స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ఈ మూవీ ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఈ నేపద్యంలోనే సమంత ఇటీవల మీడియాతో ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు.
శాకుంతలం స్టోరిని గుణ శేఖర్గారు చెప్పినపుడు సర్ప్రైజ్ అయ్యాను. ఎంతోమంది ఇష్టపడే శకుంతల పాత్రను చేయడం పెద్ద బాధ్యతగా అనిపించింది. దాంతో భయపడి మొదట గుణ శేఖర్గారు అడిగినపుడు నో చెప్పాను. అప్పుడే ఫ్యామిలిమెన్ లో రాజీ పాత్రను చేశాను. అయితే శకుంతల క్యారెక్టర్ దానికి పూర్తిగా భిన్నమైన పాత్ర. ఈ పాత్రలో ఎంతో అందంగా, గౌరవంగా కనిపించాల్సి ఉంటుంది. శాకుంతల పాత్రకి న్యాయం చేశానని అనుకుంటున్నానని తెలిపారు.
ఈ క్రమంలో మీడియా నుండి ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు సంతోషంగా అమాయకంగా కనిపించే హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారింది అని మీడియా అడిగింది. సమంత మాట్లాడుతూ ఒకప్పుడు నా జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు. దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక అదే స్క్రీన్ పైన కనిపించేది. కానీ నా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా కూడా తమ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు స్ట్రాంగ్ గా అవుతారు.
అలా నేను కూడా మారాను, అందుకు నేనేమీ ప్రత్యేకం కాదు. నా లైఫ్ లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చాయి. వాటివల్ల నా లైఫ్ నాశనం కాకూడదని, దానికి తగినట్లుగా మారి ముందుకు వెళ్తున్నానని చెప్పారు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు, మధు బాల, అల్లు అర్హ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించగా, నిలిమా గుణ నిర్మిస్తున్నారు.

watch video :
https://twitter.com/Sravanthi_sam/status/1645422731532414976



తాజాగా మెగా డాటర్ నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తమ పెళ్లి ఫోటోలతో పాటుగా, చైతన్యతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేసింది. అయితే ఒక్క ఫొటోను మాత్రం తొలగించలేదు. పెళ్లి మండపంలో నిహారిక చైతన్య పక్కనే కూర్చుని పెదాలపై వేలు ఉంచి ష్.. అనే ఫొటో. ఇందులో చైతన్య బ్లర్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోకి ‘నా వద్ద ఒక సీక్రెట్ ఉంది. కానీ దానిని మీకు చెప్తే అది రహస్యం ఎలా అవుతుంది? సారీయే, అని క్యాప్షన్ పెట్టి, షేర్ చేసింది.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో ఒకటి మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు? మర్చిపోయి అలాగే ఉంచేసావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటో మాత్రమే కాకుండా పెళ్లిలో చైతన్య లేకుండా ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను అలాగే ఉంచేసింది.
Also Read:
1. ఖుషీ:
2. నందమూరి బాలకృష్ణ చిత్రం:
3. నేచురల్ స్టార్ నాని సినిమా:
4. సలార్:
Also Read:
షారుఖ్ ఖాన్ నటన పై ఉన్న ఆసక్తితో సినిమాలలో ప్రయత్నిస్తూనే, టెలివిజన్ లో వచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకున్నాడు. డిడిలో టెలికాస్ట్ అయిన సర్కస్ సీరియల్ లో నటించి, ఎంతో పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దీవానా, బాజీగర్, డర్, కుచ్ కుచ్ హోతాహై లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ బాద్షాగా షారుఖ్ ఖాన్ ఎదిగాడు. ఆ సమయంలో షారుఖ్ కు ఆయన భార్య గౌరీ ఆర్ధికంగా తోడ్పడుతూ అండగా నిలబడిందని షారుఖ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
బాలీవుడ్ లో తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గౌరీ ఇచ్చిన ప్రోత్సాహమే అని కింగ్ ఖాన్ చెప్పాడు. ఈ అందమైన జంట లవ్ స్టోరి సినిమాకి తక్కువ కాదని చెప్పవచ్చు. షారుఖ్ ముస్లిం, గౌరీ పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వీరి ప్రేమను గౌరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అందువల్ల పెళ్లి సమయంలో షారూఖ్ పేరుని హిందువుగా అనుకునేలా అభినవ్ అనే పేరును పెట్టానని గౌరీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: 

సిద్దూ మూసేవాలా చిన్న వయసులోనే గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ చనిపోయిన తరువాత సంపాదిస్తోంది. యూట్యూబ్ పాలసీల ద్వారా, వ్యూవ్స్ ద్వారా రాయల్టీలు ఇస్తోంది. ఒక వీడియో లేదా ఒక పాట కానీ మిలియన్ వ్యూస్ పొందినట్లయితే యూట్యూబ్ దానికి 1000 డాలర్లను ఇస్తుంది. రీసెంట్ గా రిలీజ అయిన సిద్ధూ కొత్త సాంగ్ 18 మిలియన్ల పైగా వ్యూస్ సంపాదించింది. అందువల్ల ఈ పాటకు యూట్యూబ్ ప్రస్తుతానికి రూ. 14.3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పాటకు మరిన్ని వ్యూస్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఇవే కాకుండా సిద్ధూ మూసేవాలా వింక్, స్పాటిఫై లాంటి ప్లాట్ఫామ్ల నుండి రాయల్టీ మరియు అడ్వర్టైజ్మెంట్ డీల్స్ ద్వారా చనిపోయిన తరువాత కూడా తన పాటల వల్ల రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియోలో సిద్దు గాత్రానికి నైజీరియన్ గాయకుడు రాప్ ను అందించారు. ఈ వీడియోలో టెక్నాలజీ సహయంతో సింగర్ సిద్దు మూసే వాలా కనిపించేట్లుగా చేశారు.
Also Read: 


అంతగా పాపులర్ అయిన నాగరాజు సినిఇండస్ట్రీలో రాణిస్తాడని అందరు అనుకున్నారు. కానీ అతడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాల గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. నాగరాజు గురించి అతని మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం..
సింగర్ నాగరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిత అనే యువతిని ప్రేమించానని, అయితే తమ వివాహానికి అనిత ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో విడిపోయామని తెలిపాడు. ఆ బాధతోనే ‘అనిత ఓ అనిత’ పాటను రాశానని, ఈ సాంగ్ రాయడం కోసం నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు. తాను ఆ పాట రాయడానికి ముందు ఆర్కేస్ట్రాలో గాయకుడిగా చేసేవాడినని అన్నారు. తాను రాసిన మొదటి పాట ‘అనిత’ సాంగ్ ను తానే పాడినట్లు తెలిపారు.
అప్పట్లో నేను మరణించానని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ సమయంలో చాలా బాధ పడ్డానని తెలిపారు. అప్పుడు హైదరాబాద్ అంతా కొత్తగా అనిపించింది. దాంతో భయపడి మా ఊరికి వెళ్లిపోయాను. అనితకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. నాకు దేవిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకి చెవిటి, మూగ. చిన్నబాబు కూడా పెద్దవాడిలానే సైగలే చేస్తాడని అన్నారు. కొంతకాలం పాటు పాన్షాపుతో నెట్టుకొచ్చానని, కళామతల్లి కాపాడుతుందని ఫ్యామిలీతో పాటు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యామని తెలిపారు. ప్రస్తుతం తాను అనిత-2 పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

