క్రికెట్ లో ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అది ఎలాగంటే. ఎంతో మంది తమ వ్యాపారాలకు బాగా ప్రమోషన్ చేయడానికి క్రికెట్ మ్యాచ్ ని ఒక దారిగా ఎంచుకుంటారు.
అందుకే వాళ్లు ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి అనుకున్న వాళ్లు, అలాగే మ్యాచ్ ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ బ్రాండ్ నేమ్స్ క్రికెట్ ఫీల్డ్ మీద, అలాగే సైడ్స్ కి రాసి ఉంటాయి.

ఇదంతా మనం గమనించే ఉంటాం. అయితే, మనలో చాలా మందికి అసలు ఫీల్డ్ మీద పేర్లు పెయింటింగ్ సహాయంతో మనకు చూపిస్తారా? లేదా ఇంకేదైనా టెక్నాలజీ వాడతారా? అనే అనుమానం వచ్చి ఉంటుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఫీల్డ్ మీద పేర్లు కనిపించేలా చేయడానికి కొన్ని టెక్నిక్స్ వాడతారు. వరల్డ్ కప్ లో, ఇందుకు సంబంధించిన రూల్స్ ఐసీసీ ఫ్రేమ్ చేస్తారు.


అందులో ఒకటి ఏంటంటే, త్రీడీ పెయింటింగ్. అంటే నిజమైన గడ్డి లాగా కనిపించే టర్ఫ్ మీద అడ్వటైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. ఇంకొకటి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని అది ఫీల్డ్ మీద పెట్టి దానిపై పెయింట్ చేస్తారు. ఇదంతా కెమెరా యాంగిల్ కి అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. కెమెరా యాంగిల్ ప్రకారం మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం గ్రౌండ్ మీద డ్రా చేస్తారు. అలాగే పెయింట్స్ వల్ల కానీ, స్ప్రే వల్ల కానీ ఫీల్డ్ లో ఉన్న గడ్డికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదు అని కూడా రూల్స్ లో మెన్షన్ చేశారు.

మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ పెయింట్ సులభంగా రిమూవ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కెమెరా యాంగిల్స్ అనుగుణంగా లేకపోతే ఈ టెక్నిక్ వాడలేరు. అప్పుడు గ్రౌండ్ కి ఆపోజిట్ వైపు నుండి, హై ఎండ్ ప్రొజెక్టర్స్ సహాయంతో అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. కానీ ప్లేయర్స్ వాటి మీద నుండి నడవడం లాంటివి అవుతుంటాయి.

అందుకే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో, ఏఐ బేస్డ్ సాఫ్ట్ వేర్ సహాయంతో రియల్ టైం ఎడిటింగ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. గ్రౌండ్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. కానీ మనకి టీవీలో చూస్తున్నప్పుడు మాత్రం అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. దాంతో ప్లేయర్స్ నడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
watch video :







ఈ పేరు వినగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది. ఆయన రచనలు గుర్తు వస్తాయి. ఆయన రాసిన నవలలు కవర్ పేజీలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయన రచనల్లోని పాత్రలు మనకి తడుతూ ఉంటాయి. 106 నవలలు, 3500 కథలు,1200 వ్యాసాలు, 22 సినిమాలు,9 టీవీ సీరియల్స్ ఇది 50 ఏళ్ల సాహిత్య యాత్రలో మల్లాది కృష్ణమూర్తి సాధించిన ఘనత. ఏ జోనర్ టచ్ చేయని ఆయన అందులో సూపర్ హిట్ అవుతారు. యువతరానికి, నవతరానికి , ఏ తరానికి అయినా సరే ఆయన రచనలు కిక్ ఇస్తాయి. ఆయన పెన్ కి ఏ భేదం లేదు.1970 ఆగస్టు 3 చందమామ మాస పత్రికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి కథ ఉపాయశాలీ ప్రచురితమైంది.నాటి నుండి నేటి వరకు ఆయన రచనా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది.
ఆయన రాసిన 106 నవలల్లో 22 నవలలు సినిమాలుగా రూపొందించారు.చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ ఇలా ఎన్నో మంచి సినిమాలకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలే ఆధారం. 9 టీవీ సీరి యల్స్ ను అయన నవలల ఆధారంగానే రూపొందించారు. హాస్యం, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్ ఇలా ప్రతీది కూడా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో రచయితలకు మల్లాది ఒక ఇన్స్పిరేషన్. మల్లాది డబ్బుకి, కీర్తి ప్రతిష్టలకి ఏనాడు విలువ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు ఎన్ని రచనలు చేసినా కూడా ఆయన ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు, ఏ పేపర్ లోను పడలేదు.ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ప్రస్తుతం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచనలు చేస్తూనే ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు.

































