చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అనుష్క ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. నిశ్శబ్దం సినిమా తర్వాత మళ్లీ అనుష్క సినిమా చేయలేదు. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. మహేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది.

ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక కామెడీ సినిమా అని అర్థం అవుతోంది. ఇందులో హీరో స్టాండ్ అప్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ చెఫ్ పాత్రలో కనిపిస్తారు. సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన సోనియా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. హీరోయిన్ తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. హీరో తండ్రి పాత్రలో మురళీ శర్మ నటిస్తున్నారు అని ట్రైలర్ చూస్తూ ఉంటే అర్థం అయ్యింది.

ట్రైలర్ అంతా బాగానే ఉన్నా కూడా ఒక విషయం మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి. సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్కలో మార్పు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమాల్లో అనుష్క అంతకుముందులాగా బరువు తగ్గి కనిపించలేదు. ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు అనుష్కని ఇష్టపడ్డారు. అందుకే భాగమతి సినిమాని ఆదరించారు. “మా స్వీటీ ఎలా ఉన్నా బాగుంటుంది” అని అంటున్నారు.

అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే అనుష్కని యంగ్ గా చూపించడానికి కొన్ని ఫిల్టర్స్ వాడారు అని అర్థం అవుతోంది. చాలా సినిమాల్లో ఈ పద్ధతి అనుసరిస్తారు. అయితే కొన్ని సినిమాల్లో ఇలాంటివి తెలిసిపోతూ ఉంటాయి. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలో కూడా చిరంజీవిని ఒక సీన్ లో యంగ్ గా చూపించడానికి చేసిన ప్రయత్నం విఫలించడంతో ఆ సీన్ చూసి చాలా మంది ట్రోల్ చేశారు.

అంతే కాకుండా మానాడు సినిమాలో శింబు పాత్రని కూడా కొన్ని చోట్ల అలాగే ఫిల్టర్ వాడి యంగ్ గా సన్నగా చూపించే ప్రయత్నం చేశారు. అవి కూడా తెలిసిపోయాయి. సీనియర్ హీరోల చాలా సినిమాల్లో ఈ ఫిల్టర్స్ వాడుతూ ఉన్నారు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో ఈ ఫిల్టర్ ఉన్నా కూడా హీరో వయసు తెలిసిపోయి హీరోయిన్ పక్కన చాలా పెద్దగా కనిపించారు.

ఇప్పుడు ఈ సినిమాలో కూడా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ లో ఈ విషయం అర్థం అయిపోతోంది. ఏదో ఒకటి రెండు సీన్లు అంటే ఏమో కానీ సినిమా మొత్తం ఇలాగే చూపిస్తే కష్టం అని అంటున్నారు. మరి కొంత మంది, “ఏమో అసలు ఇలా చూపించాల్సిన అవసరం ఏముంది? అనుష్క చూడడానికి ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటారు. చాలా బాగా నటిస్తారు. ఇవన్నీ అవసరమా?” అని అంటున్నారు. మరి సినిమాలో ఎలా చూపిస్తారో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.
ALSO READ : ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు..! అంత ప్రత్యేకంగా ఏం ఉంది ఇందులో..?









‘గన్స్ అండ్ గులాబ్స్’ 1990ల కాలంలో ‘గులాబ్ గంజ్’ అనే ఊరులో సాగే స్టోరీ. గులాబ్ గంజ్ లో గవర్నమెంట్, ఔషధ తయారీ అవసరాల కోసం ఆ ఊరి రైతులు నిషేధిత నల్లమందుకు సంబంధించిన పంటను పండిస్తుంటారు. వారి దగ్గర ఆ పంటను గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంటుంది. అదే సమయంలో ఆ ఊరిలో ఉండే ఒక గ్యాంగ్ కూడా అక్రమంగా అక్కడి రైతులతో పెద్ద మొత్తంలో నల్లమందు పంటను పండిస్తుంది. ఈ పంటను వెస్ట్ బెంగాల్ కు చెందిన పెద్ద గ్యాంగ్స్టర్ కు అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది. దీనికి షేర్పూర్ లోని వేరే గ్యాంగ్ అడ్డుపడుతుంటుంది.
నల్లమందును కొనుగోలు విషయంలో ఈ రెండు గ్యాంగ్ ల మధ్య వార్ సాగుతూ ఉంటుంది. ఈ గోడవల వల్ల ‘నార్కోటిక్ ఆఫీసర్’ గా ఆ ప్రాంతానికి అర్జున్ వర్మ ( దుల్కర్ సల్మాన్) ను నియమిస్తారు. అర్జున్ నల్లమందు మాఫియాను ఎలా అడ్డుకుంటాడు? ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? బైక్ మెకానిక్ గా పనిచేసే టిప్పు ( రాజ్ కుమార్ రావు) పాత్ర ఏమిటి? రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే పోరులో ఎవరిది పైచేయి అనేది మిలిన కథ.
ఏడు ఎపిసోడ్లు గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో టిప్పుగా రాజ్ కుమార్ రావ్ సహజంగా నటించాడు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. అర్జున్ గా ఆ క్యారెక్టర్ కి జీవం పోశాడు. వైవిధ్యమైన పాత్రలో గుల్షన్ దేవయ్య నటించాడు. అయితే రాజ్ అండ్ డీకే గత సిరీస్ ల రేంజ్ లో లేదని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ వెబ్ సిరీస్ అలరిస్తుంది.
హీరో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముఖేశ్ కుమార్ సింగ్ తెరకేకిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్న విష్ణు, ఫైనల్ గా ఈ మూవీని ప్రకటించారు. అలాగే శ్రీ కాళహస్తిలో ప్రారంభించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో మంచు విష్ణు పక్కన హీరోయిన్ గా నుపుర్ సనన్ నటిస్తోంది. ఈమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సోదరి. నుపుర్ సనన్ బాలీవుడ్ లో నటి మరియు సింగర్. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజీలో కామర్స్ పూర్తి చేసింది. ఆమె తన అక్క కృతి సనన్ అడుగుజాడల్లో నడవడానికి ముంబైకి మారింది. అక్షయ్ కుమార్ సరసన బి ప్రాక్: బి ప్రాక్: ఫిల్హాల్ అనే మ్యూజిక్ వీడియోలో నటించి, గుర్తింపు తెచ్చుకుంది.
గత ఏడాది వచ్చిన కునాల్ కెమ్ము, సౌరభ్ శుక్లా నటించిన కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్ తో ఆమె నటిగా మారింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన నూరానీ చెహ్రా మూవీలో నటిస్తోంది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు మూవీ.
ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి పై అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 సక్సెస్ అయితే తొలిసారి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన దేశంగా చరిత్ర సృష్టించనుంది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం పై అడుగుపెడుతుందని ఇస్రో వెల్లడించింది. రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం అవడంతో అన్ని దేశాల దృష్టి ప్రస్తుతం చంద్రయాన్-3 పైనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చంద్రయాన్-3 గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో ఒక ఫొటోను షేర్ చేస్తూ, కామెంట్స్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోలో ఒక వ్యక్తి లుంగీ ధరించి, టీ పోస్తున్నట్లు ఉంది. అది కూడా కార్టూన్ లా ఉంది. ఇక ఈ ట్వీట్ కు ‘బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుండి పంపించిన తొలి చిత్రం’ అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టు వ్యంగ్యంగా ఉండటంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్-3 ఇండియాకి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ గుడ్డి ద్వేషంతో శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. మరొకరు చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించిందని, బీజేపీది కాదని కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
1. కింగ్ ఆఫ్ కొత్త:
2. గాండీవధారి అర్జున:
3. బెదురులంక 2012:
4. పార్ట్నర్ :
5. బాయ్స్ హాస్టల్:
6. మన్మధుడు:
ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా 29న రీరిలీజ్ కానుంది.
అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియో షేర్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం చర్చకు దారి తీసింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ తరువాత అనసూయ ఆ వీడియో గురించి మాట్లాడుతూ మళ్ళీ ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అప్పటికీ ఆమె ఎందుకు ఏడుస్తుందో క్లారిటీగా రాలేదు. ఈ క్రమంలోనే నటి శ్రీ రెడ్డి అనసూయ వీడియో పైన ట్విట్టర్ వేదికగా స్పందించింది.
శ్రీరెడ్డి తన ట్వీట్ లో ” అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా. ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, పాపం అవి తనని బాగా బాధిస్తున్నాయి.



కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ మూవీ తెలుగులో కూడా బ్లాక్బాస్టర్ గా నిలిచింది. నిరుద్యోగి కష్టాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అనుబంధాలు, హీరో కెరీర్ లో ఎదిగే విధానంతో పాటు, డైలాగ్స్, సాంగ్స్, ఇలా అన్ని అంశాలు ‘రఘువరన్ బి.టెక్’ ను యూత్కు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. రిలీజ్ అయిన ఎనిమిదేళ్ళ తరువాత ఈ మూవీ తాజాగా రీరిలీజ్ అవగా ఈ చిత్రానికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
యూత్ థియేటర్లో ఒక పాటకు పాట పాడుతూ హోరెత్తించారు. వారి పాటతో థియేటర్ మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో ధనుష్ తమ్ముడు కార్తీక్ గా నటించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. అతని పేరు హృషికేశ్. ఇతను ధనుష్ కు బావమరిది అవుతాడని తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కి బంధువు.
హృషికేశ్ పీస్బిబి స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ లో విజువల్ కమ్యూనికేషన్ను అభ్యసించారు. ఆ తర్వాత హృషికేశ్ యాడ్స్, డాక్యుమెంటరీలలో పని చేశారు. ‘వేలై ఇల్లా పట్టదారి’ మూవీలో ధనుష్ తమ్ముడి పాత్రలో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తరువాత రమ్ అనే మూవీలో లీడ్ రోల్ లో నటించారు. ఆమూవీ తరువాత వీఐపీ 2, పెద్దన్న, బొమ్మలకొలువు అనే తెలుగు సినిమాలోనూ నటించాడు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జైలర్’ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పలు దేవాలయాల దర్శిస్తూ, ఉత్తరప్రదేశ్ కు చేసరుకున్నారు. ఈ క్రమంలో రజనీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ని కలిసి, ఆయనతో ‘జైలర్’ మూవీని చూశారు. అయితే రజినికాంత్ కు స్వాగతం పలికిన సీఎం యోగి కాళ్లకు రజినికాంత్ నమస్కారం చేశారు.
రజినికాంత్ లాంటి పెద్ద హీరో తన కన్నా చిన్న వయసులో ఉన్న యోగి ఆదిత్య నాథ్ కాళ్ళకు నమస్కరించడం ఇటు తమిళనాడులో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో చేతులతో నమస్కరించడమో లేదా షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి కాకుండా యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశారని అభిమానులు, నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
రజనీకాంత్కు 72 సంవత్సరాలు కాగా, సీఎం యోగి వయసు 51 ఏళ్లని, రజిని తనకంటే వయసులో చాలా చిన్నవాడైన యోగి కాళ్లకు మొక్కడం ఆయన అభిమానులు బాధపడుతున్నారు. రజనీకాంత్ యాంటీ ఫ్యాన్స్ రజిని సినిమాలలోని కొన్ని సన్నివేశాలతో ట్రోల్ చేస్తున్నారు. ‘రజనీకాంత్ ఆత్మగౌరవాన్ని తమిళనాడులోనే వదిలేసి, యోగి కాళ్లకు నమస్కరించారు’ అని విమర్శిస్తున్నారు. అయితే కొందరు సీఎం యోగి సన్యాసి కావడం వల్లనే రజనీ అలా నమస్కరించాడని, అందులో తప్పులేదని వాదిస్తున్నారు. రజనీ ఆథ్యాత్మిక కోణంలో అలా చేశారని కొందరు అంటున్నారు.