విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. శ్రీలీల హీరోయిన్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. పోస్టర్ చాలా క్రియేటివ్గా ఉంది.
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై విజయ్ ఫేస్ కనిపించడం విశేషం. హీరో కళ్ళలో ఇంటెన్స్ కనిపిస్తోంది. అలాగే ఆ పోస్టర్ పై `నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు, అనామక గూఢచారి` అని రాసి ఉంది.

ఈ మూవీ లో విజయ్ స్పైగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ కాంబినేషన్ లో మరో చిత్రం అనే సరికి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ మూవీ పోస్టర్ కాపీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ఆర్గో’ అనే హాలీవుడ్ సినిమా పోస్టర్ ను పోలి ఈ పోస్టర్ ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ సినిమాకి ఈ సినిమా కాపీ అనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి.

దీంతో నిర్మాత నాగ వంశీ రంగంలోకి ఇది.. ‘మాది కాపీ సినిమా కాదు. పోస్టర్ అనేది వేరు. ఇది కో ఇన్సిడెన్స్ అని కూడా అనుకోవచ్చు’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయితే గాని ఈ ఊహాగానాలకు తెరపడదు.

ఇక మరో వైపు విజయ్ దేవరకొండ నటించబోతున్న మరో సినిమా అప్ డేట్ కూడా వచ్చింది. తనకు గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి స్టార్ హీరోని చేసిన దర్శకుడు పరశురామ్తో విజయ్ మరో సినిమా చేస్తున్నారు. `వీడీ13` పేరుతో రూపొందే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. విజయ్కి బర్త్ డే విషెస్ చెబుతూ టీమ్ అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించబోతున్నామని పేర్కొంది.










తొలిప్రేమ మూవీ సూపర్హిట్ అవడంతో పాటు వాసుకి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె సినిమాలలో నటిస్తూ బిజీగా మారుతుందని అందరు అనుకున్నారు. కానీ వాసుకి ఆ మూవీ తరువాత యాక్టింగ్ మానేసి, తొలిప్రేమ మూవీ ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆమె పిల్లలు, ఫ్యామిలీ జీవితంతో బిజీ అయిపోయింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత వాసుకి ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరో సంతోష్ శోభన్ సిస్టర్ క్యారెక్టర్ లో వాసుకి నటిస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విందా మూవీస్, స్వప్న సినిమా సంస్థల పై ప్రియాంక దత్, స్వప్న దత్, ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో నటించిన వాసుకి మీడియాతో మూవీ విశేషాలు మరియు ఆమె మళ్ళీ సినిమాలలో నటించడానికి గల కారణాలను వెల్లడించారు.
వాసుకి మాట్లాడుతూ ‘‘తొలిప్రేమ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు నటించడం కుదరలేదు.పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు వీటితో నటించడం కుదరలేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు పెద్దగా అయ్యారు. యూకేలో పాప మెడిసిన్, బాబు ఆర్కిటెక్చెర్ చదువుతున్నారు. నా భర్త తన పనిలో బిజీగా వుంటారు. దాంతో ప్రస్తుతం ఏదైనా చేయడానికి నాకు టైమ్ కుదిరింది. ఇలాంటి టైమ్ లోనే డైరెక్టర్ నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ కథ చెప్పారు. ఆ కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించానని వెల్లడించారు.


మహేష్ వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరుగుతోంది. తనయుడు గౌతమ్ పక్కన నిలబడితే బ్రదర్స్ లా కనిపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే దేశవ్యాప్తంగా మహేష్ కు మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇరవై ఏళ్ల కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే జోష్తో కొనసాగుతున్నారు. అయితే మహేష్ మూవీ షూటింగ్ లో ఉంటారు. లేదంటే కటుంబంతో కలిసి గడుపుతారు. పక్కా ప్యామిలీ పర్సన్.
ఒక్క రూమర్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా మహేష్ ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం మహేశ్ 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ మూవీ తర్వాత, రాజమౌళి సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మూవీ మహేష్ కెరిర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఈ మూవీ షూటింగ్ మొదలు కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులను కేటాయించబోతున్నాడని, అందుకే ఈ మూవీకి 110 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.



పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ మరియు నటుడు అయిన సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతం’ రీమేక్ గా తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించారు. మళ్లీ ఈ చిత్రంలో దేవుడి పాత్రలో ఆడియెన్స్ ని అలరించబోతున్నారు.
ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఈ చిత్రంలోపవన్ తన పాత్ర షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దేవర దేవుడు, దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
“బ్రో” అనే టైటిల్ ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే సాయిధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ని సినిమాలో “బ్రో” అని పిలుస్తాడని, అందువల్ల అదే టైటిల్ గా పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ కి మాత్రం అంత మంచి స్పందన రావట్లేదు. సోషల్ మీడియాలో ఈ టైటిల్ ఇప్పటికే వైరల్ అయ్యింది. టైటిల్ చూసిన చాలా మంది, “అసలు పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన టైటిల్ ఇదేనా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారట.
నాలుగేళ్లకి పైగా ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. 2021లో ఈ జంట విడాకులు తీసుకుని, విడిపోయారు. నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుండి ఇద్దరి పర్సనల్ విషయాల గురించి తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక డివోర్స్ గురించి చైతూ, సామ్ లకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నయి. ఈ క్రమంలో కస్టడీ ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల పై స్పందించారు.
తమ డివోర్స్ అయిపోయిందని, ఇద్దరం ఒకేసారి సోషల్ మీడియాలో ప్రకటించామని, ఇది ముగిసిపోయిందని, ఇంకా ఈ విషయాన్ని ఎందుకు సాగదీస్తున్నారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. అయిన కొంతమంది తమ న్యూస్ హెడ్ లైన్స్ కోసం ఇలా సాగదీయడం చాలా తప్పు అని చెప్పుకొచ్చారు. కొత్త చిత్రాలు రిలీజ్ అయిన శుక్రవారం రోజే అంతా డిసైడ్ అయిపోతుందని అన్నారు. అలాగే తన చిత్రాలు రిలీజ్ అయినపుడు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్, రేటింగ్స్ చూస్తానని అన్నారు.
ఆ కామెంట్స్ చూస్తే కొన్నిసార్లు ఎందుకు ఇంకా బ్రతుకున్నామో అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆడియెన్స్ వైపు నుండి కూడా ఆలోచిస్తానని చెప్పారు. ఇక నాగచైతన్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కస్టడీ చిత్రం పై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12న విడుదల చేయనున్నారు.


1. సీతారామ కళ్యాణం:
2. సంపూర్ణ రామాయణం- 1958:
3. లవకుశ:
4. పాదుకా పట్టాభిషేకం:
5. వీరాంజనేయ:
6. సంపూర్ణ రామాయణం:
7. శ్రీ రామాంజనేయ యుద్ధం:
9.సీతా రామ వనవాసం:
10. శ్రీరామ పట్టాభిషేకం:
11. రామాయణం:
12. శ్రీరామరాజ్యం:
బాపుగారు దర్శకత్వం వహించిన మరో పౌరాణికం సినిమా ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చిత్రానికి రీమేక్ లాంటింది. ఈ చిత్రంలో రాముడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. సీతగా నయనతార నటించింది.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 16 న రిలీజ్ కాబోతుంది.