సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది హీరోలు సైతం మహేష్ బాబును అభిమానిస్తారు. మహేష్ బాబు తన రేంజ్ కు తగిన స్టోరీలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ కు మరింత చేరువ అవుతున్నారు.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలలో ఒక్కడు సినిమా ఒకటి. ఈ సినిమా బ్లాక్స్ బస్టర్ అవడమే కాకుండా మహేష్ మాస్ ఆడియెన్స్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఈ సినిమాలో మార్పులు చేయడం వల్లే ఈ మూవీ హిట్ అయ్యిందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఒక్కడు’ మూవీ 2003లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న రిలీజ్ అయ్యి, ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కి మాస్ ఇమేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే అనవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమిక చావ్లా నటించగా, విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించి, మెప్పించారు.
అయితే ఈ మూవీ హిట్ అవడానికి కారణం స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులే అని తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్ ముందుగా అనుకున్న స్టోరీ ప్రకారంగా, కొండారెడ్డి బురుజు దగ్గర హీరో విలన్ ఓబుల్ రెడ్డిని కొట్టే సన్నివేశమే హీరో ఇంట్రడక్షన్ సీన్ గా రావాలి. ఆ సీన్ తర్వాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందట. అయితే ఈ కథ విన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముందుగా ఆ సన్నివేశం పెట్టడం సరి కాదని అన్నారంట.
సినిమా మొదట్లోనే అలాంటి పవర్ ఫుల్ సన్నివేశం పెట్టవద్దని గుణశేఖర్ కు సూచించారంట. దాంతో దర్శకుడు గుణశేఖర్ పరుచూరి గోపాలకృష్ణ చేసిన సూచనల ఆధారంగా కథలో కీలకమైన మార్పులు చేసి, ఇప్పుడు మనం చూస్తున్న సినిమాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఆ మార్పుల వల్లే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందట.
Also Read: ఇలాంటి సినిమాకి ఒక్క నేషనల్ అవార్డ్ కూడా రాలేదా..? ఈ సినిమా చూశారా..?

దక్షిణాది హీరోయిన్లలో నయనతార లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఆమె ఎప్పుడూ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. అత్యధిక రెన్యుమరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. గత ఏడాది దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం ప్రారంభించిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.
ప్రస్తుతం నయనతార బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే నయనతార గతంలో నటించిన ఒక ప్రకటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ యాడ్ లో ఆమె గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఆమె కాలేజీలో చదువుతున్న సమయంలో మోడల్గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది. అలా నయనతార నటించిన ప్రకటనలలో కొన్నింటిని చూసిన దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తాను తీయబోయే మనస్సినక్కరే సినిమాలో కీలక పాత్రకోసం ఆమెను సంప్రదించాడు.
మొదట్లో నయనతార ఆఫర్ను రిజెక్ట్ చేసినప్పటికీ, ఆ తరువాత దర్శకుడు వదలకుండా ప్రయత్నించడంతో చివరికి ఆమె అంగీకరించింది. అలా నయనతార 2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ అవడం, వరుస అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కాలేజీ రోజుల్లో నటించిన యాడ్ ప్రస్తుతం నెట్టింట్లో షికారు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఐడీ ఛీఫ్
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది. సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ? మత్తులో ముంచే ప్రశ్న అనేదే తల ఎత్తనీయని, మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?” అంటూ రాసుకొచ్చాడు. ఆ తరువాత మరో పోస్ట్ లో ” జై భీం కి అవార్డ్ ఇవ్వకూడదు అన్నది ఒక కాన్షియస్ డెసిషన్, మీరందరూ మరచిపోయినట్టున్నారు.
గత సంవత్సరం కూడా దళిత వాదం వైపు నిలబడ్డ, దళిత పౌరషం, రోషం చూపించిన పలాస సినిమాకి అవార్డ్ రాలేదు. కలర్ ఫోటో అని ఒక పెసిమిస్టిక్, చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు. ఈ ఉప్పెన సినిమాకి బాబు అది మూలాల్లోకి వెళితే… మన మాదిగ సోదరులు చేసి ఇచ్చే చెప్పుతో మనమే కొట్టుకోవాలి. మన సమస్యల మీద మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓట్లేసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ? వాళ్ళు కదా మాట్లాడాలి మనం మాత్రమే సోషల్ మీడియాలో ఎందుకు చించుకోవాలి ?” అంటూ రాసుకొచ్చాడు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ ఏ.ఎమ్ రత్నం పెద్ద కుమారుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 4 వారాల క్రితం ‘సమ్మోహనుడా’ సాంగ్ విడుదల అయ్యింది. ఈ సాంగ్ ను శ్రీయాగోషల్ పాడగా, అమ్రిష్ కంపోజ్ చేశారు. రిలీజ్ అయిన మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో కూడా అంతగా వ్యూస్ పొందలేదు.
అయితే పోను పోను, ఈ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమ్రిష్ ట్యూన్, శ్రీయా గోషల్ వాయిస్ నెటిజెన్ల ఆకట్టుకుంటోంది. విడుదల అయిన వారం తర్వాత ఈ సాంగ్ యూట్యూబ్లో సంచలనంగా మారి, 15మిలియన్ వ్యూస్ను పొందింది. యూట్యూబ్ లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది.
ఇక సోషల్ మీడియా ఈ సాంగ్ రీల్స్లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఫేస్ బుక్ లో సిగ్మా మీమ్స్ అనే పేజీలో ఈ పాటతో పాటు ఒరిజినల్ హిందీ సాంగ్ ను కూడా షేర్ చేశారు. 2013లో విడుదలైన ఫక్రే అనే హిందీ మూవీలోని సాంగ్ ట్యూన్ నే ‘సమ్మోహనుడా..’ కోసం కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప రాజ్ పాత్రకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆనందం వెల్లివిరిసింది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమ్రోగుతుంది. నేషనల్ అవార్డ్ తో పాన్ ఇండియాలో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపు అవుతుందని టాక్.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన సందర్భంలో సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను సోషల్లో మీడియాలో విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ మహేష్ బాబుకు రిప్లై ఇస్తూ, థ్యాంక్యూ అంటూ నలుపురంగులో ఉన్న హార్ట్ సింబల్ షేర్ చేశాడు.
బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ షేర్ చేయడంతో నెటిజెన్లు అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబుకు మాత్రమేకాకుండా మరికొందరికి కూడా బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ తో థాంక్యూ చెప్పారు. అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తుండడంతో ‘మిలాగ్రోమూవీస్’ అనే ట్విట్టర్ యూజర్ బ్లాక్ హార్ట్ సింబల్ అంటే ప్రేమ మరియు ఆప్యాయతను సూచిస్తుందని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.






ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.

అలనాటి హీరో V. K నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ, అయినా ఇష్టం నువ్వంటే, రెండు జెళ్ళ సీత, నందిని నర్సింగ్ హోమ్ వంటి చిత్రాల్లో నటించిన మంచి సక్సెస్ ని అందుకోలేక సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఎన్ని అవకాశాల కోసం ట్రై చేసిన చాన్స్ రాకపోవడంతో సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు.



