యాంకర్ గా రాణిస్తూ, మరొక పక్కన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామల. శ్యామల మొదట సినిమాల్లోనే చేశారు. ఆ తర్వాత యాంకరింగ్ మొదలుపెట్టారు. సీరియల్స్ కూడా చేశారు. సీరియల్స్ తో చాలా గుర్తింపు సంపాదించుకున్నారు. యాంకర్ గా ఆ గుర్తింపు ఇంకా పెరిగింది. ఎన్నో షోస్ లో శ్యామల యాంకరింగ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈస్ట్ గోదావరి లోని, కాకినాడలో శ్యామల పుట్టారు. ఎన్నో సినిమాల్లో నటించారు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత యాంకరింగ్ లో స్టార్ యాంకర్ గా ఎదిగారు.

బిగ్ బాస్ ప్రోగ్రాం లో కూడా కంటెస్టెంట్ గా వెళ్లారు. బిగ్ బాస్ నుండి వచ్చాక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. దాంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా శ్యామల పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాలో శ్యామల ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇంకా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు. శ్యామల ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉన్నారు. వైయస్ఆర్సీపీ పార్టీ తరపున శ్యామల రాజకీయాల్లో నిలబడ్డారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్యామల పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే విషయం గురించి మాట్లాడారు. శ్యామల ఈ విషయం మీద మాట్లాడుతూ, “పిఠాపురంలో గెలిచేది వంగా గీత గారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు. ఇదే విషయాన్ని 4వ తారీకు మాట్లాడుకుందాం” అని అన్నారు.
అప్పుడు యాంకర్, “సర్వేలు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్తున్నాయి” అనడంతో. శ్యామల, “సర్వేలు చెప్తున్న మాట. రిజల్ట్స్ కాదు కదా. 4వ తారీకు తెలుస్తుంది కదా. ఒకటే మాట చెప్తాను. రాజకీయాలు అంటే, ఆవేశపడడం కాదు. రాజకీయాలు అంటే అరవడం కాదు. రాజకీయాలు అంటే సహాయం చేయడం అనేది నేను నమ్ముతాను. నేను ఇప్పటి వరకు ఆయనని ఆవేశపడడం చూశాను. పొలిటికల్ గా చెప్పాలి అంటే, స్టేజ్ మీద చాలా మాట్లాడుతారు కాబట్టి ఆయాసపడడం చూశాను. ఎప్పుడూ నేను సహాయం చేసింది అయితే నేనైతే ఎక్కడా చూడలేదు” అని చెప్పారు శ్యామల.
watch video :
Anchor #Shyamala Exit Poll
"పిఠాపురం లో #PawanKalyan ఓడిపోతున్నాడు 4వ తారీకు మాట్లాడుకుందాం"
"ఆయన అరవడం ఆవేశ పడడం చూసాను గాని సహాయ పడడం ఎప్పుడు చూడలేదు" pic.twitter.com/rQ1c82bvDq
— Daily Culture (@DailyCultureYT) June 3, 2024
























మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి
‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.
రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.
అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.
మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది.
సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్లు మరియు వెబ్సిరీస్లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.


