అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో ఒక సెన్సేషన్ సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. సినిమా పూర్తయ్యకా విడుదలకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డ అర్జున్ రెడ్డి ఒక్కసారి విడుదలయ్యాక ఇండియాలోనే సెన్సేషన్ అయిపోయింది. అప్పటివరకు వచ్చిన సినిమాల ఫార్మేట్ ని అర్జున్ రెడ్డి మార్చేసింది. పెద్ద పెద్ద హీరోలు అన్ని ఇండస్ట్రీలు వారు అర్జున్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. తర్వాత సందీప్ రెడ్డి వంగా హిందీలో అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ పేరుతో అక్కడ రూపొందించగా బాలీవుడ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
వెంటనే సందీప్ రెడ్డి వంగా కి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. రణబీర్ తో సందీప్ రెడ్డి వంగా యానిమల్ అనే సినిమాని రూపొందించాడు. టైటిల్ దగ్గర నుండి ఈ సినిమా అందరిని ఆకర్షించింది.

తాజాగా డిసెంబర్ ఒకటో తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చిత్రం మీద ఎక్స్పెక్టేషన్స్ ని భారీ లెవెల్ లో పెంచేసింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సందీప్ రెడ్డి మార్క్ కనిపించింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు లెంగ్త్ కూడా 3:21 నిమిషాలు ఉంది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ చూపించే విధంగా ఈ సినిమా ఉంటుందని డైరెక్ట్ తెలియజేశారు.

అయితే తెలుగు రాష్ట్రాల హక్కులను 15 కోట్ల రూపాయలకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నారు. యానిమల్ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు దిల్ రాజు ఏ బాలీవుడ్ మూవీ ని కూడా ఇంత పెట్టి కొన్నది లేదు. ఫస్ట్ టైం యానిమల్ సినిమా విషయంలో దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా అంటూ సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.యానిమల్ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే హిట్ టాక్ వచ్చినా కూడా సినిమా 15 కోట్లు దాటి వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read:అప్పుడు ఆర్తి అగర్వాల్… మొన్న కృతి శెట్టి… ఇప్పుడు శ్రీలీల..! ఇదే తప్పు చేశారా..?



















ఈ పేరు వినగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది. ఆయన రచనలు గుర్తు వస్తాయి. ఆయన రాసిన నవలలు కవర్ పేజీలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయన రచనల్లోని పాత్రలు మనకి తడుతూ ఉంటాయి. 106 నవలలు, 3500 కథలు,1200 వ్యాసాలు, 22 సినిమాలు,9 టీవీ సీరియల్స్ ఇది 50 ఏళ్ల సాహిత్య యాత్రలో మల్లాది కృష్ణమూర్తి సాధించిన ఘనత. ఏ జోనర్ టచ్ చేయని ఆయన అందులో సూపర్ హిట్ అవుతారు. యువతరానికి, నవతరానికి , ఏ తరానికి అయినా సరే ఆయన రచనలు కిక్ ఇస్తాయి. ఆయన పెన్ కి ఏ భేదం లేదు.1970 ఆగస్టు 3 చందమామ మాస పత్రికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి కథ ఉపాయశాలీ ప్రచురితమైంది.నాటి నుండి నేటి వరకు ఆయన రచనా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది.
ఆయన రాసిన 106 నవలల్లో 22 నవలలు సినిమాలుగా రూపొందించారు.చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ ఇలా ఎన్నో మంచి సినిమాలకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలే ఆధారం. 9 టీవీ సీరి యల్స్ ను అయన నవలల ఆధారంగానే రూపొందించారు. హాస్యం, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్ ఇలా ప్రతీది కూడా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో రచయితలకు మల్లాది ఒక ఇన్స్పిరేషన్. మల్లాది డబ్బుకి, కీర్తి ప్రతిష్టలకి ఏనాడు విలువ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు ఎన్ని రచనలు చేసినా కూడా ఆయన ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు, ఏ పేపర్ లోను పడలేదు.ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ప్రస్తుతం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచనలు చేస్తూనే ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు.