నితిన్, రష్మిక జంటగా నటించిన “భీష్మ”. ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రానికి అనుకోని కష్టం వచ్చి పడింది. వెంకీ కుడుములు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వచ్చిన సినిమా ‘భీష్మ’ .వారం రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. అయితే సినిమా రిలీజ్ అయ్యి వారం కూడా అవ్వకముందే పైరసీ వచ్చేసింది. పైగా ఆ పైరసీ కాపీని టీఎస్ఆర్టీసీ బస్సులో ప్లే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిఖిల్ అనే నెటిజన్ దర్శకుడు వెంకీ కుడుములకు తెలియజేసాడు.
హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం గమనార్హం. “తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనికి దర్శకుడు స్పందించి కేటీఆర్ కు ట్వీట్ చేసారు.

దర్శకుడి ట్వీట్దీ పై కేటీఆర్ వెంటనే స్పందించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ వేదికగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కు సూచించారు. ఈ ట్వీట్ చూడగానే హీరో నిఖిల్ కూడా స్పందించారు. నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా పైరసీ వీడియోను కూడా చాలా బస్సుల్లో ప్లే చేసారని, దయచేసి పైరసీ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సినిమా ఈనెల 21న విడుదలకాగా.. విడుదలైన నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని, ఇతర మాధ్యమాలు, సామాజిక వేదికల్లో విస్తరించకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను కోరారు. భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వారం కూడా కాకముందే ఇలా పైరసీకి గురికావడం వల్ల చిత్ర కలెక్షన్లు దెబ్బతింటాయని చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది.

మాములు వ్యక్తిగా భావించిన అవ్వ “అయ్యా నా పేరు మంగమ్మ,నా వయసు 70 ఏళ్ళు ,రెండేండ్ల సుంది పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా”ఆన్నది,అయితే ఆ అవ్వకు అయన ఎవరో తెలియదు. మాములు వ్యక్తిగా భావించిన ఆ అవ్వ తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పింది..వెంటనే ఆ కలెక్టర్ డీఆర్డీవో పీడీ సుమతితో ఫోన్లో మాట్లాడి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.ఎంతో ఓపికగా ఆమె సమస్య విన్నది కలెక్టర్ గారే అని తెలుసుకుని చివరికి అవ్వ ఆశ్చర్యపోయింది.
కలెక్టర్ మంచితనాన్ని మెచ్చుకొని అతనిని చల్లగా ఉండాలంటూ ఆశిర్వదించింది అవ్వ.ఈ సన్నివేశం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.ఈ న్యూస్ లోకల్ మీడియాలో వైరల్ గా మారింది,మెట్లపై కూర్చొని వృద్ధురాలితో మాట్లాడుతున్నప్పటి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉండాలి అని కోరుకుంటున్నారు..తన హోదా ని మరిచిపోయి ఒక సాధారణ వ్యక్తి లాగా సహాయం చేసిన ఈ కలెక్టర్ ని మీరు కూడా అభినందిందండి,అందరికి షేర్ చేయండి.




ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు నాన్ ప్యాకేజ్డ్ స్వీట్స్ పై మ్యానుఫ్యాక్చర్ తేదీ , బెస్ట్ బిఫోర్ డేట్ కచ్చితంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ నిబంధన ప్యాకేజ్డ్ స్వీట్లకు మాత్రమే వర్తించేది. ఇకపై విడిగా లూజ్ గా అమ్మే స్వీట్స్ కి కూడా వర్తిస్తుంది. 2020 జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధలు అమల్లోకి రానుంది . చాలా వరకు షాపుల్లో ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన స్వీట్లను అమ్ముతున్నారని, దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ నిబంధనని తీసుకొచ్చారు.













గత కొన్ని రోజులుగా ఫారిన్ టూర్స్, డిన్నర్లకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు ఈ జంట. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటి కానున్నారు. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో కూడా ఉన్నారు. ఈ జోడీ ఫొటో తొలిసారి 2017లో మీడియా దృష్టిలో పడింది. 2019 ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో తన భాగస్వామి రామన్తో కలిసి మాక్స్వెల్ రావడంతో పెళ్లి గురించి చర్చ మొదలైంది. తాజాగా మాక్సీ-వినీ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఆసీస్ క్రికెటర్లు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నారు.





