స్వయం కృషి తోనే చిరంజీవి మెగాస్టార్ గా రాణించారు. అయితే.. ఆయన కొత్త గా వచ్చే నటులకు.. తనకింద పని చేసేవారిపట్ల కూడా ఎంతో సహృదయం గా మెలుగుతూ ఉంటారు. నేటితరం నటీనటులకు ఆయన ఆదర్శం గా నిలుస్తున్నారు. ఇటీవల కరోనా కాలం లో కూడా చిరంజీవి ముందుకొచ్చి తోచినంత సాయం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా లంకేశ్వరుడు సినిమా కు కో డైరెక్టర్ గా పని చేసిన ప్రభాకర్ చిరు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తనకు సాయం చేయకపోయి ఉండుంటే.. తన పిల్లల చదువులు పూర్తి అయ్యేవి కాదన్నారు. తాను డైరెక్టర్ గా “హెల్ప్ లైన్” అనే సినిమా తీశానని.. కానీ ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదన్నారు. ఈ సినిమా కు దర్శక, నిర్మాత బాధ్యతలు తీసుకుని నష్టపోయానని.. పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందిపడ్డానన్నారు. ఈ విషయాన్నీ చిరు ముందుకు తీసుకువెళ్తే.. ఆయన వెంటనే స్పందించి ఫీజు ఏర్పాటు చేశానన్నారు. అప్పటిదాకా.. కాలేజీ ఫీజు ఇన్ టైం లో కట్టని కారణం గా ఎగ్జామ్ రాయనివ్వని యాజమాన్యం.. చిరంజీవి సాయం చేసారని చెప్పగానే.. సహకరించారన్నారు. రామ్ చరణ్ సహా స్టాఫ్ అంతా తనకు సాయం చేశారన్నారు.

తెలుగు సీరియల్స్ లో టాప్ రేటింగ్ తెచ్చుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం లాంటి సీరియల్ టో పోటీ పడిన ఈ సీరియల్ తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ పొందింది. సీరియల్ లోని హీరోహీరోయిన్లకు ధీటుగా జగతి మేడం పాత్రలో జ్యోతి రాయ్ ఆకట్టుకున్నారు. తన కట్టు బొట్టు, హుందాతనంతో ఆడియెన్స్ ని ఫిదా చేశారు. అయితే ఈ పాత్ర మరణించింది. ఆమె లేని సీరియల్ ని ఆడియెన్స్ చూడలేకపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫహోటవలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది.
సీరియల్ చాలా హుందాగా ఉండే జ్యోతి రాయ్ నెట్టింట్లో మాత్రం గ్లామర్, హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తోంది. ఆ మధ్య పర్సనల్ విషయాలతో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ తో పాటు, పలు కన్నడ చిత్రాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. సీరియల్ లో తల్లి పాత్ర చేసిన జ్యోతి బయట ట్రెండీ వేర్స్ ధరించి, యంగ్ గా కనిపిస్తుంది. ఆమె ఏజ్ ఎంత అని అభిమానులు చాలా రోజుల నుండి అడుగుతూ ఉన్నారు.
తాజాగా అభిమనులతో చిట్ చాట్ చేసిన జ్యోతి రాయ్ ని ‘మీ ఏజ్ ఎంతో చెప్పగలరా’ అని అడుగగా, పాన్ కార్డ్ లో పుట్టిన తేదీని చూపించింది. అందులో 1994లో జన్మించినట్టు ఉంది. అంటే జ్యోతి ఏజ్ 30 సంవత్సరాలే కావడంతో షాక్ అవుతున్నారు. తల్లి పాత్ర చేయడంతో ఆమె వయసు ఎక్కువగా ఉంటుందని భావించారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.










ఇక కథ విషయానికి వస్తే, అనుపమ(ప్రియమణి) అమాయకపు గృహిణి. ఆమె ఒక అపార్ట్మెంట్ లో భర్త మోహన్, కొడుకు వరుణ్తో కలిసి నివసిస్తుంటుంది. యూట్యూబ్లో సొంత కుకింగ్ ఛానెల్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటలు చేస్తుంటుంది. అయితే ఆమెకు ఇతరుల ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడూ కిటికీలోంచి ఇతరులను గమనిస్తూ, అపార్ట్మెంట్ లో పనిచేసే పనిమనిషి శిల్ప నుండి వారి విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరుకారం మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించగా, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావు రమేష్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలోని టైటిల్ సాంగ్ ధమ్ మసాలా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి, ఆకట్టుకుంటోంది. ఈ పాటలో మహేష్ బాబు పక్కన స్టెప్స్ వేసిన ఒక సైడ్ డ్యాన్సర్ హైలైట్ అయ్యింది.
ఆ అమ్మాయి ఎవరా అని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ఫల్గుణి బంగేరా. ఆమె డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. ఆమె ఒమన్లో పుట్టి పెరిగింది. ఫాల్గుణి తన కెరీర్ ను కొనసాగించడానికి ఇండియాకి వచ్చారు. బుల్లితెర పాపులర్ డ్యాన్స్ షోలు అయిన ఢీ 10, ఆట 6 జూనియర్స్ లో ఉన్న కొరియోగ్రాఫర్లలో ఆమె కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ హీరోల పాటలకు పని చేసింది. టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్తో కలిసి ఫల్గుణి కొరియోగ్రఫీ చేశారు.
వెంకీ మామా, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్, అలా వైకుంఠపురములో, భీష్మ వంటి సినిమాలకు పనిచేసింది. తమిళ సినిమాలకు కూడా ఫల్గుణి వర్క్ చేసింది. ఎన్నో పాటల్లో కనిపించింది. ఆమె సినిమాల్లో పనిచేయడమే కాకుండా ఆన్లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా తీసుకుంటుంది. ఆమె యశ్వంత్ మాస్టర్ తో కలిసి అనేక స్టేజ్ షోలు మరియు ప్రత్యేక కార్యక్రమాలలో కనిపించింది. ఆమె ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా ప్రత్యేక నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫల్గుణిని ఇన్ స్టాగ్రామ్ లో 163K ఫాలో అవుతున్నారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి అభినందిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అలీ, సందీప్ రెడ్డి వంగా నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ లు కూడా వెళ్లి చిరంజీవిని అభినందించారు. తాజాగా నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ షేర్ చేసింది.అందులో ‘‘ బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకోవడానికి అర్హులు. ఆయన కరోనా టైమ్ లో చేసిన సేవ ఎనలేనివి. కానీ ఆయనకు ఏ పొలిటికల్ లీడర్ ని కాకాపట్టడం తెలియదు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజెన్లు ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు. పూనమ్ కౌర్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సామాజిక మధ్యమాలలో యాక్టీవ్గా ఉంటూ తరచూ వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె కామెంట్స్ నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.