మూడు టీ20ల సిరీస్లో టీమిండియా బోణి కొట్టింది. ఉత్కంఠ పోరులో తొలి టీ20లో శ్రీలంకపై 2 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విజయం కోసం కరుణరత్నే పోరాడిన లంక కి ఓటమి తప్పలేదు. తీవ్ర ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి మ్యాచ్ భారత్ వశమైంది.
టీ20ల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే భారత యువ బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. శ్రీలంకతో జరగిన మ్యాచ్ లో మావి 4 వికెట్లతో చెలరేగాడు. అతనితోపాటు హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ తలా 2 వికెట్లతో రాణించటంతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన వేళ స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 2 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఓవర్లోనే పాథుమ్ నిస్సాంక వికెట్ ను కోల్పోయింది. అరంగేట్ర బౌలర్ శివమ్ మావి అద్భుత బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత లంక క్రమంగా వికెట్లు చేజార్చుకుంది. ధనంజయ డిసిల్వ ను ఔట్ చేసి మావి భారత్ కు రెండో వికెట్ ను అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ విజృంభించారు. హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు. అనంరతం చేధనకు దిగిన శ్రీలంక 160 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది.
ప్రస్తుతం ఈ మ్యాచ్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17