నటసింహ బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర నటులుగా, గొప్ప ఇమేజ్ ఉన్న హీరోలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి ఉన్న ఫ్యాన్ బేస్ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి చిత్రాలు విడుదల అయితే తెలుగు రాష్ట్రాల్లో హంగామా మామూలుగా ఉండదు.
థియేటర్లలో మోత మోగాల్సిందే. వీరిద్దరు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. ఈ హీరోలిద్దరు ఎన్నోమార్లు థియేటర్లలో ఒకేసారి చిత్రాలను రిలీజ్ చేసి, బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అలాంటి హీరోలు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. మరి ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఇద్దరు అగ్రనటులే. నటనలోనూ, రికార్డ్స్ లోనూ, ఫ్యాన్ బేస్ లోను వారికి వారే సాటి. వీరిద్దరూ 60 ఏళ్ల వయసు దాటిన కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస చిత్రాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు తమ చిత్రాలతో పోటీ పడగా, రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించింది మైత్రీ మేకర్స్.
ఆ సందర్భంలో మీడియా ఇద్దరి కాంబోలో సినిమా చేస్తారా అని అడుగగా, మైత్రి ప్రొడ్యూసర్స్ చిరు, బాలయ్య కలిసి నటించడానికి ఒప్పుకుంటే ఏ ప్రొడ్యూసర్ అయిన అలాంటి ఛాన్స్ ను వదులుకుంటారా అని అన్నారు. మంచి స్టోరీ దొరికితే, ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్పారు. చిరు- బాలయ్య కాంబో కుదిరితే ఆ సినిమా నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. అయితే గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒక చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’.
ఈ సినిమాలోని ఒక సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కనిపిస్తారు. ఇక వీరు మాత్రమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా కనిపిస్తారు. ఈ చిత్రం తరువాత చిరంజీవి, బాలకృష్ణలు కలిసి మరో సినిమాలో కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుండి వీరిద్దరు కలిసి నటించాలన్న వీరి ఫ్యాన్స్ కోరికను మైత్రీ మూవీ మేకర్స్ తీరుస్తారేమో చూడాలి.

టోవినో థామస్ తెలుగు ఆడియెన్స్ సుపరిచితమైన పేరు. ఇప్పటికే ఎన్నో డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారిని పలకరించారు. ఇటీవల వచ్చిన 2018 కు తెలుగులో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. టోవినో థామస్ నటించిన ‘నీలవెలిచమ్’ అనే చిత్రం ఏప్రిల్ 23 న థియేటర్లలో విడుదల అవగా ప్లాప్ గా నిలిచింది. కానీ మే 23న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీకి మంచి స్పందన ఆడియెన్స్ నుండి వస్తోంది.
ఆషిక్ అబూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రిమా కల్లింగల్, టామ్ చాకో, రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 1964లో విడుదలైన విజయనిర్మల నటించిన ‘భార్గవి నిలయం’ చిత్రం మలయాళంలో హారర్ చిత్రాలకు స్పూర్తిగా నిలిచింది. 50 ఏళ్ల క్రితం మాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆ చిత్రం రీమేక్గా ‘నీల వెలిచమ్’ను తీశారు.
బషీర్ (టోవినో థామస్) ఒక రచయిత. స్టోరి రాయడం కోసం సముద్రం తీరంలో ఉన్న ఒక పల్లెటూరికి వస్తాడు. ఆ ఊరి చివర్లో ఉండే భార్గవి నిలయం అనే పాత ఇంట్లో అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లో భార్గవి అనే ఆత్మ ఉందని ఊర్లో వారు చెప్పుకుంటారు. వారిలో కొందరు ఆ ఆత్మను కూడా చూస్తారు. ఆ ఇంట్లోకి ఎవరూ వచ్చినా సహించని ఆత్మ అద్దెకు వెళ్ళిన బషీర్ను ఏం చేయదు. ఊర్లో వారు చెప్పే కథలు విన్న బషీర్ ఆమె మరణం వెనుక ఉన్న వాస్తవం తెలుసుకొని స్టోరీగా రాయాలని నిర్ణయించుకుంటాడు.
కథ రాసే క్రమంలో బషీర్ ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? భార్గవి ఎలా మరణించింది ? ఆమెను ప్రేమించిన శివకుమార్ మాయం అవడం వెనుక ఉన్న కారణం ఏమిటి? భార్గవి మేనమామ నారాయణన్ బషీర్ను ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు అనేదే మూవీ స్టోరి. కథ కొత్తది కానప్పటికీ, దర్శకుడు ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్గా నడిపించారు.














#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
చక్రవాకంలో ఇంద్రగా నటించిన యాక్టర్ ఇంద్రనీల్ బుల్లితెర పై సంచలనం సృష్టించారు. మంజులనాయుడు తెరకెక్కించిన ఈ సీరియల్, అప్పటి వరకు ఉన్న సీరియల్స్ ట్రెండ్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత వచ్చిన మొగలి రేకులు సీరియల్ ఇంద్ర రేంజ్ ను మరింత పెంచింది. ఇంద్రనీల్ టెలివిజన్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంద్ర అనగానే ఇంద్రనీల్ని బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపడుతున్నారంటే ఆయన క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
క్రమంగా బుల్లితెరకు దూరం అయిన ఇంద్రనీల్ చాలాకాలం తరువాత ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో సామ్రాట్ అనే పాత్రతో రీఎంట్రీ ఇచ్చారు. ఇంద్ర బాగా నటించినప్పటికీ, ఆయన పక్కన హీరోయిన్ అమ్మమ్మలా ఉందని ఆమె పాత్రను హైలెట్ చేయడానికి సామ్రాట్ పాత్రను సరిగ్గా చూపించలేదని విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఆ తరువాత ఆ పాత్ర కనిపించలేదు. ఇంద్రనీల్ కి రీ ఎంట్రీ పని చేయలేదు.
సీరియల్స్లో ఛాన్స్ లు లేకపోవడంతో ఇంద్రనీల్ ప్రస్తుతం తన భార్యతో కలిసి ఆన్ లైన్లో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించారు. ఇంద్రనీల్, మేఘనాలు ఎన్ఎమ్ ఫుడ్స్ పేరుతో అమ్ముతున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ఇంద్రనీల్ తెలుగులో టీవీ నటులకు ఆఫర్స్ చాలా తక్కువ. దానికి కారణం కన్నడ నటుల డామినేషన్ ఎక్కువగా ఉందని అన్నారు. దాంతో చాలామంది తెలుగు ఆర్టిస్ట్లు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే మేము బాగానే ఉన్నామని, చక్రవాకం ఇంద్ర అనగానే ఇప్పటికీ గుర్తుపడతారు. హీరోగా 18 డైలీ సీరియల్స్ లో నటించాను. ప్రస్తుతం సీరియల్ హీరోలు 1,2 సీరియల్స్ అనంతరం కనిపించడం లేదు. కన్నడ వాళ్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారని మాకేం ఇబ్బంది లేదు. వాళ్లలో ఎక్కువ మంది మా స్నేహితులు ఉన్నారు. తప్పు వాళ్లది కాదు. పరిశ్రమ వాళ్లది. కన్నడ లేదా తమిళ ఇండస్ట్రీలలో తెలుగువాళ్లను తీసుకోరు. అయితే తెలుగులో కన్నడవాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు.
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్ సిరీస్, పాడ్కాస్ట్లు వంటి ఇతర కంటెంట్కు కూడా వర్తిస్తాయి.














యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్ తో పాటు 2 పాటలను కూడా రిలీజ్ చేశారు. వీటికి రెస్పాన్స్ బాగా వచ్చినప్పటికీ, ప్రమోషన్ విషయంలో యూనిట్ పై విమర్శలు వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా సాంగ్స్ ను లిరికల్ గా కాకుండా పూర్తి వీడియోలు రిలీజ్ చేశారు. అంటే మూవీ కంటెంట్ లో చాలా భాగాన్ని రిలీజ్ కు ముందే చూపించినట్లు అయ్యింది.
ఇటీవల రిలీజ్ అయిన ‘రాం సీతా రాం’ సాంగ్ లో రామాయణంలోని ప్రధానమైన దృశ్యం అయిన శ్రీరాముడు సీతాదేవి కలుసుకునే సన్నివేశాన్ని చూపించారు. భావోద్వేగంతో కూడిన ఈ సిన్ ను సాంగ్ లో చూపించి పెద్ద పొరపాటు చేశారని చెప్పవచ్చు. అలాంటి ముఖ్యమైన సన్నివేశాలను ముందే చూపించడం వల్ల మూవీ ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందో తెలిసిన ఆడియెన్స్ అంతగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఇది మూవీ యూనిట్ చేసిన పొరపాటని అంటున్నారు.
ఇక ఈ మూవీని ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడంలో ‘ఆదిపురుష్’ యూనిట్ సాంగ్స్ రూపంలో విజయం సాధించింది. అయితే ఉత్కంఠటను కలిగించే సీన్స్ ముందే చూపించడం వల్ల అసలైన ఫీల్ ను ఆడియెన్స్ మిస్ అయ్యేలా మూవీ యూనిట్ చేసింది. మరి ఇక నుండి ఇచ్చే మూవీ అప్డేట్ ల విషయంలో అయినా చిత్ర యూనిట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అంటున్నారు.