‘బలగం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో కర్తానందం ఒకరు. ఆయన ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. ‘బలగం’ చిత్రంతో గుర్తింపును సంపాదించుకున్నారు.
కర్తానందం తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి వెల్లడించారు. తనది సూర్యాపేట లోని కుతుబ్షాపురం అని, తన తండ్రి నల్గొండ జిల్లాలోని కేతెపల్లి గ్రామంలో స్థిరపడ్డారని తెలిపారు. 7వ తరగతి వరకు కేతెపల్లిలో చదువు సాగిందని అన్నారు. స్కూల్లో జరిగే సాంస్కృతిక ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడినని, ఆ సమయంలోనే నటన మీద ఆసక్తి ఏర్పడిందని అన్నారు.
ఖమ్మంలో మాంట్ఫోర్ట్ హైస్కూల్లో 8-10 తరగతి వరకు చదువుకున్నానని వెల్లడించారు. అప్పుడు హాస్టల్లో ఉండేవాడినని చెప్పారు. హాస్టల్ బిల్డింగ్ ఓపెనింగ్ తాను నటించిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ అనే నాటిక మంచి గుర్తింపును ఇచ్చిందని కర్తానందం వెల్లడించారు. ఇదే నాటకాన్ని మళ్ళీ హైదరాబాద్లో వేశానని, దానికి అప్పటి మినిస్టర్ మండలి వెంకటకృష్ణారావు ద్వారా అవార్డు అందుకున్నానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగలరావు చేతుల్లా మీదుగా కూడా అవార్డు తీసుకున్నట్టు తెలిపారు.
అనారోగ్యంతో తన తండ్రి మరణించడంతో తన తల్లి ఐదుగురు పిల్లల్ని బాగా చదివించిందని ఎమోషనల్ అయ్యారు. తోడబుట్టిన వారంతా సెటిల్ అయ్యారని వెల్లడించారు. తనకు ఇద్దరు కొడుకులని, వారి పేర్లు విశ్వ, విధాత అని చెప్పారు. తన వైఫ్ పేరు పావని అని, కొడుకులిద్దరూ బాగా చదువుతారని, తెలివైనవాళ్లని చెప్పారు. పెద్దబ్బాయి జర్మనీలో ఎంఎస్ చేస్తున్నాడని, చిన్నబ్బాయి ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నడని చెప్పారు.
తాను 22 సంవత్సరాలు హోంగార్డుగా పనిచేశానని అన్నారు. గతంలో నక్సలైట్లు కోయగూడేల్లోని యువతను ఆకర్షించకుండా చేయడానికి పోలీసులు కళాబృందాలను ఏర్పాటు చేసేవారని, తాను ఆ బృందంలో చేరి, హోంగార్డు అయ్యానని నటుడు కర్తానందం వెల్లడించారు.
Also Read: RAMA BANAM REVIEW : “గోపీచంద్” హీరోగా నటించిన రామబాణం హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టిన దానిలో 10 శాతం కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. మూవీ చూసిన వారు దర్శకుడిగా 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు అంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాత అనీల్ సుంకర మూవీ ఫెయిల్యూర్ను అంగీకరిస్తూ ట్వీట్ చేశాడు. అందులో బౌండెడ్ స్క్రిప్ట్ తమ దగ్గర లేకుండా చిత్రాన్ని మొదలు పెట్టి ఖరీదైన తప్పు చేశామని అన్నారు.
దీనిని చూసిన వారు ఇండస్ట్రీలో ఓ నిర్మాత ఇలా పరాజయాన్ని, మూవీ విడుదలైన 4 రోజులకే అంగీకరించడం చాలా అరుదుగా జరిగే విషయమని అంటున్నారు. అయితే నిర్మాత అనీల్ సుంకర తన ట్వీట్ లో చెప్పిన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మూవీని మొదలు పెట్టి తప్పుచేశాం అనే దాని పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే హీరో అఖిల్ అక్కినేని బాడీని బిల్డప్ చేయించారా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేసి తన బాడీని బిల్డప్ చేసుకున్నారని, ఆయన శ్రమకు తగిన ఫలితం లేదని కామెంట్స్ చేస్తున్నారు. 2 ఏళ్లకు పైగా ఒక మూవీ కోసం కష్టపడ్డ అఖిల్ కెరీర్ లో ఈ చిత్రం మాయని మచ్చలా ఎప్పటికి ఉండిపోతుందని అంటున్నారు. ఈ మూవీ డిజాస్టర్ కు కారణం మూవీ యూనిట్ మాత్రమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కథ:
రివ్యూ:
ఉగ్రం మూవీ పోలీస్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కింది. సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ నటించారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరుకి, అల్లరి నరేష్ లోని కామెడీ యాంగిల్ అనేది గుర్తుకు రాదు. నరేష్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. నరేష్ వైఫ్ గా మర్నా మీనన్ బాగానే చేసింది. డాక్టర్గా ఇంద్రజ బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు రాసుకున్న స్టోరీ బాగున్నా, కథనాన్ని నడిపించిన విధానం ఎఫెక్ట్గా అనిపించదు. ఫస్టాఫ్ మూవీ అంతా చాలా నెమ్మదిగా రొటీన్, యాక్షన్ డ్రామాల సాగుతుంది. లవ్ ట్రాక్ ఉన్నా అంతగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ , ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మూవీ సెకండాఫ్లో ఆడియెన్స్ కి కొంచెం రిలీఫ్ ను ఇస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.
రామచంద్రన్, జానకి దేవి ఇద్దరు 10వ తరగతి వరకు ఒకే స్కూల్ లో కలిసి చదువుకుంటారు. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమించుకుంటారు. కొన్ని సమస్యల వల్ల రామ్ టెన్త్ క్లాస్ తర్వాత ఫ్యామిలీతో చెన్నైకి వెళ్తాడు. ఆ తరువాత ఇద్దరు మళ్ళీ కలుసుకోరు. 22 ఏళ్ల తరువాత ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్ తన చిన్ననాటి ప్రదేశాలను, స్నేహితులను చూడటానికి తన సొంతూరు అయిన తంజావూరుకు వెళ్తాడు. ఆ క్రమంలో ఫ్రెండ్స్ ఏర్పరు చేసిన గెట్ టు గెదర్ పార్టీలో ప్రేమికులు ఇద్దరు కలుస్తారు. అయితే ఆమెకి వివాహం అవుతుంది.
ఆ సమయంలో వారు హోటల్ రూమ్ లో కబుర్లు చెప్పుకుంటారు. రోడ్డు మీద నడవడం, మెట్రోలో ప్రయాణిస్తూ తమ మధ్య అనుబంధాన్ని తెలుపుకుంటారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు వారి మధ్య అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్నివేశాలన్నీ కూడా చాలా సహజంగా, హృద్యంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్లో జాను, రామ్ విడిపోయే సన్నివేశంలో మొదట లిప్ లాక్ ఉంది. అయితే ఆ తరువాత వద్దనుకున్నారు.
ఈ విషయం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ సినిమాని చూస్తున్న ఆడియెన్స్ పాత జ్ఞాపకాల్లోకి వెళతారని, వారికి మంచి అనుభూతిని పంచుతుంది. పెళ్లి అయిన అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశం పెడితే జస్టిఫై అవదని భావించి, చాలా సార్లు చర్చించుకుని హీరో, హీరోయిన్ ను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించారు.
Also Read:
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సిటాడెల్ సిరీస్ లో సమంత నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సిరీస్ యాక్షన్ సీన్స్ కోసం ఆమె చాలా కష్టపడుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ సమంత ఎంతగానో కష్టపడుతోంది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే సమంత ఈ సిరీస్ కోసం రెమ్యూనరేషన్ ను కూడా భారీగానే తీసుకున్నట్లుగా టాక్.
సిటాడెల్ సిరీస్ కోసం సమంత 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. నిర్మాతలు 5 కోట్లతో పాటుగా ఇతర ఖర్చుల కోసం మరో కోటి రూపాయలు ఇస్తున్నారని తెలుస్తోంది. హీరో వరుణ్ దావన్ కు 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ ద్వారా సమంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానికి తగ్గట్లుగానే యాక్షన్ సన్నివేశాల కోసం సమంత కష్టపడుతోంది.
ఇక సమంత ఇతర సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మొదటి పాటను మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
1. ఆలీ:
2. వేణుమాధవ్:
3. కృష్ణ భగవాన్:
4.వెన్నెల కిషోర్:
5. శ్రీనివాస్ రెడ్డి:
6. సునీల్:
7. సప్తగిరి:
8. గెటప్ శ్రీను:
9. శకలక శంకర్:
10. రాం ప్రసాద్:
11. సత్య:
12. సుడిగాలి సుధీర్:
13. రాహుల్ రామకృష్ణ:
14. ప్రియదర్శి:
15. సూరి
సాధారణంగా పెద్ద చిత్రాలను రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ కొన్ని సినిమాలు విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వస్తున్నాయి. అలా నెలలోపే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2. విరాట పర్వం:
3. యశోద:
4. ధమాకా:
5. తెగింపు:
6. హంట్:
7. బలగం:
8. దసరా:
9. రంగ మార్తాండ:
10. దాస్ కా ధమ్కీ:
11. రావణాసుర:
12. ఏజెంట్:
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం 28 ఏప్రిల్, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రాన్ని నెలలోపే మే 19, 2023న ఓటీటీలో రిలీజ్ కానుంది.
1. వాణీ జైరామ్:
2. జావేద్ ఖాన్ అమ్రోహి:
3. నందమూరి తారక రత్న:
4. మయిల్సామి:
5. బేలా బోస్:
6. సతీష్ కౌశిక్:
7. సమీర్ ఖాఖర్:
8. ప్రదీప్ సర్కార్:
9. ఆకాంక్ష దుబే:
10. పమేలా చోప్రా:
11. డ్యాన్స్ మాస్టర్ చైతన్య:
11. మనోబాల:
ఇది తెలంగాణ రాష్ట్రంలో ని కోదాడలో చోటు చేసుకుంది. వరుడి షరతులకు ముందు ఆశ్చర్యపోయినా, ఆ తరువాత సంతోషంగా పెళ్లి కుమార్తె ఆమె ఫ్యామిలీ అంగీకరించారు. అయితే అవి వరకట్నానికి సంబంధించిన డిమాండ్ కాదు. పెళ్లి లో జరిగే పద్ధతులు మరియు సంప్రదాయాల గురించిన షరతులు. అందరు ఆశ్చర్యపోయేంతగా ఆ వరుడు పట్టిన ఆ షరతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.
పాండవులు మరియు ద్రౌపది మరణం గురించి మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో చెప్పబడింది. పాండవులు హస్తిన పురాన్ని విడిచి వెళ్లేముందు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ ను రాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత హిమాలయాలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వీరిని ఒక కుక్క అనుసరిస్తుంది. పాండవులు ద్రౌపదితో దారిలో కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని హిమాలయాలను దాటరు. ఈ క్రమంలో ముందుగా ద్రౌపది క్రింద పడి మరణిస్తుంది.
అప్పుడు భీముడు ద్రౌపది మరణానికి ధర్మరాజుని కారణం అడుగుతాడు. దానికి ద్రౌపదికి పాండవులు అందరు భర్తలు అయినప్పటికీ, ఆమె అర్జునుడి పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటుందని చెప్పాడు. ప్రయాణం సాగిస్తూ ఉండగా సహదేవుడు పడిపోయాడు. అప్పుడు భీముడు సహదేవుడు ఎందుకు పడిపోయాడు అని అడిగినపుడు తనకున్న జ్ఞానానికి అతడు ఎల్లపుడూ గర్వంతో ఉండేవాడని అందువల్లనే అతను పడిపోయాడని చెప్పాడు. ఆ తరువాత నకులుడు కింద పడిపోగా, ధర్మరాజు భీమునితో నకులుడు తన అందం పట్ల ఎక్కువగా గర్వపడ్డాడు. ఆ పాపం వల్లే పడిపోయాడని చెప్పాడు.
ఆ తర్వాత అర్జునుడు పడిపోయినపుడు, ధర్మరాజు భీమునితో యుద్ధానికి ముందు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధాన్ని తన శక్తితో ఒక్కరోజులోనే ముగించగలనన్న నమ్మకంతో ఉండేవాడని, కానీ అలా చేయలేకపోయాడని, అంతేకాకుండా, అతను ఎప్పుడూ ఇతర విలువిద్య నిపుణులను తక్కువ చూసేవాడని చెప్పాడు. అయితే ఆ తరువాత భీముడు పడిపోతూ నేనేం పాపం చేశాను అని అడిగినపుడు ధర్మరాజు నువ్వు అతిగా తినేవాడివని, నీ శక్తి సామర్ధ్యాల గురించి ప్రగల్భాలు చెప్పేవాడివని, ఇతరులను అగౌరవపరిచేవాడివని చెప్పాడు.
చివరగా ధర్మరాజు ముందుకు వెళ్ళగా ఆయనను కుక్కను అనుసస్తుంది. వారి ముందు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పగా, డానికి ధర్మరాజు ద్రౌపదిని, తన సోదరులను కూడా వెంట స్వర్గానికి తీసుకెళ్లాలని అడుగుతాడు. ఇంద్రుడు వారు ఇప్పటికే స్వర్గానికి చేరుకున్నారని చెప్పడంతో, తనతో పాటు కుక్కను స్వర్గానికి తీసుకెళ్లలాని కోరుతాడు. కుక్కకు స్వర్గ ప్రవేశం లేదని చెప్పడంతో అక్కడే ఉండిపోతానని ధర్మరాజు చెప్తాడు. అప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగా మారి తన గొప్పతనాన్ని పరీక్షించడానికి వచ్చానని వెల్లడిస్తాడు. పాండవులలో ఒక్క ధర్మరాజు మాత్రమే శరీరంతో స్వర్గంలో ప్రవేశిస్తాడు.