గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన మణిరత్నం మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ తమిళంలో ఘనవిజయమే సాధించినా.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అది రుచించలేదు. మధ్యలో ఆగిన ఆ కథను కొనసాగిస్తూ ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్-2’తో వచ్చాడు మణిరత్నం. అయితే తమిళం లో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
అయితే ఈ మూవీ లో నటించిన అందరి నటనకి మంచి మార్కులే పడ్డాయి.ముఖ్యం గా కుందవై పాత్రలో త్రిష కూడా ఇట్టే ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటించింది. పురుషుల ప్రపంచంలో, ధైర్యం ఉన్న స్త్రీగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించింది యువరాణి కుందవై పిరట్టియార్. ఆమె పాత్రలో త్రిష కూడా అంతే హుందాగా కనిపించింది. ముఖ్యంగా త్రిష – ఐశ్వర్య రాయ్ పాత్రల మధ్య వ్యూహాల పోరు అద్భుతం గా ఉన్నాయి.

ఈ సినిమా మొదటి భాగానికి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించగా, ఈ సినిమా రెండో భాగం కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. ఈ చిత్రం విడుదలై అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం కూడా మొదటి పార్ట్ లాగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ మూవీ లో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో ఎవరు ఈ అమ్మాయి అని అందరికి ఆసక్తి పెరిగింది. అయితే చిన్నప్పటి కుందవై పాత్రలో నటించిన ఆ పాప పేరు నీల. ఈమె తల్లిదండ్రులు కూడా ఈ రంగం లోనే ఉన్నారు. ప్రముఖ తార జంట కవితా భారతి-కన్యా భారతి కుమార్తె నీల.

నీల తల్లి కన్యా భారతి ఎన్ను స్వానర్థం జాని, తమిళ మగల్, వల్లి, దైవం తాండ వీడు, అంబే వా వంటి పలు సీరియల్స్ లో నటించారు. అలాగే నీల తండ్రి కవితా భారతి కూడా పలు పాపులర్ సీరియల్స్ లో నటించారు. వీరి ఫామిలీ ఫోటోలను చుసిన ఫాన్స్ అందరు షాక్ అవుతున్నారు.

సిల్క్ స్మిత ఎలాంటి సినినేపథ్యం లేకుండా మేకప్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి, స్టార్ గా ఓ వెలుగు వెలిగారు. సిల్క్ స్మిత తన నిషా కళ్లతో ఆడియెన్స్ ని మాయలో పడేసింది. అప్పట్లోనే గ్లామర్ రోల్స్ లో నటించింది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్ మనసుల్లో ఆమె అలాగే ఉండిపోయింది. దశాబ్దం పాటు ఇండస్ట్రీలో వందలాది సినిమాలలో నటించిన ఆమె, చివరకు బలవన్మరణానికి పాల్పడి, కన్నుమూసింది. ఆమె మరణం చాలా మందిని కలిచివేసింది.
అయితే ఆమె మరణించిన తరువాత ఇండస్ట్రీ నుండి ఒక్క హీరో కానీ, డైరెక్టర్స్, నిర్మాతలు ఎవరు వెళ్లలేదు. ఆఖరికి ఆమె కుటుంబసభ్యులు కూడా సిల్క్ స్మితను చూడాటానికి వెళ్లలేదు. దాంతో సిల్క్ స్మితకు అనాథ శవంలా అంతిమ సంస్కారాలు చేశారు. అయితే ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సిల్క్ స్మిత అందాల తారగా నిలిచిపోయింది. ఇటీవల రిలీజ్ అయిన దసరా మూవీలో కనిపించిన సిల్క్ స్మిత పోస్టర్ తో ఆమె జీవితం వార్తల్లో నిలిచింది.
అచ్చం సిల్క్ స్మిత లాగే కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సిల్క్ స్మిత అని పిలుస్తున్నారు. ఆమె పేరు విష్ణు ప్రియ. ఫేస్ మాత్రమే కాకుండా ఎక్స్ప్రెషన్స్తో సైతం ఆమె సిల్క్ స్మితను గుర్తు చేస్తుంది. అంతే కాకుండా విష్ణుప్రియ సిల్క్ స్మిత సాంగ్స్ కు రీల్స్ చేస్తూ నెట్టింట్లో సందడి చేస్తోంది. విష్ణు ప్రియ జూనియర్ సిల్క్ గా పాపులర్ అయ్యింది.
2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం.
ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్లలో తక్కువగా, చిన్న స్క్రీన్లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు. వసూళ్ల పరంగా మొత్తం ఓపెనింగ్ వీకెండ్ గ్రాస్ 18 కోట్లకు పైగా ఉంటుంది. 2018 మలయాళం సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.
ప్రభాస్, కృతి సనన్ సీతారా చిత్రం ములుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ వి.ఎఫ్.ఎక్స్ నాసిరకంగా ఉందని, కార్టూన్ మూవీలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. అయినప్పటికీ ‘ఆదిపురుష్’ టీజర్ ట్రెండ్ అవడమే కాక, యూట్యూబ్ లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ‘ఆదిపురుష్’ పై ట్రోల్స్ రావడం, ప్రభాస్ లుక్ పై సెటైర్లు రావడం ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చలేదు అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో మే 9న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు థియేటర్లలో, అదే సమయంలో యూట్యూబ్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ‘ఆదిపురుష్’ ట్రైలర్ 105 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈరోజు హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్ లో ట్రైలర్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. ట్రైలర్ ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ ఇలా ట్వీట్ చేశారు. ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకన్లు. ట్రైలర్ సీతను ఎత్తుకెళ్ళే సన్నివేశంతో మొదలై, రావణుడితో ఆఖరి పోరు వరకు జరిగే సంఘటనలతో కుడి ఉందని తెలిపారు. డీసెంట్ ట్రైలర్, టీజర్ కంటే వీఎఫ్ఎక్స్ బెటర్ గా ఉందని ట్వీట్ లో రాసుకొచ్చారు.
‘ఆదిపురుష్’ ట్రైలర్ ను చూసిన మరొక ట్విట్టర్ యూజర్ తన ట్వీట్ లో ” ట్రైలర్ లో 2 నిముషాల 32 సెకండ్ల వద్ద షాట్ గూస్బంప్స్ వచ్చేలా ఉందని బెస్ట్ వి.ఎఫ్.ఎక్స్ షాట్” అని రాసుకొచ్చారు. అలాగే మరొక ట్వీట్ లో ట్రైలర్ లోని చివరి షాట్ అందరినీ విస్మయానికి గురి చేస్తుందని తెలిపారు. 





భారత్ లోని గొప్ప డైరెక్టర్ల జాబితాలో వెట్రిమారన్ పేరు కూడా ఉంటుంది. ఆయన తీసింది 5 చిత్రాలే అయినా, ప్రతీ చిత్రం ఒక అద్భుతమే. ఆయన చిత్రాలకు అవార్డులు కూడా దాసోహం అవుతుంటాయి. ఇటీవలే ఆయన తెరకెక్కించిన ‘విడుతలై పార్ట్-1’ విడుదల అయ్యి, కోలీవుడ్ లో కోట్లు కొల్లగొడుతుంది. ఎక్కడో, ఎప్పుడో విన్న లేదా చూసిన సంఘటలనే వెట్రిమారన్ మూవీగా తెరకెక్కిస్తుంటాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘విడుదల పార్ట్ 1’ కూడా అలాంటి చిత్రమే.
1987 లో తమిళనాడులోని ఒక ప్రాంతంలో జరిగే స్టోరీ ఇది. ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను ప్రజాదళం అనే విప్లవ పార్టీ వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. ఈ క్రమంలో పోలీసులకు మరియు ప్రజాదళం పార్టీకి మధ్య జరిగే సంఘర్షణ ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత తమిళ నాడులో ఈ సినిమా పై చర్చలు మొదలయ్యాయి. 1980వ దశకంలో తమిళనాడులో ఎక్కువగా వినిపించిన పేరు కవి కు.కళీయపెరుమాళ్. ఈ పాత్రనే ‘విడుతలై పార్ట్-1’ చిత్రంలో విజయ్ సేతుపతి చేశారని తెలుస్తోంది.
కళీయపెరుమాళ్ అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. ఆ తర్వాత విభేదాలతో ఉద్యమంలో చేరారు. ఉపధ్యాయుడు అయిన పెరుమాళ్ కుల నిర్మూలన పై పోరాడారు. కుల నిర్మూలన, వర్గ విముక్తి కోసం కృషి చేయడం కోసం ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి, పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. పెన్నాడంలోని ప్రైవేట్ చక్కెర కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల హక్కుల కోసం కలియ పెరుమాళ్ ఆధ్వర్యంలో భారీ నిరసనలు జరిగాయి. కార్మికులు సమ్మెకు దిగారు.
దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం కలియపెరుమాళ్ను చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. రాత్రిపూట కలియ పెరుమాళ్ కూలిలను తీసుకెళ్ళి, రైతుల ఆధీనంలో ఉన్న భూముల్లోని వరిపంటను కోసి పేదలకు, పంపిణీ చేసేవాడు. ఈ ‘పంట ఉద్యమం’ గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో మార్మోగింది. కలియపెరుమాళ్ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. పొన్పరప్పికి చెందిన తమిళరసన్తో పాటుగా చాలామంది యువకులు కలియపెరుమాళ్ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నారు.
రైలును బాంబుతో పేల్చే సీన్ ‘విడుతలై పార్ట్-1’ చిత్రంలో మొదటి సన్నివేశంలో కనిపిస్తుంది. అయితే 1987లో అరియలూరు సమీపంలోని మరుదైయార్త్ వంతెనను బాంబుతో పేల్చివేసిన ఘటన కూడా మూవీలో చూపించిన తరహాలోనే జరుగిందని అంటున్నారు. అప్పుడు వంతెనను పేల్చివేయడంతో, మలైకోట్ ఎక్స్ప్రెస్ రైలు కూలి 50 మందికి పైగా చనిపోయారు. ఆ కేసులో తమిళరసన్తో పాటు లిబరేషన్ ఆర్మీ మెంబర్స్ కేసు నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్లో పొన్పరప్పిలోని బ్యాంకులో చోరీకి ప్రయత్నించి తమిళరసన్తో పాటు ఐదుగురిని కొట్టి చంపారు.
హత్య కేసులో, కవి కలియపెరుమాళ్ మరియు అతని పెద్ద కుమారుడు వల్లువన్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1972లో కడలూరు కోర్టు రెండో కుమారుడు చోళ నంబియార్తో సహా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వల్లువన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. కలియపెరుమాళ్కు విధించిన మరణశిక్షను, ఇతరులకు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది.
అనంతరం కలియపెరుమాళ్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ కాళయపెరుమాళ్ మరియు అతని కుమారులు జైలులో ఉన్నారని తెలుసుకుని, సుప్రీం కోర్టులో కేసు వేశారు. విచారన తర్వాత, 1983లో సుప్రీంకోర్టు కలియపెరుమాళ్ తో పాటు ఇతరులకు పెరోల్ మంజూరు చేసింది.కొన్నేళ్ళ తర్వాత, సుప్రీం కోర్టు ఆదేశాలతో వారు పూర్తిగా శిక్ష నుండి విముక్తి పొందారు. కలియపెరుమాళ్ మే 16, 2007న మరణించారు.
కవి కలియపెరుమాళ్ రెండవ కుమారుడు చోళ నంబియార్ ‘విడుతలై పార్ట్-1’ సినిమా గురించి మాట్లాడుతూ, “తన తండ్రి ప్రజల కోసం పోరాడారు. ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఆ విషయాన్ని అలాగే ఈ చిత్రంలో చూపించారు’’ అని చెప్పారు.















