జీ-20 సదస్సు దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు మరియు ప్రధానులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం ఈ సదస్సు కోసం చేసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అంశాలు, ప్రపంచీకరణను స్ట్రాంగ్ గా చేయడంలో జీ20 దేశాల కూటమి ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు మొదటిసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సు అంటే ఏమిటి? ఈ సదస్సులో ఏం చర్చిస్తారో ఇప్పుడు చూద్దాం..
జీ20 అంటే ఇరవై దేశాలతో ఏర్పడిన ఒక సమూహం. జీ-20 సదస్సు అనేది వరల్డ్ ఫైనాన్షియల్ వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఈ జీ20సదస్సులోని దేశాలకు ప్రపంచంలోని ఆర్థిక ఉత్పత్తిలో ఎనబై ఐదు శాతం, ప్రపంచ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం వాటా ఉంది. జీ20లో అర్జెంటీనా, యూకే, యూఎస్, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇండోనేషియా, జర్మనీ, జపాన్, మెక్సికో, ఇటలీ, రష్యా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, తుర్కియేతో పాటు స్పెయిన్ శాశ్వత గెస్ట్ గా ఉంది.
ప్రతిష్ఠాత్మక జీ-20 సదస్సుకు మొదటిసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. సెక్యూరిటీ నుండి ఆతిథ్యం వరకు మన దేశ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేసింది. ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ఈ ఏడాది జరగబోయే జీ-20లో స్థిరమైన అభివృద్ధి పై ఫోకస్ చేయనుంది.
అదే విధంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల పై చర్చ జరగనుందని సమాచారం. అభివృద్ధి చెందిన దేశాలకు మంచి జరిగేలా తక్కువ ఇంట్రెస్ట్ కు రుణాలు ఇచ్చేలా ఎండీబీలో మార్పులు తీసుకురావాలని చర్చ జరగనుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాతావరణంలోని మార్పులు, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం మరియు పేదరికం పై పోరాడడానికి వరల్డ్ బ్యాంకు లాంటి సంస్థలు చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడతారని వైట్హౌస్ ప్రతినిధులు తెలిపారు.







ఇస్రో ప్రయోగం అని వినగానే, వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీహరి కోట. చంద్రయాన్1, 2, 3లతో పాటు ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాలకు నెల్లూరులోని శ్రీహరి కోట వేదికగా మారింది. రాకెట్ ప్రయోగానికి శ్రీహరి కోటను ఎంచుకోవడానికి కారణం శ్రీహరి కోట స్పేస్ సెంటర్కు 5 ప్రత్యేకతలు ఉన్నాయి.
1. భూమధ్య రేఖకు సమీపంగా ఉండడం..
33. భూమి స్వభావం..
2. సుదీర్ఘ తూర్పు తీరం ఉండడం..
4. రవాణా సదుపాయం..
5. ప్రయోగాలకు అనుకూలమైన వాతావరణం..
ఇక శ్రీహరికోటలో సంవత్సరం పొడుగునా సాధారణమైన వాతావరణం ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే భారీ వర్షాలు పడుతాయి. అందువల్ల మిగిలిన పది నెలలు శ్రీహరికోట ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది.
తిరుమలలో 7వ కిలో మీటర్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చర్చలకు దారితీస్తోంది. దానికి కారణం తిరుమల నడకదారిలో చిన్నారులపై చిరుత పులి దాడి చేయడం. రెండు సంఘటనలు జులై, ఆగస్ట్ నెలలో జరిగాయి. మొదటి సంఘటనలో జులై 23న బాలుడు కౌశిక్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి అరుపులకు భక్తులు వెళ్లడంతో చిరుత విడిచిపెట్టి వెళ్ళింది. ఆ బాలుడు చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నాడు.
ఇదే ప్రాంతంలో ఆ తరువాత ఆగస్ట్ 11న కుటుంబంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చిన్నారి లక్షిత చిరుత దాడి చేయగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించారు. టీటిడి అధికారులు దర్శనంలో కోసం నడకదారిలో వచ్చే భక్తుల భద్రత కోసం తగు చర్యలు చేపట్టారు. ఇక ఇదే ప్రాంతంలో 1980లో దారుణమైన సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.
తిరుమలలోని ఘాట్ రోడ్ 7 వ కిలోమీటర్ వద్ద ఒక మహిళను దారుణంగా హత్య చేశారట. ఆ మహిళ హత్య వల్ల కలిగే నష్ట నివారణ కోసం అక్కడ ఒక ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించారు అప్పటి ఈవో పీవోఆర్కే ప్రసాద్. అప్పుడు మహిళా హత్య, ఇప్పుడు చిరుతపులి దాడి రెండు కూడా ఇదే 7వ కిలో మీటర్ సమీపంలోనే జరిగాయి.


కానీ దేవస్థాన కౌంటర్ సిబ్బంది ఆ రవికను చెత్తలో వేయమని చెప్పడంతో వారు షాకయ్యారు. సందేహం వచ్చి, రవిక ను పరిశీలించగా అది రవిక కాదని, దాన్ని రుమాలు అనికూడా చెప్పలేము అని హారిక తెలిపారు. అమ్మవారి రవికల పేరుతో గుడ్డ ముక్కలను అందంగా ఉండే ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారని హారిక ఆరోపించారు.
అడిగినంత డబ్బు ఇస్తున్నా కూడా, గుడి అవరణలోనే భక్తులను మోసం చేయడం ఏంటని కౌంటర్ లో ఉన్న సిబ్బందిని నిలదీయగా వారు ఆలయ అధికారులకు కంప్లైంట్ చేయమని సూచించినట్లుగా ఆమె తెలిపారు. అక్కడ ఇదంతా సాధారణంగా జరిగే విషయమే అని ఆలయ అధికారి చెప్పారని అన్నారు. దాంతో దేవాలయ ఈవో భ్రమరాంబను కలవడానికి ప్రయత్నించగా, ఆ టైమ్ లో ఈవో అందుబాటులో లేకపోవడంతో వెనక్కు వచ్చామని హారిక వెల్లడించారు.
ప్రముఖ మలేసియా బిజినెస్ టైకూన్ ఖూ కే పెంగ్ మరియు మాజీ మిస్ మలేసియా అయిన పాలైన్ ఛాయ్ ల కూతురు ఏంజెలినా ఫ్రాన్సిస్. ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ సమయంలోనే ఆమె జెడియా అనే ఫ్రెండ్ ని ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఏంజెలినా తన తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని తెలిపింది. అయితే ఆమె తల్లిదండ్రులు వారి పెళ్ళికి నిరాకరించారు.
ఆర్థికపరంగా ఇద్దరి కుటుంబాల్లో చాలా తేడా ఉండడంతో వారు ప్రేమించిన వాడికి దూరం కావడమో లేదా కుటుంబ వారసత్వాన్ని వదులుకోవడమో రెండిటింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోమని ఆదేశించారు. అయితే ఏంజెలినా ప్రేమించినవాడితో జీవితం పంచుకోవడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి, 2008లో పెళ్లి చేసుకొని తాను కోరుకున్నవాడితో కొత్త లైఫ్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో మేకు వారసత్వంగా రావలసిన దాదాపు రెండు వేల కోట్ల ఆస్తినీ వదిలేసింది.
పెళ్లి తరువాత ఇద్దరు కూడా కూడా ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ, చాలారోజులు తరువాత ఏంజెలినా తన పేరెంట్స్ ను కలవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంజెలినా తల్లిదండ్రులు డైవర్స్ తీసుకున్నారు. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి ఆమె కోర్టుకు వెళ్లింది. తన తల్లి పాలైన్ ఛాయ్ గురించి గొప్పగా చెప్పిన ఆమె తండ్రిపై విమర్శలు చేసింది. ప్రస్తుతం ఏంజెలినా లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
