ఇల్లరికం వచ్చిన ఓ అల్లుడు చేసిన పనికి ఆ అత్తింటివారు ఆశ్చర్యపోయారు. ఇల్లరికం వచ్చిన అల్లుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. అతనికి ఇంత డబ్బు ఎక్కడనుంచి వస్తుందో కూడా వారికి అంతుపట్టేది కాదు. చివరికి పోలీసులు అక్కడకి వెళ్ళినప్పుడు అతని బండారాన్ని బయట పెట్టారు. అసలు కథ ఏంటో చూడండి.

న్యూస్ 18 కధనం ప్రకారం, మలికిపురం మండలం కత్తిమండ గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇల్లరికం అల్లుడు గా వచ్చాడు. ఏ పని చేయకుండా జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. మద్యం, బెట్టింగులు వంటి వాటికి బానిస అయ్యాడు. అందుకోసం అప్పులు కూడా చేసాడు. చివరకు డబ్బు లేక పోవడం తో.. అత్తారింటి వారిని అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం, బైక్ దొంగతనాలను చేయడం ప్రారంభించాడు.

చివరకు 27 బైక్ లను దొంగతనం చేసేసాడు. అలా దొంగతనం చేసే బైక్ లను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునేవాడు. నకిలీ తాళం చెవులను ఉపయోగిస్తూ.. బైక్ లను దొంగతనం చేసేవాడు. ఇలా దొంగతనం చేసిన బైక్ లను తెచ్చి అత్తారింటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లో పెట్టేవాడు. ఇప్పటివరకు 12 బైక్ లను అలా తాకట్టు లో పెట్టాడు. మిగిలినవి ఖాళీ స్థలం లోనే ఉంచాడు.

గత నెల 24 న ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి శ్రీనివాస థియేటర్లో సినిమాకి వెళ్లారు. బండిని పార్కింగ్ ప్లేస్ లోనే ఉంచినా కనిపించక పోవడం తో.. అతను రాజోలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. వరుస దొంగతనాలు జరుగుతున్నాయని గమనించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ కేసు విచారణ కోసం రెండు బృందాలుగా ఏర్పాటై నిందితుడిని పట్టుకున్నారు. బాలకృష్ణను అదుపులోకి తీసుకుని.. అత్తారింటికి ఎదురుగ ఉన్న ఖాళీ స్థలం లో ఉన్న బైక్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

















మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.
రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.
సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.
ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.
మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.
సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.








