తమిళ ఇండస్ట్రీలో హీరో అయినా కూడా, తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య. తెలుగులో ఉన్న హీరోలకి సమానంగా సూర్యకి కూడా గుర్తింపు ఉంటుంది. సూర్య సినిమా విడుదలవుతోంది అంటే, ఒక తెలుగు సినిమా విడుదల అయినప్పుడు ఎంత సందడి ఉంటుందో, సూర్య సినిమా విడుదల అయినప్పుడు కూడా అంతే సందడి ఉంటుంది. తెలుగులో అసలు తమిళ హీరోలకి క్రేజ్ రావడం మొదలు అయ్యింది కూడా సూర్యతోనే. అంతకుముందు రజనీకాంత్, కమల్ హాసన్ సంగతి వేరే. వాళ్లని ఎప్పుడూ తెలుగు సినిమా మన నటులు అన్నట్టే అనుకుంటుంది.

కానీ సూర్య నటించిన గజిని సినిమా తర్వాత సూర్య తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యారు. ఆ తర్వాత ఇంకా చాలా మంది హీరోలు కూడా సూర్యలాగానే తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యారు. కానీ సూర్య అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సూర్య ప్రముఖ నటి జ్యోతికని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలం క్రితం సూర్య కూతురు దియా పదవ తరగతి మార్కు షీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. అందులో దియాకి 97% మార్కులు వచ్చాయి. ఇప్పుడు దియా ముంబైలో చదువుకుంటోంది. దియా ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో దియా కి 96% మార్కులు వచ్చినట్టు తెలుస్తోంది.
మార్కుల పరంగా చూస్తే, తమిళ్ లో 96 మార్కులు, ఇంగ్లీష్ లో 97, అకౌంట్స్ లో 94, ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు సాధించింది. మొత్తంగా చూస్తే 600 మార్కులకి 581 మార్కులు సాధించి 96.83 శాతం ఉత్తీర్ణతతో పాస్ అయ్యింది. సూర్య పిల్లలు లైమ్ లైట్ కి దూరంగానే ఉంటారు. ఒక సందర్భంలో సూర్య తన పిల్లలతో కలిసి బయటికి వచ్చినప్పుడు, అక్కడ ఉన్న కెమెరా వాళ్లు సూర్య పిల్లలని కూడా ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుంటే, సూర్య తన పిల్లలని ఫోటో తీయొద్దు అని చెప్పారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ప్రత్యేకంగా సూర్య పిల్లలు బయటికి రారు.


















మలయాళ హీరో కున్చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్చకో బొబన్) ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు.
అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ.
లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.
