ఇటీవల వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. సినిమాల రేంజ్ లో రూపొందిస్తుండడంతో వెబ్ సిరీస్ లు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఈ వెబ్ సిరీస్ లను చూడడానికి ఆడియెన్స్ కూడా ఆసక్తిని కనపరుస్తున్నారు.
వెబ్ సిరీస్ లను భారీ బడ్జెట్ తో నిర్మించడం అమెజాన్ ప్రైమ్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. బ్రీత్, ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ లను మూవీ స్థాయిలో ఖర్చు పెట్టడం వల్లే ప్రేక్షకులని ఆకట్టుకోగలిగాయి. తాజాగా రిలీజ్ అయిన ‘దహాద్’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
దహాద్ సైకో థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా లీడ్ రోల్ లో నటించింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా వైరల్ అవుతున్న విజయ్ వర్మ ఈ సిరీస్ లో విలన్ పాత్రలో నటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా వచ్చి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ దహాద్ లో కథ ఏమిటి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే మండువా అనే చిన్న సిటీలో ఊహించని విధంగా యువతులు పబ్లిక్ టాయిలెట్స్ లో బలవన్మరణానికి పాల్పడి మరణిస్తుంటారు. ఇదే విధంగా 27 కేసులు రిజిస్టర్ అవుతాయి.
ఈ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంజలి భాటి (సోనాక్షి సిన్హా)కి అదే సిటీలో ఒక కాలేజీలో లెక్చరర్ పనిచేస్తున్న వ్యక్తి (విజయ్ వర్మ) పై అనుమానం కలుగుతుంది. కానీ ఆమెకు ఎటువంటి ఆధారాలు లభించవు. ఇక ఈ కేసుల ఒక్కో చిక్కుముడిని సాల్వ్ చేస్తూ వెళ్లే క్రమంలో పోలీస్ ఆఫీసర్ అంజలి మరియు ఆమె కొలీగ్స్ కి విస్మయం కలిగించే అనేక విషయాలు తెలుస్తాయి. ఆ విషయలు ఏమిటి? చివరికి అంజలి హంతకుడిని ఎలా పట్టుకుంది అనేది కథ.
ఈ సిరీస్ ను 8 ఎపిసోడ్లతో రూపొందించారు. అయితే ట్రైలర్ లోనే విలన్ ఎవరనేది చూపించారు. విలన్ తప్పించుకునే క్రమంలో హత్యలను ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా చూపించారు.
Also Read: “స్టైల్ అదిరింది..!” అంటూ… పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” పోస్టర్పై 15 మీమ్స్..!



















ఫిల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లీడర్’. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటిదాకా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లాంటి చిత్రాలను తీసిన శేఖర్ కమ్ముల సడెన్ గా పొలిటికల్ డ్రామాతో లీడర్ సినిమాను తీశారు. ఈ చిత్రంతో దగ్గుబాటి వారసుడు రానా హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం ప్రొడక్షన్స్ నిర్మించారు.
2010లో ఫిబ్రవరి 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తొలి ఆటతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ను వచ్చాయి. కానీ తరువాత రోజుల్లో ఎక్కువగా వసూళ్లు సాదించలేకపోయింది. ఎగ్జామ్స్ సీజన్ లో ఈ సినిమా రిలీజ్ అవడంతో బ్రేక్ ఈవెన్ చేయలేక అబౌవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. వేరే సమయంలో రిలీజ్ అయితే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉండేది. అయినా ఈ మూవీ క్లాసిక్ గా నిలిచింది. అర్జున్ ప్రసాద్ గా రానా నటన అత్యద్భుతం. మొదటి సినిమా అనే ఫీలింగ్ ఆడియెన్స్ కి కలిగించకుండా అద్భుతంగా నటించాడు.
ఈ చిత్రంలోని పాటలను వేటూరి గారు రాశారు. ఆయన రాసిన వందేమాతరం పాటఎంతో అర్ధవంతంగా ఉంటుంది. ఈ పాటలోని “చితిలోనే సీమంతం” పదానికి అర్ధం ఏమిటని ‘రంగుల రాట్నం’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చర్చ జరిగింది. అందులో భాగంగా ఇలా చెప్పుకొచ్చారు. “సాధారణంగా సీమంతం పుట్టబోయే బిడ్డ బాగుండాలని జరుపుకుంటారు. ఈ పాటలో పుట్టబోయే బిడ్డని రాబోయే తరంతో పొలుస్తున్నారని తెలిపారు. వచ్చే తరం కూడా అవినీతిలో ఉంటుందని, ఆరని రావణకాష్టంలో వచ్చే తరాలు కూడా ఆహుతు అవుతున్నాయి” అని వివరించారు.
ఒక లైలా కోసం మూవీ తరువాత పూజా హెగ్డే వెనుదిరిగి చూడాల్సి రాని విధంగా ఓ రేంజ్ లో టాలీవుడ్ లో దూసుకెళ్లింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుని టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా నిలిచింది.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అయితే వరుసగా ఫ్లాప్ లతో ఇప్పుడు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు ఆమెను సెంటిమెంట్ గా అనుకునే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమెకు తమ సినిమాలలో ఛాన్స్ ఇవ్వడానికి వెనుకడుతున్నారు. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా పూజా హెగ్డే తల్లి కూతురి పెళ్లి గురించి కొన్ని కండిషన్స్ వెల్లడించింది. మదర్స్ డే సందర్భంగా పూజా హెగ్డే తన తల్లితో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పూజ తల్లికి కూతురికి ఎలాంటి భర్త కావాలని అనుకుంటున్నారనే ప్రశ్నను అడగడంతో ఆమె తన అభిప్రాయన్ని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ “తన కుమార్తెను అన్ని విధాలుగా అర్ధం చేసుకోగల వ్యక్తి గురించి చూస్తున్నామని, పెళ్లి అనేది ఎప్పటికీ నిలిచి ఉండాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలని, అప్పుడే వారి మధ్య గౌరవం పెరుగుతుంది. అలాంటి వ్యక్తి దొరికితే పూజను ఇచ్చి పెళ్లి చేస్తామని” వెల్లడించింది.





















ఈ సినిమా గురించి నెల రోజులుగా సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారని టాక్. మే 31న ఈ మూవీ నుండి అప్డేట్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తరువాత వస్తున్న మొదటి జయంతి కావడంతో ఘట్టమనేని అభిమానులకు మూవీ అప్డేట్ తో సంతోషం కలిగించాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారన్నది ఇంకా ఫైనల్ కాకపోయినా 6 టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఏమిటంటే..
1. అయోధ్యలో అర్జునుడు:
2. అమ్మకథ:
3. అమరావతికి అటు ఇటు:
4. గుంటూరు కారం:
5. ఊరికి మొనగాడు:
6. పల్నాడు పోటుగాడు:
ఈ మూవీ కథ పల్నాడు బ్యాగ్డ్రాప్తో సాగుతుందట. దాంతో ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారంట.