శ్రీలంక క్రికెట్ టీం లో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘800’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎందులో స్ట్రీమ్ అవుతుంది అనే పూర్తి వివరాలు చూడండి…శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ సినిమా ఎన్నో ఒడిదుడుకులు కూడా నడుమ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ముందుగా ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా అనుకుని సినిమాను మొదలు పెట్టారు. అయితే తమిళనాడు కి శ్రీలంకకి ఉన్న విభేదాల కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించకూడదంటూ తమిళనాడులో వివాదం రేగింది. ఆ వివాదం కారణంగా విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మేకర్స్ ఈ సినిమాని మళ్లీ వేరే నటుడితో రూపొందించారు. అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 6న రిలీజ్ అయింది. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది.800’ మూవీ ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగానే జియో సినిమా ప్లాట్ఫామ్లో ఈ సినిమా చూడొచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.

800 సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రను మధుర్ మిట్టల్ పోషించారు. మురళీధరన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, క్రికెటర్గా ఎదిరిన తీరు, కెరీర్లో ఒడిదొడుకులను ఈ చిత్రంలో కళ్ళకి కట్టినట్టు చూపించారు.800 చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. వివేక్ రంగాచారి నిర్మించగా ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్లతో చరిత్ర సృష్టించగా.. ఆ సంఖ్యనే ఈ మూవీ టైటిల్గా పెట్టారు. ముత్తయ్య మురళీధరన్ అభిమానులు, క్రికెట్ అభిమానులు ఈ సినిమా పైన ఆసక్తి చూపిస్తున్నారు. జియో సినిమాలో మంచి వ్యూయర్షిప్ సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:సెహ్వాగ్ ను అవుట్ చేయడం అంత ఈజీ నా…

















పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి సీజన్లో ఓటింగ్ లైన్స్ 5 రోజుల పాటు ఉంటారు. ఆదివారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కి సంబంధించినటువంటి ఫేవరెట్స్ వాళ్లకి ఓట్లు అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన టువంటి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఓటింగ్ ప్రక్రియ ను ముందుగానే క్లోజ్ చేశారు. దీనికి ప్రధాన కారణం మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే టాక్ కూడా వినపడింది.
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ ఈ సారి టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ ను ఉంచారు బిగ్ బాస్. వారి యొక్క జర్నీ లు కూడా చూపిస్తూ వాళ్ళని కూడా ఫైనలిస్ట్ లని చేశారు. ఇందులో బాబా భాస్కర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయ్యాడు. దీంతో ఫైనల్ కు ఏడుగురు కంటెస్టెంట్ వచ్చాడు. అయితే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇద్దరిని చేయవలసి వస్తుంది.
అందుకోసమే ఓట్స్ ప్రక్రియను బుధవారానికి క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల బిగ్బాస్ పార్టిసిపెంట్స్ ఎవరిని ఎలిమినేషన్ చేసిన ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఓటీటీ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం బాబా భాస్కర్ మరియు అనిల్ రాథోడ్ ఇద్దరు కూడా ఇద్దరూ లిస్టు లోనే ఉన్నారని, బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా వీరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం, ఇక మిగిలినటువంటి వారిని టాప్ 5 పినాలిలో ఎలిమినేషన్ చేయవచ్చు.