మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీ ఉన్న సినిమాలని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరుణ్ తేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : గాండీవధారి అర్జున
- నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్.
- నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
- దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
- సంగీతం : మిక్కీ జె మేయర్
- విడుదల తేదీ : ఆగస్ట్ 25, 2023

స్టోరీ :
ఆదిత్య రాజ్ (నాజర్) ఒక సెంట్రల్ మినిస్టర్. ఆదిత్య రాజ్ కి ప్రాణాపాయం ఉంటుంది. యుఎన్ లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళాలి. అందుకే అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ని ఆయనకి సెక్యూరిటీగా నియమిస్తారు. అసలు ఆదిత్య రాజ్ ని ఎవరు చంపాలి అనుకుంటున్నారు? వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అప్పుడు అర్జున్ ఏం చేశాడు? ఆదిత్య రాజ్ ని ఎలా కాపాడాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
సాధారణంగా యాక్షన్ సినిమాలు అంటేనే ప్రేక్షకులకి ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా చూపిస్తారు? ఎలా డిజైన్ చేస్తారు? అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సినిమాల్లో కాస్త పొరపాటు జరిగినా కూడా ఆ యాక్షన్ సీన్స్ ట్రోల్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఒక పక్క లాజిక్ మేనేజ్ చేస్తూనే, ఒక పక్క హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కూడా ఉండేలాగా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇంక ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ అంతా ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది. అంత పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. సినిమా బ్యాక్ డ్రాప్ బాగున్నా స్టోరీ మాత్రం తెలిసిపోయే కథ లాగానే ఉంటుంది. సాధారణంగా ఇలాంటి యాక్షన్ సినిమాలు సెకండ్ హాఫ్ లో అయినా కాస్త గ్రిప్పింగ్ గా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ సినిమాలో అది కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఎంత డల్ గా అయితే ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న తీరు బాగుంది.

ఒక మంచి యాక్షన్ సినిమాకి ఒక హీరో ఎలా అయితే ఉండాలో వరుణ్ తేజ్ అలాగే ఉన్నారు. పాత్రలో తన నటన కూడా బాగుంది. సినిమాలు ఎలా ఉంటున్నా కానీ వరుణ్ తేజ్ ప్రతి సినిమాకి పడే కష్టం తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అలా పాత్ర కోసం తనని తాను మార్చుకున్నారు. సినిమాలో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. కానీ ఎవరి పాత్ర కూడా కంప్లీట్ గా అనిపించదు. చాలా సంవత్సరాల క్రితం హీరోయిన్ గా నటించిన విమలా రామన్ కూడా ఈ సినిమాలో నటించారు.

కానీ తనకి కూడా మంచి పాత్ర రాలేదు. డాక్టర్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన హీరో వినయ్ రాయ్ ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి పాత్రలోనే నటించారు. అందుకే కొత్తదనం అనిపించదు. హీరోయిన్స్ సాక్షి వైద్య అయితే సినిమా మొత్తం ఉంటారులే కానీ నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరకలేదు. తెరపై వరుణ్ తేజ్ పక్కన సాక్షి వైద్య పెయిర్ బాగుంది. పాటలు కూడా అంత పెద్ద గొప్పగా ఏమీ లేవు. సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే ఆ సీన్స్ ఇంకా కొంచెం అయినా ఎలివేట్ అయ్యేవి ఏమో.

సినిమాలో గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా మెసేజ్ చెప్పాలి అని ప్రయత్నించారు. ఇలా చెప్పాలి అనుకోవడం మంచి విషయం అయినా కూడా అది ప్రాపర్ గా ప్రేక్షకులకు అందలేదు. ముఖేష్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా నిర్మాణ విలువల పరంగా చాలా బాగుంది. లొకేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. కానీ అవి ఏమీ కూడా సినిమాకి సహాయపడలేకపోయాయి. కథపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా బాగుండేది ఏమో.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- ప్రేక్షకులకి బోరింగ్ గా అనిపించే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా దాన్ని తెరపై చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. యాక్షన్ మీద చాలా సినిమాలు వచ్చి అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సినిమాల్లో ఒకటిగా గాండీవధారి అర్జున సినిమా నిలుస్తుంది.
watch trailer :












ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 గత నెల బయలుదేరి, ఎట్టకేలకు ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని గంటల్లో ల్యాండర్ చంద్రుని దక్షిణధ్రువం తొలి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దేశం మొత్తం ఇస్రో జయహో అని నినదిస్తోంది. ఈరోజు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకాబోతుంది. సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు చందమామ ఉపరితలం పై ల్యాండర్ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నిటిని పూర్తి చేశారు.
అయితే, ఈ మిషన్ లో చివరి 17 నిమిషాలు చాలా కీలకం. దీనిని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని చెప్తున్నారు. ఈ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయితే దాదాపు జాబిల్లి ఉపరితలం మీదకి ల్యాండర్ సురక్షితంగా చేరుకున్నట్లే అని చెబుతున్నారు. ఈ ఆఖరి 17 నిమిషాలో ల్యాండర్ ఆటోమేటిక్ గా తనలోని ఇంజన్లను మండించుకోగలగాలి. అంతే కాకుండా ఈ చర్య కరెక్ట్ టైమ్ కి జరగడంతో పాటుగా దానికి అవసరమైన ఇంధనాన్ని కూడా ఉపయోగించుకోవడం అనేది అత్యంత కీలకం.
దీనిలో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా ప్రయోగం అంతా విఫలం అవుతుంది. అందువల్లే ఉత్కంఠంగా యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్ల వద్ద అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో చంద్రయాన్-2 ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతాన్ని ఢీకొనడంతో కూలిపోయింది. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యాంకర్ మరియు నటి అనసూయ ఏడుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో చిన్న వీడియోతో పాటుగా సుదీర్ఘమైన నోట్ కూడా షేర్ చేసి ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఆమె సుధీర్ఘమైన పోస్టును చూస్తే సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోలింగ్ కి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అనసూయ పెట్టిన పోస్టు సారాంశం, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను సమాచారం, కమ్యూనికేషన్ కోసం మొదట్లో వాడాం. ఆ తరువాత ప్రపంచంలోని జీవన శైలి, డిఫరెంట్ సంస్కృతి, సంప్రదాయల గురించి, నాలెడ్జ్ కోసం ఉపయోగించేవాళ్ళం. ఇక్కడికి ఒకరికొకరు సపోర్ట్ గా నిలవాలనే వస్తాం. ఆనందం, బాధ వంటి వాటిని పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంటాం. నే సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి జ్ఞాపకం, ఫోటోలు, డాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్లు, కంబ్యాక్ లు అన్ని నా జీవితంలో భాగమే.
గత ఏడాది ‘పోకిరి’ తో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్ లో హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే గతంలో నిరాశపరిచిన రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో రీరిలీజ్ చేశారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత యావరేజ్ గా నిలిచిన చిన్న సినిమా ‘ఈనగరానికి ఏమైంది’ రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించి, పెద్ద సినిమాల లిస్ట్ లో నిలిచింది.
తాజాగా రీరిలీజ్ అయిన యోగికి కూడా అలాంటి రెస్పాన్స్ రావడంతో వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు రీరిలీజ్ సిద్ధం అయ్యాయి. అయితే స్టార్ హీరోలందరికి కాలంతో పని లేకుండా ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్లాపే అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు. రాఖీ, ఒక్క మగాడు, లయన్ సినిమాలను త్వరలో రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
ప్రేమ అనేది నమ్మకం, ఎదుటి వ్యక్తి ఇచ్చే గౌరవం, కేరింగ్ లాంటి వాటితో నిలబడుతుంది. కానీ కండిషన్లు, డిమాండ్లతో ఏ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే ఒక వ్యక్తి తన గర్ల్ఫ్రెండ్ పాటించాల్సిన 15 రూల్స్ చెప్పాడట. దానికోసం ఓ లిస్ట్ కూడా ఇచ్చాడట. ఆమె ఆ లిస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసినవారు షాక్ అవుతున్నారు. నెటిజెన్లు అతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ట్రోల్ చేస్తున్నారు. 












అంతేకాకుండా లవర్ సూర్య ప్రకాశరావుతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ప్రసుతం వీడియో మరియు పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో ఆ బాలిక ఇద్దరు యువకులతో ఒకరికి తెలియకుండా మరొకరితో నడుపుతున్న ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. దాంతో సాయికుమార్ మరియు సూర్యప్రకాశరావు ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఇద్దరిలో ఎవరు కావాలని ? ఆమె ఎవరితో కలిసి ఉంటుందో చెప్పమని నిలదీశారు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో తెలియని ఆ బాలిక ఉరి వేసుకుని ఆగస్ట్ 10న ప్రాణాలు తీసుకుంది.
ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక మృతదేహం దగ్గర లెటర్ పోలీసులకు ఒక లెటర్ లభించింది. ఆ లెటర్ లో ‘సూర్య వాళ్లెవరినీ కూడా వదలకు కుక్క చావు చావాలి కొడుకులు’ అని ఉంది. అయితే సూర్యప్రకాశ్ అదే రోజు రాత్రి గోపాలపట్నం దగ్గరలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ముక్కోణపు ప్రేమ కథలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, సాయికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.