విజయ్ దేవరకొండ చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ్ దేవరకొండ తాను కొన్ని కుటుంబాలకి కోటి రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఈ విషయం ప్రకటించిన తర్వాత ఎంతో మంది అభిమానులు, “విజయ్ దేవరకొండ చాలా మంచి పని చేస్తున్నారు” అంటూ అభినందిస్తున్నారు.

అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ చేసిన పాత సినిమాకి సంబంధించిన నిర్మాతలు ఇప్పుడు చేసిన ఒక పోస్ట్ వార్తల్లో నిలిచింది. రెండు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ అయ్యి ఘోరమైన పరాజయం చవి చూసింది. ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన అభిషేక్ పిక్చర్స్ విజయ్ దేవరకొండ కోటి రూపాయలు విరాళం ప్రకటించిన క్రమంలో ట్వీట్ చేశారు. అందులో ఈ విధంగా రాశారు.

ఈ విషయంపై వాళ్లు మాట్లాడుతూ, “డియర్ విజయ్ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా మాకు 8 కోట్ల నష్టం వచ్చింది. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు ప్రతి కుటుంబానికి పెద్ద మనసు చేసుకొని ఒక కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నారు కాబట్టి, మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కుటుంబాలని కూడా కొంచెం ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. థాంక్యూ. మీ అభిషేక్ పిక్చర్స్.” అని రాశారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. సినిమా చాలా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్ చూసిన వాళ్లు ఇది ఒక ప్రేమ కథ అని అనుకున్నారు. సినిమా ప్రేమ కథ అయినా కూడా, అర్జున్ రెడ్డి సినిమా షేడ్స్ ఈ సినిమాలో చాలా ఉండటంతో, స్టోరీ పరంగా కూడా చాలా బలహీనంగా ఉండడంతో సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు.
![]()
కేవలం ఐశ్వర్య రాజేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే బాగుంది అని అన్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు అని ఆశించిన ప్రేక్షకులకి ఈ సినిమా నిరాశ మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు చేసిన ట్వీట్ పై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : మళ్లీ దొరికేశారు.! 38 ఏళ్ల క్రితం సినిమాని ఇప్పుడు ఫ్రీమేక్ చేశారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సంచలనం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, తన దైన రీతిలో నటిస్తూ, సినిమా సినిమాకి అభిమానులను, క్రేజ్ ను పెంచుకుంటూ పవర్ స్టార్ గా ఎదిగారు. సినిమాల కన్నా పవన్ వ్యక్తిత్వంతో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో సైతం పవన్ ను అభిమానించే హీరోలు ఎంతో మంది ఉన్నారు. పాలిటిక్స్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, జనసేనానిగా ప్రజల సమస్యల పై తన గొంతు వినిపిస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలోనూ వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే కోరాలో “పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం, కాదంటారా?” అనే ప్రశ్నను అడుగగా,
పవన్ కళ్యాణ్ కి కానీ ఇప్పటి యువ హీరోస్ ఎవరికైనా కానీ తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం అనే స్థాయి లేదు అని అందరికీ తెలుసు. ఆన్సర్స్ రాసే వాళ్ళు కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఒక వేళ అలా అనాల్సి వస్తే ఒక సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్ , కృష్ణ , చిరంజీవి లాంటి వాళ్లకి మాత్రమే ఆ స్థాయి వుంది” అని చెప్పుకొచ్చారు.







సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన సినిమా అతడు. ఈ మూవీ థియేటర్లలో కన్నా బుల్లితెర పై ఎక్కువ విజయాన్ని సాధించింది. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ పై పెట్టిన పెట్టుబడి కన్నా, ఊహించని స్థాయిలో ఆదాయం వచ్చిందని ఇండస్ట్రీ లో టాక్. ఇటీవలే ఈ మూవీ వెయ్యి సార్లు కన్నా ఎక్కువగా ప్రసారం అయిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీని సీనియర్ నటుడు మురళీ మోహన్ తన సొంత బ్యానర్ అయిన జయభేరి ప్రొడక్షన్స్ పైన నిర్మించారు.
మురళీ మోహన్ నటుడు మాత్రమే కాదు. నిర్మాత, వ్యాపార వేత్త కూడా విజయం సాధించాడు. నటుడుగా సినిమాలలో ఆర్జించిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి విజయం సాధించారు. జయభేరి అనే నిర్మాణ సంస్థ స్థాపించి పలు సినిమాలను నిర్మించాడు. కానీ అతడు మూవీ తరవాత మళ్ళీ మురళీ మోహన్ చిత్రాలను నిర్మించలేదు. మురళీ మోహన్ అతడు మూవీ తరువాత సినిమాలను ఆపడానికి గల కారణాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
అతడు మూవీ సమయంలో రాజకీయంగా తాను బిజీగా మారిపోయానని మురళీ మోహన్ తెలిపారు. ఒక మూవీని నిర్మించేటప్పుడు సెట్ లో నిర్మాత ఉండి, అన్నింటినీ దగ్గరుండి చూసుకోవాలని, మేనేజర్లను నమ్ముకోకూడదని అన్నారు. అందుబాటులో ఉండలేని కారణం వల్లనే ఆ మూవీ తర్వాత జయభేరి బ్యానర్ లో మరే సినిమాలు నిర్మించలేదని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. మళ్ళీ తన బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.



విజయ్ సేతుపతి, నల్లంది, యోగీబాబు నటించిన కడసీ వ్యవసాయి మూవీ కథ విషయానికి వస్తే, ఇది వ్యవసాయాన్ని నమ్ముకున్న ఒక రైతు కథ. అడవికి సమీపంగా ఉన్న ఒక పల్లెటూరులో వర్షాలు లేక కరువు వస్తుంది. దాంతో రైతులు తమ భూముల్ని అమ్ముకుంటారు. కానీ మల్లయ్య(నల్లంది) అనే 85 ఏళ్ల వృద్దుడు తన తాతముత్తాతల నుంచి వస్తున్న భూమినే నమ్ముకుని జీవిస్తుంటాడు. మల్లయ్య తన భూమిని అమ్మడానికి అంగీకరించడు. అయితే ఊరిలోని కరువు తొలగిపోవడానికి గ్రామదేవతకు జాతర చేయాలని ఊరివారు నిర్ణయించుకుంటారు.
కానీ గ్రామ దేవతకు వరి పండించి, దానిని మొక్కుగా ఇవ్వాలి. మల్లయ్య పొలంలోని బావిలో మాత్రమే నీళ్లు ఉండడంతో ఊరివాళ్లందరూ మల్లయ్య పొలంలో వారి పండించాలని అతన్ని ప్రాధేయపడతారు. మల్లయ్య దానికి అంగీకరించి, తన పొలంలోనే వరి పంటను వేస్తాడు. అయితే నెమళ్లు మల్లయ్య పొలంలో చనిపోవడంతో మల్లయ్యనే వాటిని చంపాడని కేసు పెడతారు.
జైలుకు వెళ్ళిన మల్లయ్య ఆ కేసు నుండి ఎలా బయటికి వచ్చాడు? పోలీసులు వరి పంట బాధ్యతను ఎందుకు తీసుకున్నారు? మల్లయ్యను ఊరి ప్రజలు ఎలా నిర్దోషిగా నిరూపించారు? మరణించిన మామా కుమార్తెను తలచుకుంటూ జీవిస్తున్న రామయ్య (విజయ్ సేతుపతి) ఎవరు? అన్నదే మిగిలిన కథ. 


సూపర్స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ‘చంద్రముఖి’ సినిమా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఆయన కెరీర్ లో మరపురాని చిత్రాలలో చంద్రముఖి మూవీ ఒకటి.
ఈ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే దర్శకుడు సీక్వెల్ ను తీస్తున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా, చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో వెంకటపతి రాజు గెటప్లో లారెన్స్ కనిపించారు. పోస్టర్ లో లారెన్స్ తల పెద్దగా, బాడీ చిన్నగా, ఉండటంతో ఈ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.