అలనాటి అందాల తారగా సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే అందరి దగ్గర మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
అలా వరుస సినిమాలతో హిట్ సాధించిన ఈ బాలివుడ్ బ్యూటీ.. టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షుటింగ్ పనుల్లో జాన్వీ బిజీగా ఉన్నారు. కానీ సౌత్లో ఎంట్రీ ఇచ్చే ముందు తండ్రి బోనీ కపూర్ జాన్వీకు హీరోల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టారంటారని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

జాన్వీ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు విజయ్ లేదా అజిత్ వంటి అగ్రహీరోల సరసన నటించి ఎంట్రీ ఇవ్వాలని బోనీ కపూర్ కండీషన్ పెట్టారటా. అలాగే కోలీవుడ్లో హీరో ధనుష్తో మాత్రం ఏ సినిమాలోనూ నటించవద్దని కూడా బోనీ కపూర్ కండీషన్ పెట్టారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

తెలుగు, తమిళంలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్న ధనుష్తో సినిమాలు చేయడానికి ఎంతో హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ బోనీ కపూర్ తన కూతురుని ధనుష్తో నటించవద్దనే కండీషన్ ఎందుకు పెట్టారో తెలియడం లేదు. కానీ ధనుష్ ఫ్యాన్స్ మాత్రం ఈ కండీషన్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) క్రింద నోటీసు ఇచ్చి, ఆయనను అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే చంద్రబాబు మీద సెక్షన్ 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్లు, ఇవి కాకుండా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13(2) రెడ్ విత్ 13(1)(సి), (డి) కింద కేసును రిజిస్టర్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడి పై పై పెట్టిన ఆ సెక్షన్లు ఏమిటి? అవి ఏం చెబుతున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం పై తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ లక్ష్మీనారాయణ బీబీసీతో మాట్లాడుతూ, ఈ సెక్షన్లను ఎలాంటి సందర్భంలో పేర్కొంటారు అనేది, ఆ సెక్షన్లు రుజువైతే ఎలాంటి శిక్షలు పడుతాయనే విషయాన్ని వివరించారు. ‘ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్లు అని సీఐడీ నోటీసులుఇచ్చింది. అంటే బెయిల్ రాకూడదనే విధానంలో కేసులు పెట్టినట్లుగా, ఈ సెక్షన్లు, తీవ్రతను బట్టి శిక్ష పడే అవకాశం ఉంటుందని ’ అని చెప్పారు.

ఈ కేసులో కూడా విజయవాడ సిబిఐ కోర్టులో లూథ్రా చంద్రబాబు తరుపున వాదించారు. అయితే సిద్దార్ధ్ లూథ్రా దేశంలోనే టాప్ 10 లాయర్ల లో ఒకరు మాత్రమే కాదు. దేశంలో అత్యధిక ఫీజు అందుకునే లాయర్లలో ఒకరు. ఇలాంటి ఖరీదైన లాయర్ ను టిడిపి నియమించుకుంది. ఈ కేసును వాదించడానికి లాయర్ సిద్ధార్ధ్ లుథ్రా ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు.
లుథ్రా ఢిల్లీలో కాకుండా వేరే రాష్ట్రాలలో లేదా ప్రాంతాలలో కేసు వాదించడం కోసం రోజుకు ఫీజు రూ. 1.5 కోట్లు తీసుకుంటారని సమాచారం. అంతే కాకుండా లుథ్రా ప్రయాణానికి ప్రత్యేకమైన ఫ్లైట్ మరియు లగ్జరీ కారుతో పాటుగా స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేయాలని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, 24 గంటలు పూర్తి అయ్యే సమయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా గంటకు పైగా వాదించారు. ఆయన వాదన మొదలవగానే కోర్టు లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
స్కిల్ డెవలెప్మెంట్ కు సంబంధించి ఏపీలో రూ.241 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్ సంస్థ – డిజైన్టెక్ సంస్థలు రూ.3300 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో ఏపీ ప్రభుత్వం 10శాతం నిధులు, 90 శాతం నిధులు సీమెన్స్ సంస్థ చెల్లించేలా అగ్రిమెంట్ జరిగింది. ప్రభుత్వం తరపున 10 శాతం నిధులు జీఎస్టీతో సహ రూ.370 కోట్లను చెల్లించింది. అయితే ప్రభుత్వం చెల్లించిన ఈ నిధులలో రూ.240 కోట్లు సీమెన్స్ సంస్థకు కాకుండా వేరే సంస్థకు బదలాయించారు.
చంద్రబాబు ఆర్డర్స్ తో ఈ నిధులు రిలీజ్ అయ్యాయని అభియోగం. స్కిల్కి సంబంధించిన పనులు జరగలేదని, ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని ఆరోపణలు. ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.371 కోట్లు విదేశాలకు వెళ్లి, సుమారు 70 షెల్ కంపెనీల ద్వారా తిరిగి దేశానికి వచ్చేయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పై నాన్బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) ల కింద ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం నోటీసులు ఇచ్చింది.
అరెస్ట్కు సంబంధించిన పత్రాలను చంద్రబాబుకు, ఆయన లాయర్లకు ఇచ్చిన తరువాతే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారని అంటున్నారు. చంద్రబాబు తన అరెస్టు పై స్పందిస్తూ, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తుంటే అణిచివేస్తున్నారన్నారు. ఏ తప్పు చేశానో కూడా చెప్పకుండా అరెస్టు చేస్తున్నారని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని ఆర్కే బీచ్ లోని ముప్పై ఐదు కిలోమీటర్ల సాగరతీరంలోని ఇసుక ఎప్పుడు బంగారు రంగులో మెరిసిపోతూ టూరిస్తులను, స్థానికులు ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి ఇసుకతిన్నెల పై ఎంజాయ్ చేసేవారికి గురువారం నాడు షాక్ తగిలింది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆర్కే బీచ్ లోని ఇసుక ప్రస్తుతం నలుపురంగులో కనిపిస్తుంది. కోస్టల్ బ్యాటరీ మరియు వుడా పార్క్ నడుమ ఉండే సముద్రతీరం నల్లగా మారింది. దాంతో విశాఖ ప్రజలు అక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళనలో మునిగిపోయారు.
ఆర్కే సముద్రతీరంలో బంగారు వర్ణంలోని ఇసుక నల్లగా మారిపోవడం ఎప్పుడూ చూడని విశాఖ ప్రజలు సముద్రతీరానికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. స్థానికులు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇసుక నల్లగా మారపోవడం ఇప్పటి దాకా ఎప్పుడు చూడలేదని అంటున్నారు. అయితే ఈ విషయం పై నిపుణులు మాట్లాడుతూ ఇసుకలో ఉన్న లైట్ మరియు హెవీ మినరల్స్ సపరేట్ కావడం వల్లే ఇసుక నల్లగా మారింది చెబుతున్నారు.
వాతావరణంలోని మార్పుల కారణంగా అలల ఉధృతి పెరిగిన సమయంలో తీరంలో ఉండే లైట్ మినరల్స్ నీటిలో కలిసి సముద్రంలో కలుస్తాయని, అయితే హెవీ మినరల్స్ మాత్రం బీచ్ లోనే ఉండిపోతాయని అంటున్నారు. హేవిగా ఉండే మినరల్స్లో అధికంగా ఇలమనైట్, జింకాన్, గార్నెట్, రుటైల్, సిలిమినైట్ లాంటివి ఉంటాయని చెబుతున్నారు. ఇసుక నల్లగా మారడానికి ముఖ్యంగా ఇలమనైట్, రుటైల్ లాంటి బరువున్న మినరల్స్ లే కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు హెవీ మినరల్స్ నల్లని రంగులో ఉంటాయని అందువల్లనే ఇసుక కూడా నల్లగా మారుతుందని చెబుతున్నారు.
జీ20 అంటే ఇరవై దేశాలతో ఏర్పడిన ఒక సమూహం. జీ-20 సదస్సు అనేది వరల్డ్ ఫైనాన్షియల్ వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఈ జీ20సదస్సులోని దేశాలకు ప్రపంచంలోని ఆర్థిక ఉత్పత్తిలో ఎనబై ఐదు శాతం, ప్రపంచ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం వాటా ఉంది. జీ20లో అర్జెంటీనా, యూకే, యూఎస్, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇండోనేషియా, జర్మనీ, జపాన్, మెక్సికో, ఇటలీ, రష్యా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, తుర్కియేతో పాటు స్పెయిన్ శాశ్వత గెస్ట్ గా ఉంది.
ప్రతిష్ఠాత్మక జీ-20 సదస్సుకు మొదటిసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. సెక్యూరిటీ నుండి ఆతిథ్యం వరకు మన దేశ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేసింది. ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ఈ ఏడాది జరగబోయే జీ-20లో స్థిరమైన అభివృద్ధి పై ఫోకస్ చేయనుంది.
అదే విధంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల పై చర్చ జరగనుందని సమాచారం. అభివృద్ధి చెందిన దేశాలకు మంచి జరిగేలా తక్కువ ఇంట్రెస్ట్ కు రుణాలు ఇచ్చేలా ఎండీబీలో మార్పులు తీసుకురావాలని చర్చ జరగనుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాతావరణంలోని మార్పులు, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం మరియు పేదరికం పై పోరాడడానికి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలు చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడతారని వైట్హౌస్ ప్రతినిధులు తెలిపారు.


