జబర్దస్త్ కార్యక్రమం వల్ల ఎంతోమంది కమెడియన్లకి లైఫ్ వచ్చింది. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. అయితే ఇలా మనల్ని నవ్వించే కమెడియన్ల జీవితాల్లో కూడా బాధ ఉంటుందని మనకు తెలిసిందే.
ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్లో ఇలాంటి విషాదమే ఉంది. అతడే పంచ్ ప్రసాద్. వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తుంటాడు ఈయన. కొంతకాలం కిందట పంచ్ ప్రసాద్ కి రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయాయి. అప్పుడు నాగబాబు, రోజా తో సహా పలువురు కమెడియన్లు సాయం చేసారు. తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ కామెడీ టైమింగ్ తో నవ్విస్తున్నాడు ప్రసాద్.

ప్రస్తుతం పంచ్ ప్రసాద్ రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం ఇంకా మెరుగపడలేదు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాల్గొన్న పంచ్ ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు, నాగబాబు, రోజా గారు చాలా సహాయం చేసారు. కిరాక్ ఆర్పి గారు కూడా లక్ష రూపాయల సాయం చేసారు. నూకరాజు కూడా చాలా సహాయం చేసారు.

నాకు లెగ్ ఇన్ఫ్క్షన్, థైరాయిడ్ కూడా ఉన్నాయి. అందుకే ఆపరేషన్ అంటే భయపడ్డాను. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గినా తర్వాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారని అంతవరకు వెళ్లకుండా మెడిసిన్స్ తోనే తగ్గాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నా లైఫ్ ఇలా ఉన్నాసరే నా భార్య నాకు అండగా నిలబడింది. అసలు నా భార్య లేకపోతే నేను 5 సంవత్సరాల క్రితమే చనిపోయేవాడిని..” అంటూ భావోద్వేగానికి గురయ్యారు పంచ్ ప్రసాద్.

తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను, తన అనారోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన పంచుకుంటూ ఉంటారు. జబర్దస్త్ తో పాటు మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి షోస్ ద్వారా పంచ్ ప్రసాద్ మంచి పేరు సంపాదించాడు. అయితే ఆయన అనారోగ్యం మీద కూడా కొందరు కమెడియన్లు షోస్ లో కామెడీ చేస్తూ ఉంటే దాన్ని కూడా పంచ్ ప్రసాద్ చాలా సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటూ ఉంటారు.
Also read: హీరోయిన్ శ్రీలీల “చైల్డ్ ఆర్టిస్ట్” గా నటించారా..? ఏ సినిమాలో అంటే..?




ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆడియెన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆదిపురుష్ థియేటర్లలో ఆ ఒక్క టిక్కెట్ అంటే సీట్ హనుమాన్ కోసం వదిలేస్తారట. ఎందుకంటే రామాయణ పారాయణం, శ్రీరాముడి కథను కానీ ప్రదర్శించినపుడు అక్కడికి హనుమాన్ వస్తాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఆ ఒక్క సీటూ అంజనేయుడి కోసం ఉంచేస్తారట.
ఇక థియేటర్ ఫుల్ అయిన ఆ ఒక్క సీటు ఖాళీగా ఉంటే అందరి దృష్టి ఆ ఒక్క సీటు పైనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఆ సీట్ లో అంజనేయుడి ప్రతిమ ఉంచినట్లయితే ఆడియెన్స్ అందరు భక్తి మూడ్ లోకి వెళ్తారు. అలా హనుమాన్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్ అంటే మూవీకి పబ్లిసిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
1995 జూన్ 16న రిలీజ్ అయిన ‘అమ్మెరు’ మూవీ సమయంలో కూడా ఇలాంటిది చేశారు. కానీ అది మూవీ యూనిట్ ప్లాన్ చేయలేదు. ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలు కలిసి చేశారు. ఆ మూవీ ప్రదర్శింపబడుతున్న సమయంలో హారతులు పట్టారు. అలాగే థియేటర్ల బయట చిన్న దేవాలయాన్ని కూడా పెట్టారు. పూజలు, ప్రసాదాలు, హుండీల లాంటివి ఏర్పాటు చేశారు. అమ్మెరు మూవీ అప్పటికే హిట్ అయినా వీటి వల్ల ఆ మూవీ వసూళ్లు మరింతగా పెరిగాయి.








ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఛత్రపతి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియ నటించింది. అయితే ఈ మూవీని రాజమౌళి ముందుగా మాస్ మహారాజ రవితేజతో చేయాలని భావించడట.
అయితే సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు చేసే రవితేజ డేట్స్ ఇతర సినిమాలకి ఇవ్వడంతో డేట్స్ లేక ఈ సినిమాని ప్రభాస్ తో చేయాలని రాజమౌళి అనుకున్నాడు. కానీ ప్రభాస్ దగ్గరకి వెళ్ళడానికి కాస్త ఆలోచించాడట. దానికి కారణం గతంలో రాజమౌళి ప్రభాస్ స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి చిత్రాలను రిజెక్ట్ చేసాడు. ఈ మూవీని కూడా రిజెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నాడట.
అయితే ఒకరోజు ప్రభాస్ పుట్టినరోజు పార్టీకి తెలుగు స్టార్ హీరోలు, నిర్మాతలను కూడా ఆహ్వానించాడట. ఆ ఆహ్వానం తనకు కూడా రావడంతో రాజమౌళి పార్టీకి వెళ్ళినపుడు, తన దగ్గర ఒక కథ ఉందని, వింటావా అని ప్రభాస్ ని అడగాడట. తరువాతి రోజు చెప్పమని అన్నాడంట. రాజమౌళి తరువాతి రోజే ప్రభాస్ ఇంటికి వెళ్లి కథ చెప్పడం, ప్రభాస్ కి నచ్చడంతో ఒకే చెప్పారంట.
టాలీవుడ్ చిత్రాలలో నటించి హీరోగా మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్ కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2021 లో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం మూవీ ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ మూవీ పై సిద్ధార్థ్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా మాట్లాడాడు. మహాసముద్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో కానీ ఆమూవీ ఆశించినట్లుగా విజయం సాధించలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ప్లాప్ అవడం పై ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ‘మహా సముద్రం’ నా ఫేవరెట్ సినిమా. కానీ ఆ మూవీ జనాలకి కనెక్ట్ కాలేదు. హీరో ఫ్రెండ్ లవర్ ను పెళ్లి చేసుకోవడం ఆడియెన్స్ కి నచ్చలేదు, అందువల్లే ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అలా అని ఈ చిత్రం చెడ్డ మూవీ కాదు. దర్శకుడు అజయ్ భూపతితో వర్క్ చేయడానికి ఇప్పటికీ నేను రెడీగా ఉన్నాను.
అతను గ్రేట్ టెక్నీషియన్. ఆర్.ఎక్స్ 100 మూవీని మించిన చిత్రాలు అజయ్ నుండి చాలా వస్తాయని అన్నారు. కొంతమంది నాతో ఈ మూవీ మరో 10 సంవత్సరాల తరవాత రావాల్సింది అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియదని చెప్పుకొచ్చారు.



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18

