ఈ ఏడాది మలయాళంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ రోమాంచం. ఈ చిత్రాన్ని రెండు కోట్ల బడ్జెట్ తో తీశారు. టోటల్ రన్ లో 42 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 69 కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ విడుదల అయ్యింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ హిట్ అవడంతో ఇతర భాషా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూశారు. ఈ మూవీ దక్షిణాది భాషల్లో డబ్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఓటీటీలో ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. టేక్ ఆఫ్ కి 30 నిముషాల సమయం పట్టగా, ఆ తర్వాత స్టోరిలో ఇంట్లోవారు ఒక ఆత్మని పిలవడం జరుగుతుంది.
ముందు ఏదో అనుకున్నప్పటికి, ఆ ఆత్మ ఊహించని ప్రశ్నలకు కూడా జవాబు చెప్తుంది. అంతేకాకుండా ఆ ఆత్మ ఇంట్లో వారిలో ఒక్కరి ప్రాణం కావాలనుకుంటోందని తెలుస్తుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగింది అనేదే ఈ చిత్రం. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించింది. అయితే సెకెండ్ ఆఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. ఆ తరువాత క్లైమాక్స్ కు ముందు కాసేపు బాగుంటుంది.
అయితే సినిమాకి ముగింపు ఇవ్వలేదు. ఏం జరిగిందో పార్ట్ 2 లో చూడండి అన్నట్టు చెప్పడంతో ప్రేక్షకులు ఊహించిన రేంజ్ లేదని చెప్పవచ్చు. థియేటర్స్ లో జనాల మధ్యన కూర్చుని చూసినపుడు కొన్ని సన్నివేశాలకి నవ్వుకునే అవకాశం ఉంటుంది. ఓటీటీలో చూసినపుడు మాత్రం అలాంటి అనుభూతి అయితే రాలేదు.

ఈ సినిమా విజయం సాధించడంతో ఆ సింగర్స్ కి కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. వారు ఈ సినిమా కన్నా ముందు బుల్లితెర పై ప్రసారం అయిన ‘రేలారే రేలా’ప్రోగ్రామ్ లో పాటలు పాడారు. రంగస్థలం సినిమా తరువాత వారు వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని అంతా అనుకున్నారు. మరి ఏమయ్యిందో తెలియదు కానీ ఆ తరువాత ఆ సింగర్స్ ఎ సినిమాలోనూ పాడలేదు. వారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారనేది చాలామందికి తెలియదు. అయితే ఆ సింగర్స్ ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
ఈ మూవీలో ‘లచ్చవ్వ’ పాత్రను చూసి కంటతడి పెట్టని వారు లేరని చెప్పవచ్చు. లచ్చవ్వ ఏడుస్తూ మూవీ చూసిన అందర్నీ ఏడిపించేసింది. ఈ క్యారెక్టర్ లో అంతలా ఒదిగిపోయి నటించిన నటి పేరు రూపలక్ష్మి. హీరోయిన్ తల్లిగా, హీరోకి మేనత్త పాత్రలో నటించిన రూప లక్ష్మి బుల్లితెర పై సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ‘బలగం’చిత్రంతో వెండితెర పై కూడా గుర్తింపు తెచ్చుకుంది.
రూపలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా తెలిపారు. తన తండ్రి రైతు అని, ఆయనకు ఆరుగురు సంతానం అని, తనను ఒక లెక్చరర్కి దత్తతగా ఇచ్చారని తెలిపారు. అయితే తాను ఇప్పటికకి కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని చెప్పారు.అయితే సినిమాలో లచ్చవ్వ పాత్రలో గ్రామీణ మహిళగా కనిపించిన రూపలక్ష్మి నిజ జీవితంలో స్టైలిష్ లుక్లో కూడా ఉంటారు.అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారంట. బలగం మూవీతో క్రేజ్ తెచ్చుకున్న రూపలక్ష్మి తన స్టైలిష్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.





దూరదర్శన్ ఛానెల్ లో చిన్నచిన్న పాత్రలలో నటించానని ఆయన తెలిపారు. విజయ్ యాదవ్ తనకు ఎక్కువగా అవకాశాలు ఇప్పించారని చెప్పారు. తనది 86 వ బ్యాచ్ అని, అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేదని అన్నారు. చేశారు. తన జీవితంలో ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్స్ చాలా జరిగాయని కోట జయరాం వెల్లడించారు. సినిమాలలో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులని అన్నారు.
ఒక మూవీ షూటింగ్ సమయంలో నేను బాగా నటిస్తుండడంతో జయరాం పై ఫోకస్ చేస్తానని కెమెరామేన్ చెప్తే, దానికి కో డైరెక్టర్, ఆయన పై ఎందుకు పక్కనే ఉన్న కుక్క పై పెట్టు అన్నాడట. అతను అన్న ఆ మాటకు చాలా బాధ కలిగిందని, కుక్కకు ఉన్న మర్యాద ఆర్టిస్ట్ కి లేదా అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. కోట జయరాం ఇండస్ట్రీలో తనకు జరిగిన అవమానాల గురించి చెప్పిన విషయలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి బలగం చిత్రంలో ఐలయ్య పాత్రను తన స్నేహితుడు చేయాల్సిందట. అతను చేయనని చెప్పడంతో ఆపాత్ర జయరాం దగ్గరకు వచ్చిందట. డైరెక్టర్ వేణు కోట జయరాంని ఆడిషన్ చేసిన, 3 నెలల తరువాత బలగం సినిమాలో ఎంపిక అయినట్లు తెలిపారు. అలా బలగం సినిమాలో తనకు అవకాశం వచ్చిందని జయరాం వెల్లడించారు.
సమంత, దేవ్ మోహన్ నటనని మెచ్చుకుంటున్నారు. 3D ఎఫెక్ట్ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటన ఆకట్టుకుందని అంటున్నారు. మొదటిసారి కెమెరా నటించినప్పటికి ఎలాంటి భయం లేకుండా బాగా నటించిందని, అర్హ కనిపించేది కాసేపయినా తన నటనతో ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ఇక మణిశర్మ అందించిన సంగీతం బాగుందని అంటున్నారు. అయితే కొందరు ‘శాకుంతలం’ బాగుందని చెప్తుంటే, కొందరు బాగోలేదని చెబుతున్నారు.
కొందరు ఈ మూవీ యావరేజ్ అని అంటున్నారు. కొందరు రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టించాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వస్తోంది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికి ఎవరికీ కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. కాగా ప్రీమియర్స్ తో మూవీ అసలు టాక్ ను అంచనా వేయలేమని చెబుతున్నారు.
”మౌనంగా నిలబడినప్పటికి మీ కళ్ళు చాలా మాట్లాడతాయి. మీ కళ్ళు మీ మనసుకు అద్దం లాంటిది. అవి ఏం చెప్తున్నాయో నేను అర్థం చేసుకోగలను. వాటికి ఒక వ్యక్తిత్వం ఉంది. మీ కళ్ళలో ఎప్పుడూ ఏదో ఉంటుంది. మీరు ఎప్పుడు తెరపై కనిపించినా నేను మీ కళ్ళనే చూస్తూ ఉంటాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ కళ్ళే చెప్తాయి. శకుంతలని మీ కళ్ళు చాలా అర్థం చేసుకున్నాయి. శకుంతలగా మీ అమాయకత్వం, మీ జాలి నాకు ప్రపంచంలో ఉన్న మంచితనాన్ని కాపాడాలనే ధైర్యాన్ని ఇచ్చాయి.
మీరు ఏడుస్తున్నప్పుడు చాలా బాధగా కనిపిస్తారు. అలా చూసినప్పుడు నాలాంటి వాళ్ళకి అది ఒక సీన్, మీరు ఒక నటి అనే విషయం గుర్తుకి రాదు. బహుశా ఇందుకు కారణం మన మధ్య ఉన్న బంధం ఏమో. మేము మీ సంతోషం గురించి ప్రార్థించే అంత దగ్గర అయ్యాము. మీరు మా కుటుంబమే సామ్.

తారకరత్న, అలేఖ్య రెడ్డి ప్రేమించుకుని, పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడిప్పుడే జీవితంలో ఆనందంగా ఉంటున్న సమయంలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అలేఖ్యను ఎంతగానో కృంగదీసింది. ఎంతగా అంటే తారకరత్న మరణించి 2 నెలలు అవుతున్నప్పటికి అలేఖ్య ఇంకా భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు.
అలేఖ్య రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో తారకరత్న పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలేఖ్య రెడ్డి నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం అయినా ఉండలేకపోతున్నా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు అలేఖ్య రెడ్డి ఈ బాధ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
ఇక నందమూరి తారకరత్న జనవరి 27న నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మొదలైన కాసేపటికే తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయారు. దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పటల్ లో చేర్చారు. ఆయన అక్కడే ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.
ఈ క్రమంలో మీడియా నుండి ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు సంతోషంగా అమాయకంగా కనిపించే హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారింది అని మీడియా అడిగింది. సమంత మాట్లాడుతూ ఒకప్పుడు నా జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు. దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక అదే స్క్రీన్ పైన కనిపించేది. కానీ నా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా కూడా తమ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు స్ట్రాంగ్ గా అవుతారు.
అలా నేను కూడా మారాను, అందుకు నేనేమీ ప్రత్యేకం కాదు. నా లైఫ్ లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి. వాటివల్ల నా లైఫ్ నాశనం కాకూడదని, దానికి తగినట్లుగా మారి ముందుకు వెళ్తున్నానని చెప్పారు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మధు బాల, అల్లు అర్హ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించగా, నిలిమా గుణ నిర్మిస్తున్నారు.

