్ చదువుకునే రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా ఎంతో యాక్టివ్ గా ఉండటంతో ఎస్కేఎన్ అల్లు శిరీష్ పిలిపించి మరి అల్లు అర్జున్ కి పరిచయం చేశాడు. ఆ సమయంలో ఎన్నో కష్టాలు పడి, దొరికిన జాబ్ చేస్తూ, ఆ తరువాత హీరోలకు పిఆర్ చేసి, చివరకు ప్రొడ్యూసర్ గా మారాడు. ఇటీవల బేబీ మూవీతో విజయాన్ని అందుకున్న ఎస్కేఎన్, ప్రొడ్యూసర్ గా కన్నా, మెగా ఫ్యాన్ గానే ఎక్కువగా కనిపిస్తుంటాడు.
సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి సందర్భంగా పుట్టినరోజు ఏర్పాటు చేసిన ఈవెంట్ లో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన పై తనకున్న అభిమానంతో ఎస్కేఎన్ మాట్లాడారు. మామూలుగానే ఎస్కేఎన్ పంచులతో ప్రేక్షకులని అలరిస్తాడనే విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ లో అదే స్థాయిలో స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో భోళా శంకర్ ప్లాప్ గురించి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి.
“బాస్ రీఎంట్రీ తరువాత మునుపెన్నడూ లేనంత అందంగా కనిపించిన సినిమా భోళా శంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే ఫస్ట్ రీజన్ మనమే. ఎవరో ఏదో చెప్తే వారి ట్రాప్ లో పడి ఫ్యాన్స్ ఈ మూవీని ప్లాప్ డిజాస్టర్ చేసుకున్నారు అన్నట్టుగా ఎస్కేఎన్ మాట్లాడారు. ఈ కామెంట్స్ పై మెగా అభిమానులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అభిమాన స్టార్ ఏం చేసినా వీరాభిమానులకు నచ్చుతుంది. కేవలం అభిమానులకు మాత్రమే కాదు అయితే నచ్చాల్సింది ఆడియెన్స్ కూడా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరిచే సంస్థలు వేరు ధరలను కలిగి ఉన్నాయి. అయితే బొడ్డు తాడు రక్తాన్ని ఎన్ని సంవత్సరాల పాటు భద్రపరుస్తారనే విషయం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 25 సంవత్సరాల పాటు బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరచడం కోసం స్టెమ్ సైట్ అనే సంస్థ 55 వేల రూపాయలు తీసుకుంటోంది. ఇక 75 సంవత్సరాల పాటు అయితే, ధర 70 వేల రూపాయలు వరకూ ఉంటుంది. అదనంగా ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన మూవీ భోళాశంకర్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి బాగా నటించినప్పటికీ, కొన్ని సీన్ల వల్ల ఈ మూవీ నెట్టింట్లో ట్రోల్ అయ్యింది. ఆ సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో మీమ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసినా కూడా అంతగా ఈ మూవీ ప్రభావం చూపెట్టలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేక నష్టాలను మిగిల్చింది. ఆచార్య మూవీ కన్నా భారీ డిజాస్టర్ అనే టాక్ కూడా వచ్చింది.
అయితే ఒక ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో “ఈరోజు అమ్మని జైలర్ కి తీసుకెళ్ళా, సినిమా మొదలయ్యే ముందు పక్క స్క్రీన్ లో చిరంజీవి సినిమా ఆడుతుంది అని చెప్పా. అంతే ఆ తర్వాతి సెకను దానికి వెళితే అయ్యోపోయే కదా దీనికి ఎందుకు తీసుకొచ్చావు. సినిమా ఫ్లాప్ అయింది మా అంటే, చిరంజీవి సినిమా ఎలా ఉన్నా బాగానే ఉంటుంది అని అన్నారు. అదీ బాస్ అంటే” అని రాసుకొచ్చారు.
ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలలో ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ మూవీ ఒకటి. ఈ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ యూత్ పుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ, చిన్న సినిమాగా జులై 26న రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమానే ‘బాయ్స్ హాస్టల్’ అనే టైటిల్ తో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 26న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ‘బేబీ’ మూవీ యూనిట్ తో ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ ను లాంచ్ చేయించారు. అయితే ఈ ట్రైలర్ చివర్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డైలాగ్ ఉంటుంది.
ఒక కుర్రాడు ‘మేం ఆంధ్రా వాళ్లం, పక్కా తెలుగోళ్లం, తోపు కాపులురా ఇక్కడ’ అని అనగానే, మరొకరు “ఒరేయ్ తప్పు తప్పుగా మాట్లాడకు, ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్లు కూడా” అని అంటాడు. ఈ డైలాగ్ లు సాధారణంగా అయితే ప్రజలు మామూలుగా మాట్లాడుకునేవే. కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో ఇలాంటి డైలాగ్స్ అవసరమా అని అంటున్నారు.