మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాకి ఎన్నో రోజుల నుంచి మంచి హైప్ ఉంది. వస్తూ వస్తూనే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనుకునే సినిమా తీరా విడుదలైన తర్వాత యావరేజ్, అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. మామూలు ప్రేక్షకులకే కాకుండా మహేష్ బాబు వీరాభిమానులకు కూడా ఈ సినిమా కొంచెం నిరాశనే మిగిల్చింది.

మహేష్ బాబు ఈ సినిమాలో జీవించేసినా కూడా త్రివిక్రమ్ డైరెక్షన్, తమన్ పాటలు ఆ హైప్ ని ఇవ్వలేకపోయాయి. ఇది అసలు త్రివిక్రమ్ తీసిన సినిమాయేనా అని త్రివిక్రమ్ వీరాభిమానులు నిరాశ పడిపోతున్నారు. మామూలుగా త్రివిక్రమ్ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి వేరియేషన్ చూపిస్తారు కానీ గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ ముందు చేసిన సినిమాలన్నిటి కలయిక క్షుణ్ణంగా కనిపిస్తుంది.
ఈమధ్య అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది పెద్ద హీరోల సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు అభిమానులు. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న తర్వాత ఒక ఫ్యామిలీ డ్రామా మామూలు సినిమా అనేసరికి అందరూ తెగ నిరాశ పడిపోయారు. ఈ సినిమాలో కూడా చూడడానికి మహేష్ బాబు తప్ప ఇంకేది అంత ఆసక్తికరంగా లేదు. పాటలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి, ఒక సరైన కథ లేదు బాబుకి హీరోయిజం సీన్స్ లేవు, కామెడీ అక్కడక్కడ వర్క్ అవుట్ అయినా కూడా బాబుని చూపించే రీతి ఇది కాదు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

అయినా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని కచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తర్వాత వచ్చేది రాజమౌళి సినిమా. అది రాడానికే కనీసం మూడేళ్లయినా పడుతుంది అప్పటివరకు స్క్రీన్ మీద చూసే వీలు కూడా ఉండదు. ఇప్పుడే చూసేయాలి. కానీ త్రివిక్రమ్ అలా వైకుంఠపురం సినిమా తర్వాత నాలుగేళ్లు టైం తీసుకుని ఇచ్చిన ఔట్పుట్ చాలామందిని సాటిస్ఫై చేయలేకపోయింది. కొంచెం కథ మార్చి, బాబుకి హీరోఇజం ఎక్కువ ఇచ్చుంటే హీట్ అయ్యేదేమో గుంటూరు కారం.




























తేజ సజ్జా:
వరలక్ష్మీ శరత్ కుమార్:
వినయ్ రాయ్:
వెన్నెల కిశోర్:
హనుమాన్ మూవీలో నటించిన ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ రాజ్ దీపక్ శెట్టి రూ. 85 లక్షలు, గెటప్ శ్రీను 35 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.









తెలుగు సీనియర్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, వాసుకి లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. జనవరి 5 నుండి ఈ సిరీస్ ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. 90లలో ఉన్న మధ్యతరగతి పిలల్ల జీవితాల్ని ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు.
శివాజీ, వాసుకి భార్యభర్తలుగా చక్కగా నటించగా, వారి ముగ్గురు పిల్లలకు మంచి పేరు వచ్చింది. వీరిలో పెద్ద అబ్బాయిగా నటించిన బాలనటుడి పేరు మౌళి తనుజ్ ప్రశాంత్. ఇప్పటికే మౌళి సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీ. అతన్ని 4 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సైతం ఉంది. ఇదివరకే ‘హాస్టల్ డేస్’ సిరీస్ లో నటించాడు.
శివాజీ చిన్న అబ్బాయి ఆదిత్యగా నటించి, పాపులర్ అయిన బాల నటుడి పేరు రోహన్ రాయ్. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాలలో నటించాడు. ఈ సిరీస్ తో మరింత పాపులర్ అయ్యారు. శివాజీ కూతురు దివ్యగా నటించిన వాసంతిక సలార్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఈ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.