మనం అనుకున్న పనిలో విజయం సాధించాలి అంటే కష్టపడడం ఎంత అవసరమో, ఆ కష్టానికి తగ్గ గుర్తింపు రావడం కూడా అంతే అవసరం. సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు అని అంటారు. అలాంటి ఇండస్ట్రీలో ఒక్క సినిమా కోసం కొన్ని వందల మంది పనిచేస్తుంటారు.
ఇంక పెద్ద సినిమాలు అయితే వేల మంది జీవితం ఆ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక ఇండస్ట్రీలో ప్రతి విభాగంలో కష్టపడి పనిచేసి సినిమా విజయానికి వారి వంతు కృషి చేసిన వారికి అవార్డు ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ, అవార్డు అంటే ఇప్పుడు గుర్తొస్తున్న ఒకే ఒక్క విషయం నేషనల్ అవార్డ్స్. ఇటీవల జాతీయ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంత మంది ఈ అవార్డుల విజేతలని చూసి సంతోష పడితే, మరి కొంత మంది మాత్రం నిరాశ వ్యక్తం చేశారు.

గత రెండు సంవత్సరాల్లో ప్రతి ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు చూసినప్పుడు, “ఈ సినిమాకి కచ్చితంగా అవార్డు రావాలి” అని అనుకున్నారు. కానీ అలా అనుకున్న సినిమాల్లో ఒక్క సినిమా కూడా ఇందులో లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కొంత మంది నటులకి, టెక్నీషియన్లకి కూడా ఈ అవార్డుల విషయంలో అన్యాయం జరిగింది అని అంటున్నారు. ఆ విభాగాలు ఏంటో, అందులో అసలు ఎవరు గెలుచుకుంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారో ఇప్పుడు చూద్దాం.

#1 ఉత్తమ చిత్రం
ఇది మాధవన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రాకెట్రీ సినిమాకి ఇచ్చారు. కానీ ఆ టైంలో ఇంకా చాలా మంచి సినిమాలు వచ్చాయి. జై భీమ్ మాత్రమే కాకుండా, గరుడ గమన వృషభ వాహన, జనగణమన, గ్రేట్ ఇండియన్ కిచెన్, సర్పట్టా, కర్ణన్, లాంటి సినిమాలని ఇందులో పరిగణలోకి కూడా తీసుకోలేదు. వీటిలో ఏ ఒక్క సినిమాకి అయినా కచ్చితంగా అవార్డు రావాలి అని అంటున్నారు. అంతే కాకుండా తెలుగులో ఉప్పెన సినిమాకి బెస్ట్ తెలుగు సినిమా అవార్డు ఇచ్చారు. కానీ రాజ రాజ చోర లాంటి సినిమాలని పట్టించుకోలేదు అని అన్నారు.

#2 ఉత్తమ నటి
ఈ కేటగిరిలో కాటియావాడి సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన ఆలియా భట్, మిమి సినిమాలో గర్భవతి పాత్రలో నటించిన కృతి సనన్ కి అవార్డు ఇచ్చారు. ఆలియా భట్ బాగా నటించారు. ఆమెకి అవార్డు రావడం చాలా మంచి విషయం. అలాగే కృతి సనన్ కూడా తన పాత్రలో బాగా నటించారు. కానీ జాతీయ అవార్డు ఇచ్చే అంత బాగా నటించారా అంటే కాదు అని అంటున్నారు.

ఎందుకంటే జై భీమ్ లో హీరోయిన్ గా నటించిన లిజోమోల్ జోస్, అంతే కాకుండా గ్రేట్ ఇండియన్ కిచెన్ లో హీరోయిన్ గా నటించిన నిమిషా సాజయన్, కృతి సనన్ తో పోలిస్తే ఎన్నో రెట్లు బాగా నటించారు. వారికి స్పెషల్ మెన్షన్ క్యాటగిరి లో కూడా ఒక్క అవార్డు ఇవ్వలేదు అని అన్నారు.

#3 ఉత్తమ నటుడు
అన్నిటికంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది ఈ ఒక్క కేటగిరి మాత్రమే అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చాలా బాగా నటించారు. అందులో అస్సలు సందేహం లేదు. కానీ ఈ సంవత్సరం RRR లో నటించిన ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నారు. వీళ్లు మాత్రమే కాకుండా జై భీమ్ సినిమాలో హీరోగా నటించిన మణికందన్ తన నటనతో ప్రేక్షకులని కంటతడి పెట్టించారు.

అతనికి కచ్చితంగా అవార్డు వస్తుంది అనుకున్నారు. అంతే కాకుండా ముఖ్యంగా సర్దార్ ఉదం సినిమాలో విక్కీ కౌశల్, జోజి అనే సినిమాలో ఫహాద్ ఫాజిల్, సర్పట్టా సినిమాలో ఆర్య, కర్ణన్ సినిమాకి ధనుష్ ఉత్తమమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాబట్టి అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చినా కూడా, మరొకరికి కూడా ఈ అవార్డు ఇవ్వాల్సింది అని అంటున్నారు.

#4 ఉత్తమ సంగీతం
పుష్ప సినిమా పాటలు బాగున్నా కూడా జాతీయ అవార్డు వచ్చే అంత మంచి పాటలు ఇంకా చాలా సినిమాల్లో ఉన్నాయి అనే కామెంట్స్ వచ్చాయి. హిందీలో వచ్చిన షేర్షా, తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రాంబళం సినిమాలో పాటలు ఇంకా బాగుంటాయి అని అన్నారు.

#5 ఉత్తమ ఎడిటింగ్
ఈ విభాగంలో సంజయ్ లీలా భన్సాలీ అవార్డ్ గెలుచుకున్నారు. కానీ గంగుబాయి కాటియావాడి సినిమా ఎడిటింగ్ తో పోలిస్తే మానాడు సినిమా ఎడిటింగ్ ఇంకా బాగుంటుంది అని, అసలు ఇలాంటి టైం లూప్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ ఎడిటింగ్ అని, అందుకే ఈ సినిమా ఎడిటర్ కి అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు.

#6 ఉత్తమ సహాయ నటుడు
ఇది కూడా మిమి సినిమాలో నటనకి గాను పంకజ్ త్రిపాఠి అందుకున్నారు. కానీ అదే సంవత్సరం వచ్చిన సర్పట్టా సినిమాలో పశుపతి నటన చాలా బాగుంది అని ఎంతో మంది ప్రశంసించారు. దాంతో ఆయనకి అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు.
ఈ విభాగాల్లో విజేతల పై మాత్రం చాలా మంది నిరాశ వ్యక్తం చేశారు. మన తెలుగు వాళ్ళు అవార్డులు గెలుచుకోవడం చాలా గొప్ప విషయం అని, కానీ వీరితో పాటు ఇంకా కొంత మందికి కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అని అన్నారు. మరి వచ్చే సంవత్సరం అయినా ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అవార్డు ఇస్తారు ఏమో.
ALSO READ : ఇలాంటి సినిమాకి ఒక్క నేషనల్ అవార్డ్ కూడా రాలేదా..? ఈ సినిమా చూశారా..?

అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, జంటగా నటించిన ఆర్య 2 మూవీలో నవదీప్, బ్రహ్మానందం, శ్రద్ధా దాస్ కీలక పాత్రలలో నటించారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్రలో నవదీప్ నటించారు.
నవదీప్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటుడి పేరు అనుదీప్. పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అబ్బాయి ఇప్పుడు పెద్దగా అయ్యాడు. అనుదీప్ నటుడిగా కొనసాగుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో మూవీలో అనుదీప్ నటించాడు. ఈ మూవీ ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.
బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడిగా, తనికెళ్ళ భరణి కుమారుడిగా నటించిన అబ్బాయి అనుదీప్. సినిమా చివరిలో ఆ అబ్బాయి నిజస్వరూపం బయటపడడంతో సాయి ధరమ్ తేజ్ చేతిలో దెబ్బలు తినే పాత్రలో నటించాడు. పెద్దయ్యాక అనుదీప్ నటించిన తొలి మూవీ ఇదే.
రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్ లో స్కంద ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఎప్పటిలానే బోయపాటి శైలిలో ఊరమాస్ గా తెరకెక్కింది.
హీరో రామ్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. రామ్ పోతినేని గెడ్డంతో రఫ్ లుక్ లో ఉండగా, ఈ మూవి కూడా రెండు ఫ్యామిల ల మధ్య ఉండే పగ, ప్రతీకారం లాంటి అంశాలతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే స్కంద మూవీలోని ఒక సన్నివేశం వార్తల్లో నిలిచింది.
హీరో రామ్ పోతినేని ఒక మనిషిని ఒక ప్లేట్ తో చంపేస్తాడని అని ఆ సీన్ చూస్తే అర్దం అవుతోంది. దాంతో ఆ సీన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇది లాజిక్ లేని సన్నివేశం అంటున్నారు. నెటిజెన్లు ఈ సీన్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్లేట్ తో చంపి ఆ రక్తంతో అభిషేకం అని ఒకరు కామెంట్ చేశారు.


గుప్పెడంత మనసు సీరియల్ కు ఎంత పాపులారిటి ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్ లో హీరోహీరోయిన్ల క్యారక్టర్ల తరువాత ఎక్కువ పేరు, గుర్తింపు వచ్చిన పాత్ర జగతి. ఆ పాత్ర యొక్క కట్టు, బొట్టుకి ఆమెకు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాత్రను పోషించిన నటి పేరు జ్యోతి రాయ్. అయితే సీరియల్ అంత ట్రెడిషనల్ గా ఉండే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో, వీడియోలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే వైరల్ గా మారుతుంటాయి.
జ్యోతి రాయ్ వయసు 38 ఏళ్లు. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల జ్యోతి తన భర్తకి డైవర్స్ ఇచ్చిందని, యువ దర్శకుడిని రెండవ వివాహం చేసుకుందని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీటి పై జ్యోతి రాయ్ ఘాటుగా స్పందించింది. “మీకు అర్థంకాని విషయం పై విమర్శలు చేయకండి. ఎప్పటికీ మీరు నా లైఫ్ లోకి వచ్చి చూడలేరు, గుర్తుపెట్టుకోండి” అని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.
ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఇటీవల వరుసగా తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్లు, జ్యోతి రాయ్ పై మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ‘హీరోయిన్ అవ్వాల్సిన క్యారెక్టర్ ని సీరియల్ లో తల్లి పాత్ర చేసారు కదా రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.

