దర్శకధీరుడు రాజమౌళి తీసిన చిత్రం బాహుబలి… దీంతో ప్రాంతీయ చిత్రాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. అయితే పక్క భాషలో క్రేజ్ ఉన్న హీరోతో సినిమా తీస్తే అది బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని దర్శకులు భావించడం .. అలాగే పక్క రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకులతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ కొట్టేయొచ్చు అని హీరోలు అనుకోవడం ఎప్పటినుంచో జరుగుతుంది.
అయితే గత కొంత కాలంగా మన తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఏమాత్రం కలిసి రావడం లేదు. కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోలకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురవుతోంది. ఈ లిస్టులో మహేష్ బాబు ‘స్పైడర్’, విజయ్ దేవరకొండ ‘నోటా’, అలాగే రామ్ పోతినేని ‘ది వారియర్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలను తమిళ దర్శకులే తెరకెక్కించారు. ఇప్పుడు ఈ లిస్టులో నాగ చైతన్య ‘కస్టడీ’ కూడా చేరింది.

దీంతో టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేస్తే ఫ్లాపే అన్న సెంటిమెండ్ బలపడింది. ఈ నేపథ్యం లో మెగా ఫాన్స్ కి కొత్త భయం పట్టుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ల్ రాజు నిర్మాణంలో హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

ఇప్పుడు ఈ మూవీ విషయంలో ఎక్కడ కోలీవుడ్ డైరెక్టర్ల బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో అని మెగా అభిమానులు వర్రీ అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే తమిళ దర్శకులతో వర్క్ చేసేందుకు టాలీవుడ్ హీరోలు భయపడతారు అనడంలో సందేహం లేదు. అలాగే మరోవైపు ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్ కూడా ఈ మూవీ పైనే ఆధార పడి ఉంది.

ఈ మధ్య కాలంలో దిల్ రాజుకు అటు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా భారీ షాకులు తగిలాయి. దిల్ రాజుకు గత నెల రోజుల్లో ఏకంగా 35 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయని సమాచారం. శాకుంతలం, కస్టడీ సినిమాల ఫలితాలు దిల్ రాజుకు భారీ షాకిచ్చాయి. గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధిస్తే దిల్ రాజుకు ఈ నష్టాలు అన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇక భారీ అంచనాలున్న చరణ్ శంకర్ కాంబో మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యమవుతోంది.

సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సౌమ్యా రావు, అనుకోకుండా ‘జబర్దస్త్’ షో యాంకర్ గా మారింది. ఈ షోలో చలాకీగా, తన మాటలతో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సౌమ్య రియల్ లైఫ్ లో చాలా సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా సౌమ్యా రావు తల్లి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. మదర్స్ డే రోజున సౌమ్యా రావు తన తల్లి వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ, చివరి రోజుల్లో తల్లి పడిన బాధను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది.
తన తల్లి పడిన నరకయాతన మరో తల్లికి రాకూడదని ఎమోషనల్ అయ్యారు. “అమ్మ, డాక్టర్లు, అంబులెన్స్, మందులు, ట్రీట్మెంట్, బాధ. అది ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దేవుడికి ఎన్ని పూజలు, ఉపవాసాలు చేసినా వృథా అయ్యాయి. అమ్మా నువ్వు లేకుండా నా లైఫ్ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు మళ్లీ నా కోసం పుడతావని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దేవుడా నా తల్లిదండ్రులను మళ్ళీ నాకు ఇవ్వు” అంటూ తన తల్లికి మదర్స్ డే విషెస్ చెప్తూ సౌమ్యా రావు ఎమోషనల్ అయ్యారు. సౌమ్య రావు పోస్ట్ చూసిన నెటిజెన్లు ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు జీవితంలో కొల్పోయిన ఆనందాలను దేవుడు తిరిగి ఇస్తాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి సీజన్ లాగే ఈ ఐపీఎల్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. యశస్వి తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బక్క పల్చగా ఉండే యశస్వి కొడుతున్న సిక్సర్లు చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారని చెప్పవచ్చు. ఆడే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో వలె ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రీసెంట్ గా ఆడిన మ్యాచ్లో 98 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో అతను వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి, తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే అది క్రికెట్కు సంబంధించిన విషయంలో కాదు.
యశస్వి జైస్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని బాలనటుడిని పోలి ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్రమార్కుడు సినిమాలో ఒక బాల నటుడు హీరో రవితేజతో కలిసి ఒక సన్నివేశంలో నటించాడు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.

1. ప్రభాస్ – 100-150 కోట్లు:
2. సైఫ్ అలీ ఖాన్ – 12 కోట్లు:
3. కృతి సనన్ – రూ. 3 కోట్లు:
4. సన్నీ సింగ్ – 1.5 కోట్లు:
5. సోనాల్ చౌహాన్ – రూ. 50 లక్షలు:
1. విజయనిర్మల :
2. భానుమతి:
3. సావిత్రి:
4. జీవిత రాజశేఖర్ :
5. రేవతి :
6. బి జయ:
7. సుచిత్రా చంద్రబోస్:
8. సుధా కొంగర:
9. నందిని రెడ్డి:
10. శ్రీప్రియ:
11. రేణు దేశాయ్ :
12. ఘట్టమనేని మంజుల :
13. కంగనా రనౌత్ :
14. లక్ష్మీ సౌజన్య:
15. గౌరీ రోనంకి:























దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ ని టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు కలెక్షన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డబ్ అయిన చిత్రాలకు యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ రావడంతో ఛత్రపతి సినిమాని భారీ లెవల్ లో హిందీలో రీమేక్ చేశారు. కానీ 55 లక్షల వసూళ్లతో మూవీ యూనిట్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.
రెండవ రోజు 45 లక్షలు సాధించి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం తేలిపోయింది. ఈ మూవీ కోసం గత నెల రోజులుగా సినిమా కోసం చాలా ఏరియాల్లో ప్రమోషన్స్ చేశారు మూవీ యూనిట్. కానీ ఇలాంటి ఓపెనింగ్స్ ను చూసి చిత్ర యూనిట్ నిరాశ పడుతున్నారు. బాలీవుడ్ లో అంతగా ఎఫెక్ట్ చూపని ఈ చిత్రం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కోటి 20 లక్షల నుండి కోటిన్నర వరకు మేకర్స్ ఖర్చు పెట్టారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఛత్రపతి హిందీ సినిమా ఫస్ట్ డే 60 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక పోయింది. ఇక ఈ మూవీకి పెన్ స్టూడియోస్ సంస్థ సుమారు అరవై కోట్లు బడ్జెట్ పెట్టిందట. అయితే మూవీ రిలీజ్ కు ముందే ఆ డబ్బుని పలు రకాల రైట్స్ గా రాబట్టుకుందని తెలుస్తోంది. అయితే ప్రమోషన్ కి పెట్టిన ఖర్చులో 10 శాతం కలెక్షన్స్ కూడా ఈ మూవీ 2 రోజుల్లో సాధించలేకపోయింది. ఇది ప్రొడ్యూసర్స్ కి భారం అని టాక్.