వర్షాకాలం వచ్చిందంటే దోమలు దండయాత్ర మొదలు పెట్టేస్తాయి. తేమ వాతావరణం వల్ల అవి ఎక్కువగా వేడిని కోరుకుంటాయి. అయితే దోమలు మనలో కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. ఫలానా రక్తం ఉన్న వారు, బ్లడ్ షుగర్ ఉన్నవారు, వెల్లుల్లి లేదా అరటి పండ్లను తినే వారిని, మహిళలను ఎక్కువగా కుడతాయన్న అపోహలు ఉన్నాయి.
కానీ అవి కేవలం కొంతమందినే ఆకర్షించేందుకు వేరే కారణాలు ఉన్నాయి. శరీర వేడి, వాసనని బట్టి అవి ఎక్కువగా కుడతాయి అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మన చర్మం నుంచి వెలువడే ఓ తరహా వాసన దోమలను ఆకర్షిస్తుందని ఒక పరిశోధనలో తేలింది.

దోమలకి అయస్కాంతంగా మారిపోవడానికి కారణం వారి చర్మంపై అధిక స్థాయిలో కార్బాక్సిలిక్ ఆమ్లాలు అని తేలింది. ఇవి దోమలని విపరీతంగా ఆకర్షించుకుంటాయి. ఈ ఆమ్లం మన శరీరం నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల మనం దోమలను ఎక్కువగా ఆకర్షించుకుంటాం. చర్మం పై సహజ మాయిశ్చరైజర్ లేయర్ లో కార్బోక్సిలిక్ యాసిడ్స్ భాగం. ఒక్కొక్కరి శరీరం ఒక్కో విధంగా దీన్ని విడుదల చేస్తుంటుంది.

జంతువులతో పోల్చినప్పుడు మానవులు అధిక మొత్తంలో కార్బాక్సిలిక్ యాసిడ్ను విడుదల చేస్తారు. అందుకే దోమలు మనుషుల్ని ఎక్కువగా కుడతాయి. ఒక వ్యక్తి ఆహారం లేదా అలవాట్లు మారినప్పటికీ..ఉత్పత్తి చేయబడే కార్బాక్సిలిక్ యాసిడ్ స్థాయిలు మాత్రం మారడం లేదు. అందుకే దోమలు ఇటువంటి వాళ్ళని ఎక్కువగా కుడుతున్నాయి.

శరీర వాసనతో పాటు రంగు, శరీర వేడి, మద్యం వాసనకి కూడా దోమలు ఆకర్షితులుగా మారతాయి. చర్మ ఉష్ణోగ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడే దోమలు కూడతాయి. అందుకే అధికంగా చేతులు, కాళ్ళపై కుడతాయి. అంతే కాకుండా బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా ఇందులో తేడాలుంటాయి అని పరిశోధనల్లో వెల్లడైంది.










1. పాలు:
2. తేనే:
3. టీ:
కానీ మటన్ తిన్న తరువాత వెంటనే టీ తాగవద్దు. మటన్ తిన్న తరువాత టీ తాగడం వల్ల కడుపులో అజీర్ణం, మంటను కలుగుతుంది.
హలీం లేదా ఆలివ్ గింజలని ఎలా తినాలి..?







రాత్రి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయినప్పుడే మంచి నిద్ర పడుతుంది. అందువల్ల భోజనానికి మరియు పడుకునే వేళకి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి. లేకపోతే నిద్ర సంబంధితమైన ఇబ్బందులు మొదలవుతాయి. తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు కనీసం 2 గంటల సమయం పడుతుంది. అందువల్ల తిన్న తరువాత పడుకోవడానికి మధ్య 2 గంటల గ్యాప్ ఉండేలా చూసుకుంటే మంచిది.
ఇక రాత్రివేళ 8 గంటల లోపు డిన్నర్ చేయనట్లయితే పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రక్తంలో షుగర్ స్థాయి పెరిగి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సమయానికి ఆహారం తినడమే సరైన పరిష్కారం అని చెప్పవచ్చు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎసిడిటి, అల్సర్ లాంటి సమస్యలు కూడా రావచ్చు.
ఇక జీర్ణక్రియ అనే ప్రక్రియ సరిగ్గా జరగాలన్నా కూడా వేళకి ఆహారం తీసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా రాత్రి పూట త్వరగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో కారం ఎక్కువగా తీసుకోకపోవడం, ఘాటైన మసాలాలను తగ్గిస్తే మంచిది. రాత్రి పూట ఆహారంలో సలాడ్లు, పండ్లు, జ్యూస్లు ఉండేలా చూసుకోవాలి.
Also Read: