సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ట్రెండింగ్లో ఉంది. ఆయన ప్రస్తుతం జైలర్ మూవీ విజయం సాధించడంతో సంతోషంగా ఉన్నారు. ఆగష్టు 10న రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్లలో ఇప్పటికి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మూవీ రిలీజ్కు ముందే హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే రజనీకాంత్ తిరుగు ప్రయాణంలో ఉత్తర్ప్రదేశ్లో పర్యటించారు. ఆ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసిన సందర్భంలో యోగి కాళ్ళకు రజనీకాంత్ నమస్కారం చేసిన వీడియో చూసిన నెటిజెన్లు రజినికాంత్ ని విమర్శిస్తున్నారు. దీనిపై తాజాగా రజనీకాంత్ స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై ట్రోల్స్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రజినికాంత్ ఉత్తర్ప్రదేశ్లో పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి, జైలర్ మూవీ ఆయనతో కలిసి రజినికాంత్ చూడడం జరిగింది. యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కావడానికి ఆయన నివాసానికి వెళ్ళినపుడు, యోగి రజినికాంత్ ను ఆహ్వానించడం కోసం ఎదురు వచ్చారు. ఆ సమయంలో రజినికాంత్ యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కారం చేశాడు. ఆ వీడియో క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
వయసులో రజినికాంత్ యోగి కన్నా చాలా పెద్దవాడు. యోగి వయసు చాలా తక్కువ. రజినీ తన కన్నా చిన్నవాడైన యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశాడు. తమిళనాడులో అందరూ నిన్ను ఆరాధిస్తుంటే నువ్వెళ్లి యోగి పాదాలు మొక్కుతావా? తమ ఆత్మాభిమానాన్ని కించపరిచావంటూ తమిళ ఫ్యాన్స్ మండిపడ్డారు. రజిని యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు సమర్ధిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విమర్శల పై స్పందించారు. తాజాగా చెన్నైలో అడుగుపెట్టిన రజినీకాంత్ ను మీడియా ఈ వివాదం గురించి అడుగగా, తన పై వచ్చిన విమర్శుల పై స్పందించాడు. “వయసులో పెద్ద వారైనా, చిన్న వారైనా, సన్యాసి అయినా, మఠాధిపతి, మత గురువు, యోగి, స్వామిజీ అయినవారి పాదాలకు నమస్కరించడం నా అలవాటు” అని వెల్లడించారు.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన “పవన్ కళ్యాణ్” కొడుకు అకీరా..! ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?

పవన్ కళ్యాణ్ తనయుడు, రేణు దేశాయ్ గారాల కుమారుడు అకిరా నందన్. రేణు దేశాయ్ తన కుమారుడికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అకిరా సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పటికే చాలాసార్లు ప్రచారాలు జరిగాయి. అయితే వాటిని రేణూ దేశాయ్ ఖండించింది. అయినప్పటికీ అకిరా ఎంట్రీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
అకిరా ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణూ దేశాయ్ నార్వేలో అకిరా నందన్తో ఉంది. తాజాగా అకిరా నందన్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అకిరాతో పాటు దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కూడా ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.
ఇక రాఘవేంద్ర రావుతో అకిరా కనిపించడంతో ఏదో ఉందని అనుకున్నారు. నెటిజెన్లు రాఘవేంద్ర రావుతో లాంచ్ చేయిస్తున్నారా? అకిరా యాక్టింగ్ స్కూల్లో చేరారా? అని రేణూ దేశాయ్ పై ప్రశ్నలు అడుగుతున్నారు. రేణూ దేశాయ్ నెటిజన్ల కామెంట్లకు ఇన్ స్టా స్టోరీలో జవాబు చెప్పింది. అకిరా ఏ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు. అకిరాకు ఇప్పుడు నటన పై ఆసక్తి లేదు. అకిరాకు నటించే ఆసక్తి వచ్చినపుడు ఆ విషయాన్ని ముందుగా ఇన్ స్టాగ్రాంలో అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది.












‘గన్స్ అండ్ గులాబ్స్’ 1990ల కాలంలో ‘గులాబ్ గంజ్’ అనే ఊరులో సాగే స్టోరీ. గులాబ్ గంజ్ లో గవర్నమెంట్, ఔషధ తయారీ అవసరాల కోసం ఆ ఊరి రైతులు నిషేధిత నల్లమందుకు సంబంధించిన పంటను పండిస్తుంటారు. వారి దగ్గర ఆ పంటను గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంటుంది. అదే సమయంలో ఆ ఊరిలో ఉండే ఒక గ్యాంగ్ కూడా అక్రమంగా అక్కడి రైతులతో పెద్ద మొత్తంలో నల్లమందు పంటను పండిస్తుంది. ఈ పంటను వెస్ట్ బెంగాల్ కు చెందిన పెద్ద గ్యాంగ్స్టర్ కు అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది. దీనికి షేర్పూర్ లోని వేరే గ్యాంగ్ అడ్డుపడుతుంటుంది.
నల్లమందును కొనుగోలు విషయంలో ఈ రెండు గ్యాంగ్ ల మధ్య వార్ సాగుతూ ఉంటుంది. ఈ గోడవల వల్ల ‘నార్కోటిక్ ఆఫీసర్’ గా ఆ ప్రాంతానికి అర్జున్ వర్మ ( దుల్కర్ సల్మాన్) ను నియమిస్తారు. అర్జున్ నల్లమందు మాఫియాను ఎలా అడ్డుకుంటాడు? ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? బైక్ మెకానిక్ గా పనిచేసే టిప్పు ( రాజ్ కుమార్ రావు) పాత్ర ఏమిటి? రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే పోరులో ఎవరిది పైచేయి అనేది మిలిన కథ.
ఏడు ఎపిసోడ్లు గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో టిప్పుగా రాజ్ కుమార్ రావ్ సహజంగా నటించాడు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. అర్జున్ గా ఆ క్యారెక్టర్ కి జీవం పోశాడు. వైవిధ్యమైన పాత్రలో గుల్షన్ దేవయ్య నటించాడు. అయితే రాజ్ అండ్ డీకే గత సిరీస్ ల రేంజ్ లో లేదని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ వెబ్ సిరీస్ అలరిస్తుంది.
హీరో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముఖేశ్ కుమార్ సింగ్ తెరకేకిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్న విష్ణు, ఫైనల్ గా ఈ మూవీని ప్రకటించారు. అలాగే శ్రీ కాళహస్తిలో ప్రారంభించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో మంచు విష్ణు పక్కన హీరోయిన్ గా నుపుర్ సనన్ నటిస్తోంది. ఈమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సోదరి. నుపుర్ సనన్ బాలీవుడ్ లో నటి మరియు సింగర్. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజీలో కామర్స్ పూర్తి చేసింది. ఆమె తన అక్క కృతి సనన్ అడుగుజాడల్లో నడవడానికి ముంబైకి మారింది. అక్షయ్ కుమార్ సరసన బి ప్రాక్: బి ప్రాక్: ఫిల్హాల్ అనే మ్యూజిక్ వీడియోలో నటించి, గుర్తింపు తెచ్చుకుంది.
గత ఏడాది వచ్చిన కునాల్ కెమ్ము, సౌరభ్ శుక్లా నటించిన కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్ తో ఆమె నటిగా మారింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన నూరానీ చెహ్రా మూవీలో నటిస్తోంది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు మూవీ.
ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి పై అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 సక్సెస్ అయితే తొలిసారి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన దేశంగా చరిత్ర సృష్టించనుంది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం పై అడుగుపెడుతుందని ఇస్రో వెల్లడించింది. రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం అవడంతో అన్ని దేశాల దృష్టి ప్రస్తుతం చంద్రయాన్-3 పైనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చంద్రయాన్-3 గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో ఒక ఫొటోను షేర్ చేస్తూ, కామెంట్స్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోలో ఒక వ్యక్తి లుంగీ ధరించి, టీ పోస్తున్నట్లు ఉంది. అది కూడా కార్టూన్ లా ఉంది. ఇక ఈ ట్వీట్ కు ‘బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుండి పంపించిన తొలి చిత్రం’ అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టు వ్యంగ్యంగా ఉండటంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్-3 ఇండియాకి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ గుడ్డి ద్వేషంతో శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. మరొకరు చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించిందని, బీజేపీది కాదని కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
1. కింగ్ ఆఫ్ కొత్త:
2. గాండీవధారి అర్జున:
3. బెదురులంక 2012:
4. పార్ట్నర్ :
5. బాయ్స్ హాస్టల్:
6. మన్మధుడు:
ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా 29న రీరిలీజ్ కానుంది.
అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియో షేర్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం చర్చకు దారి తీసింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ తరువాత అనసూయ ఆ వీడియో గురించి మాట్లాడుతూ మళ్ళీ ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అప్పటికీ ఆమె ఎందుకు ఏడుస్తుందో క్లారిటీగా రాలేదు. ఈ క్రమంలోనే నటి శ్రీ రెడ్డి అనసూయ వీడియో పైన ట్విట్టర్ వేదికగా స్పందించింది.
శ్రీరెడ్డి తన ట్వీట్ లో ” అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా. ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, పాపం అవి తనని బాగా బాధిస్తున్నాయి.


