నటుడు, దర్శకుడు, రచయిత మనోబాల మే 3వ తేదీన కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోబాల మరణించారు. ఆయన మరణం పై చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈయన అనేక చిత్రాల ద్వారా తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు. ఆయన చివరిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య.
అయితే ఇండస్ట్రీలో నటుడిగా.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోబాల జనవరిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. మనోబాల చివరి రోజుల్లో దుర్బర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది.

మనోబాల యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియో ని అప్లోడ్ చేసారు ఆయన కుటుంబ సభ్యులు. ఇందులో మనోబాల ని మాట్లాడించటానికి ఆయన కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడ్డారు. ఎంత ప్రయత్నించినా ఆయన మాట్లాడలేకపోయారు. ఆయన కొడుకు హరీష్ ఒక పాటని పాడగా ఆయన విని సంతోషించారు. కదల లేని స్థితిలో ఉన్న ఆయనకు అసిస్టెంట్ భోజనం తినిపించారు.

సినిమాల్లో ఎంతో యాక్టీవ్ గా ఉండి.. అందర్నీ నవ్వించే మనోబాల ఇలా వీల్ చైర్ కే పరిమితం అవ్వడం చూసిన ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ వీడియో ని చూస్తే కన్నీళ్లు ఆగట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నటుడు దర్శకుడు అయిన మనోబాల కి ‘మనోబాల’స్ వేస్ట్ పేపర్’ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో తెరవెనుక జరిగే సరదా సంఘటనలు, సెలెబ్రెటీల ఇంటర్వ్యూ లు, రివ్యూస్ వంటి రకరకాల వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు.

మనోబాల లివర్ సంబంధిత వ్యాధికి గురయ్యారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్లు సమాచారం. అయితే గతం లో ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన అనారోగ్యం గురించి వెల్లడించారు. “నేను రోజుకి దాదాపు 100 నుంచి 200 సిగరెట్స్ తాగుతా.. దీంతో కాలేయం దెబ్బతిందని డాక్టర్స్ చెప్పారు. ఇప్పటివరకు సంపాదించినంత డబ్బంతా చికిత్స కోసమే ఉపయోగించా.. సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్ల చనిపోతానని ముందే వైద్యులు చెప్పారు..” అని గతంలో తెలిపారు మనోబాల.
watch video :

మహేష్ వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరుగుతోంది. తనయుడు గౌతమ్ పక్కన నిలబడితే బ్రదర్స్ లా కనిపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే దేశవ్యాప్తంగా మహేష్ కు మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇరవై ఏళ్ల కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే జోష్తో కొనసాగుతున్నారు. అయితే మహేష్ మూవీ షూటింగ్ లో ఉంటారు. లేదంటే కటుంబంతో కలిసి గడుపుతారు. పక్కా ప్యామిలీ పర్సన్.
ఒక్క రూమర్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా మహేష్ ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం మహేశ్ 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ మూవీ తర్వాత, రాజమౌళి సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మూవీ మహేష్ కెరిర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఈ మూవీ షూటింగ్ మొదలు కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులను కేటాయించబోతున్నాడని, అందుకే ఈ మూవీకి 110 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.



పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ మరియు నటుడు అయిన సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతం’ రీమేక్ గా తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించారు. మళ్లీ ఈ చిత్రంలో దేవుడి పాత్రలో ఆడియెన్స్ ని అలరించబోతున్నారు.
ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఈ చిత్రంలోపవన్ తన పాత్ర షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దేవర దేవుడు, దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
“బ్రో” అనే టైటిల్ ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే సాయిధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ని సినిమాలో “బ్రో” అని పిలుస్తాడని, అందువల్ల అదే టైటిల్ గా పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ కి మాత్రం అంత మంచి స్పందన రావట్లేదు. సోషల్ మీడియాలో ఈ టైటిల్ ఇప్పటికే వైరల్ అయ్యింది. టైటిల్ చూసిన చాలా మంది, “అసలు పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన టైటిల్ ఇదేనా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారట.
నాలుగేళ్లకి పైగా ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. 2021లో ఈ జంట విడాకులు తీసుకుని, విడిపోయారు. నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుండి ఇద్దరి పర్సనల్ విషయాల గురించి తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక డివోర్స్ గురించి చైతూ, సామ్ లకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నయి. ఈ క్రమంలో కస్టడీ ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల పై స్పందించారు.
తమ డివోర్స్ అయిపోయిందని, ఇద్దరం ఒకేసారి సోషల్ మీడియాలో ప్రకటించామని, ఇది ముగిసిపోయిందని, ఇంకా ఈ విషయాన్ని ఎందుకు సాగదీస్తున్నారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. అయిన కొంతమంది తమ న్యూస్ హెడ్ లైన్స్ కోసం ఇలా సాగదీయడం చాలా తప్పు అని చెప్పుకొచ్చారు. కొత్త చిత్రాలు రిలీజ్ అయిన శుక్రవారం రోజే అంతా డిసైడ్ అయిపోతుందని అన్నారు. అలాగే తన చిత్రాలు రిలీజ్ అయినపుడు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్, రేటింగ్స్ చూస్తానని అన్నారు.
ఆ కామెంట్స్ చూస్తే కొన్నిసార్లు ఎందుకు ఇంకా బ్రతుకున్నామో అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆడియెన్స్ వైపు నుండి కూడా ఆలోచిస్తానని చెప్పారు. ఇక నాగచైతన్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కస్టడీ చిత్రం పై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12న విడుదల చేయనున్నారు.


1. సీతారామ కళ్యాణం:
2. సంపూర్ణ రామాయణం- 1958:
3. లవకుశ:
4. పాదుకా పట్టాభిషేకం:
5. వీరాంజనేయ:
6. సంపూర్ణ రామాయణం:
7. శ్రీ రామాంజనేయ యుద్ధం:
9.సీతా రామ వనవాసం:
10. శ్రీరామ పట్టాభిషేకం:
11. రామాయణం:
12. శ్రీరామరాజ్యం:
బాపుగారు దర్శకత్వం వహించిన మరో పౌరాణికం సినిమా ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చిత్రానికి రీమేక్ లాంటింది. ఈ చిత్రంలో రాముడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. సీతగా నయనతార నటించింది.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 16 న రిలీజ్ కాబోతుంది.


సిల్క్ స్మిత ఎలాంటి సినినేపథ్యం లేకుండా మేకప్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి, స్టార్ గా ఓ వెలుగు వెలిగారు. సిల్క్ స్మిత తన నిషా కళ్లతో ఆడియెన్స్ ని మాయలో పడేసింది. అప్పట్లోనే గ్లామర్ రోల్స్ లో నటించింది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్ మనసుల్లో ఆమె అలాగే ఉండిపోయింది. దశాబ్దం పాటు ఇండస్ట్రీలో వందలాది సినిమాలలో నటించిన ఆమె, చివరకు బలవన్మరణానికి పాల్పడి, కన్నుమూసింది. ఆమె మరణం చాలా మందిని కలిచివేసింది.
అయితే ఆమె మరణించిన తరువాత ఇండస్ట్రీ నుండి ఒక్క హీరో కానీ, డైరెక్టర్స్, నిర్మాతలు ఎవరు వెళ్లలేదు. ఆఖరికి ఆమె కుటుంబసభ్యులు కూడా సిల్క్ స్మితను చూడాటానికి వెళ్లలేదు. దాంతో సిల్క్ స్మితకు అనాథ శవంలా అంతిమ సంస్కారాలు చేశారు. అయితే ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సిల్క్ స్మిత అందాల తారగా నిలిచిపోయింది. ఇటీవల రిలీజ్ అయిన దసరా మూవీలో కనిపించిన సిల్క్ స్మిత పోస్టర్ తో ఆమె జీవితం వార్తల్లో నిలిచింది.
అచ్చం సిల్క్ స్మిత లాగే కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సిల్క్ స్మిత అని పిలుస్తున్నారు. ఆమె పేరు విష్ణు ప్రియ. ఫేస్ మాత్రమే కాకుండా ఎక్స్ప్రెషన్స్తో సైతం ఆమె సిల్క్ స్మితను గుర్తు చేస్తుంది. అంతే కాకుండా విష్ణుప్రియ సిల్క్ స్మిత సాంగ్స్ కు రీల్స్ చేస్తూ నెట్టింట్లో సందడి చేస్తోంది. విష్ణు ప్రియ జూనియర్ సిల్క్ గా పాపులర్ అయ్యింది.
2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం.
ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్లలో తక్కువగా, చిన్న స్క్రీన్లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు. వసూళ్ల పరంగా మొత్తం ఓపెనింగ్ వీకెండ్ గ్రాస్ 18 కోట్లకు పైగా ఉంటుంది. 2018 మలయాళం సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.