Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని శ్రీవల్లి, సామి సామి పాటలు అపూర్వ ప్రజాదరణ పొందాయి. ఈ పాటలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో విస్తృతంగా ఉపయోగించారు.
ఈ తెలుగు సినిమా తాజాగా రష్యాలో విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఆ దేశవ్యాప్తంగా పుష్ప ఫీవర్ పట్టుకుంది. రష్మిక మందన్న ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిన సామీ సామీ పాటను ప్రస్తుతం రష్యా అభిమానులు ఆస్వాదిస్తున్నారు. రష్మిక మొదలు పెట్టిన ట్రెండ్ని ఫాలో అవుతూ రష్యా అభిమానులు ఈ పాటకు చేస్తున్న డాన్స్ లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద ఉన్న స్టేట్ హిస్టారికల్ మ్యూజియం ముందు రష్యా మహిళల బృందం ‘సామీ సామీ’ పాటకు కాలు కదిపింది. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు.
ఈ డాన్స్ క్లిప్ను ఆడిటర్గా ఉన్న నటాలియా ఒడెగోవా అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో మహిళల డాన్స్ చేస్తుండగా, ఒక పాప వారిని అనుకరించి ఆకట్టుకుంది. బుధవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. పుష్ప సినిమా డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప-ది రైజ్ రష్యన్ భాషా ట్రైలర్ విడుదలైంది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది
అల్లు అర్జున్ మరియు పుష్ప టీం ఇప్పటికే ప్రమోషన్స్లో బిజీగా ఉంది. గురువారం మాస్కోలో పుష్ప ప్రీమియర్షోను ప్రదర్శించారు. దీనికి కథానాయకుడు అల్లు అర్జున్, నాయిక రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. అంతే కాకుండా డిసెంబర్ 3న సెయింట్పీటర్స్బర్గ్లో మరో ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. అల్లు అర్జున్ మరియు అతని బృందం ఇటీవల దీనికి సంబంధించి విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.



















#2
#3
#4
#6
#7
#8
#9
#11
#12
#13
#14
#16
#18
ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ లగ్జరీ కారు ఖరీదు రూ. 1.34 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాకూడా, తాజాగా కొత్త కారును కొన్నారు. త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ కారు కొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు రంగును చూస్తే, BMW 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారుగా అంచనా వేయబడింది. కారు ఖరీదు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ బీఎండబ్ల్యూ కారును తన భార్యకు బహుమతిగా ఇచ్చారని సమాచారం.
డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఇప్పటికే చాలా వేదికలపై తన నృత్య ప్రదర్శన చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్, మహేష్ SSMB28 సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.
ఎందుకంటే ‘ఆచార్య’లో చిరంజీవి హీరోగా నటించగా, రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ‘లూసిఫర్’ రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించాడు. గాడ్ ఫాదర్ కి పాజిటివ్ టాక్ వచ్చి, వసూళ్లు కూడా బాగానే ఉన్నా, ఫలితం మాత్రం హిట్ అయితే కాలేదు. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలూ నిరాశపరిచాయి.దీంతో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అయిన రవితేజ సినిమాల్లోకి రావడానికి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవే కారణం అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. రవితేజ ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో మెగాస్టార్ తమ్ముడిగా నటించాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది.
























ఈమధ్య కాలంలో మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాల్లో ఉండటం కూడా ఈ మూవీ పై ప్రభావం చూపిందని అంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ మూవీగా నిలిచిన జిన్నా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీకి దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో రఘు బాబు, అన్నపూర్ణమ్మ, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, చమ్మక్ చంద్ర, తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఇక అమెజాన్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొంచెం సందేహం వచ్చిన రీషూట్స్,రీ ఎడిటింగ్స్, డిస్కషన్స్ లాంటివి తప్పకుండా చేస్తారు. అయితే ‘దూత’వెబ్ సిరీస్ విషయంలోనూ అలాంటిదే జరుగుతోందని తెలుస్తోంది. అదీ కాకుండా ప్రస్తుతం దర్శకుడు విక్రమ్, నాగచైతన్య ఫామ్ లో లేరు. ఇద్దరు థాంక్యూ సినిమాతో చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అందువల్ల ‘దూత’వెబ్ సిరీస్ ని విడుదల చేయడం వల్ల బజ్ ఉండకపోవచ్చని అమెజాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య నటించే సినిమా ఏదైనా హిట్ అయిన్నప్పుడు కానీ, ‘దూత’ పై మంచి బజ్ వచ్చాక కానీ ఈ సిరీస్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ లో కంటెంట్ కి సమస్య లేదు. దాంతో ఈ వెబ్ సిరీస్ ను హోల్డ్ లో ఉంచారని సమాచారం. అయితే అమెజాన్ సంస్థ ఈ సిరీస్ విడుదల అవనప్పటికి ‘దూత2’ కోసం స్క్రిప్ట్ రాయమని విక్రమ్ కుమార్ ని కోరిందని తెలుస్తోంది. అంటే దూత రెండవ సీజన్ కూడా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది. నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’అనే మూవీలో నటిస్తున్నారు.