సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష.గత వారం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతుంది.మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే తోపాటు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించాడు.
అందరూ అనుకుంటున్నట్లు కార్తీక్ దండుకి విరుపాక్ష మొదటి సినిమా కాదు, ఇది అతని రెండో సినిమా. ఎనిమిదేళ్ల క్రితమే దర్శకుడిగా మొదటి సినిమా చేసిన కార్తీక్ దండు, 2015లో ‘భం భోలేనాథ్’ అనే సినిమా చేశాడు. నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా నటించిన ఈ కామెడీ సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. అలాగే 2014లో వచ్చిన నిఖిల్ ‘కార్తికేయ’ సినిమాకి మూల కథని అందించారట కార్తీక్ దండు.

తాజాగా ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ దండు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ” భం భోలేనాథ్ తో డైరెక్ట్ గా మారాను కానీ ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో విరూపాక్ష కథ రెడీ చేసుకున్నాను. సుకుమార్ దగ్గరికి వెళ్లి స్టోరీ వినిపించాను ఆయనకు బాగా నచ్చడంతో సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తానని అన్నారు. అలాగే మూవీ లో కొన్ని చేంజెస్ చెప్పారు. సుకుమార్ సర్ని కలిసిన తర్వాత కనీసం 6, 7 స్క్రీన్ప్లే వెర్షన్లు రాసుకున్నాం. ప్రధాన కథనాన్ని మాత్రం ఎప్పుడూ మార్చలేదు.

క్లైమాక్స్ ఐడియా కూడా సుకుమార్ గారిదే.అది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మెయిన్ విలన్ నే సుకుమార్ గారు మార్చేశారు. అలాగే సినిమాలో కనిపించిన యూనిక్ మర్డర్ సన్నివేశాలు కూడా ఆయనే సూచించారు.” అని దర్శకుడు కార్తీక్ తెలిపారు. విరూపాక్ష బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకు పోతుండడంతో కార్తీక్ దండుకి టాప్ బ్యానర్ల నుండి ఆఫర్లు వస్తున్నాయట. అయితే తన నెక్స్ట్ మూవీ కూడా థ్రిల్లర్ జోనర్ లోనే చేయాలనుకుంటున్నాడట ఈ దర్శకుడు.

ఏదేమైనా మొదటి సినిమా చేసిన ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మూవీ చేసి హిట్ కొట్టడం అంటే మాటలు కాదు. వేరే ఎవరైనా అయితే మొదటి సినిమా ఫ్లాప్ అవ్వగానే ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయే వాళ్లేమో. అలా వెళ్లకుండా ఇక్కడే ఉంటూ వచ్చాడు కాబట్టే ఈరోజు కార్తీక్ దండు ఖాతాలో విరుపాక్ష లాంటి సాలిడ్ హిట్ పడింది. మరి ఈ యంగ్ డైరెక్టర్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ తో మన ముందుకు వస్తాడో చూడాలి.

తేజ్ కి యాక్సిడెంట్ జరిగినపుడు అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేశారు. కిందపడిన తేజ్ ను లేపి, నీళ్లు తాగించాడు. అయితే ఆ సమయంలో అతనికి ప్రమాదం జరిగింది సాయి ధరమ్ తేజ్ కు అని తెలియదంట. మానవత్వంతోనే సాయి ధరమ్ తేజ్ ను కాపాడాడు. అయితే తేజ్ కోలుకున్న తర్వాత అబ్దుల్ ను తేజ్ కలిశాడని, అలాగే అతనికి ఏ సాయం కావాలన్నా అడగమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
అంతే కాక మెగా కుటుంబం లక్షల రూపాయలు, కారు, బంగ్లా వంటివి బహుమతిగా ఇచ్చారని కూడా ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే ఇటీవల తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ నిజం కాదని, ఎలాంటి రివార్డు కూడా అబ్దుల్ కి ఇవ్వలేదని స్వయంగా చెప్పాడు. అయితే ఫోన్ నెంబర్ అబ్దుల్ కి ఇచ్చానని, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు కాల్ చేయమన్నానని తెలిపాడు.
ఇదే విషయాన్ని అబ్దుల్ ఫర్హాన్ అడుగగా సాయి ధరమ్ తేజ్ కానీ, మెగా కుటుంబం కానీ తనకు ఎటువంటి సాయం చేయలేదని అబ్దుల్ అన్నారు. తేజ్ తనను కలవలేదని, ఫోన్ నంబర్ ఇవ్వలేదని, ఈ ఫేక్ ప్రచారాలు వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాడు. చేసే ఉద్యోగం కూడా వదిలేశానని అన్నాడు.
అప్పట్లో ఒక షాప్ లో వర్క్ చేసేవాడిని, తేజ్ ను కాపాడినందుకు మెగా కుటుంబం డబ్బులు, కారు, బిల్డింగ్ ఇచ్చినట్టు రూమర్స్ రావడంతో షాప్ కు వచ్చిన వారందరూ బాగా డబ్బు ఇచ్చారంట కదా అని బాగా వేధించారని అది తట్టుకోలేక ఆఖరికి ఉద్యోగం మానేశాను. 4 నెలల నుండి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
సమంత అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన అప్పటి నుండి ఆమె ఏం చేసినా? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఆమెకు సంబంధించిన చిన్న విషయం అయిన సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విడాకుల తరువాత ఆమె పెట్టే పోస్ట్ లపై నెటిజన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే సమంత వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యింది. ఆమె సామాజిక మధ్యమాలలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన పై ఎవరైనా కామెంట్ చేసినా, వారికి ధీటుగా కౌంటర్ ఇస్తూనే ఉంది.
ఫ్యామిలీ మ్యాన్, పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ పాటతో బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. యశోద మూవీ షూటింగ్ సమయంలో ఆమె అనారోగ్యానికి గురి అయిన విషయం అందరికి తెలిసిందే. అనారోగ్యంతోనే షూటింగ్ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి, ఆమె తన తరువాతి సినిమాల పై దృష్టి సారించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత యాడ్స్ కోసం తీసుకునే రెమ్యునరేషన్ విషయం పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సమంత ఒకరు. గతంలో పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ కోసం సమంత కోటిన్నర పారితోషికం తీసుకుందంట. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక్కో సినిమాకి 3-4 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక యాడ్ పోస్ట్ చేయడం కోసం ఇంతకు ముందు 8 లక్షలు తీసుకునేదట. ప్రస్తుతం ఆమె యాడ్ పోస్ట్ కి 20 లక్షలకు పెంచిందంట. సమంత ఇన్స్టాగ్రామ్ లో కమర్షియల్ యాడ్ పోస్ట్ చేయడం కోసం 15- 20 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందని సినీ వర్గాల్లో టాక్ .
కోడి రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం అనే గ్రామంలో 1883లో నవంబర్ 3న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి తండ్రి స్పూర్తితో బాబాయి కోడి నారాయణస్వామి వద్ద పెరిగారు. అక్కడ ఉండే ఒక వ్యాయామశాలలో చేరి కుస్తీ నేర్చుకుంటూ దేహధారుడ్యాన్ని పెంచుకునేవాడు. 21 ఏళ్ల వయసులోనే చెస్ట్ పై 1 1/2 టన్నుల బరువును మోసేవారు. ఆ తరువాత మూడు టన్నుల బరువు కూడా మోసేవారు.
మద్రాసులో ఒక కాలేజిలో ఏడాది వ్యాయామశాలలో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ అందుకుని వ్యాయామ ఉపాధ్యాయుడుగా తాను చదివిన విజయనగరంలో హైస్కూలులోనే చేరారు. అక్కడే తన మిత్రుడు పొట్టి పంతులు సహాయంతో సర్కస్ కంపెనీ పెట్టారు. తుని రాజాగారి సహకారం కూడా లభించింది. రామమూర్తి సర్కస్ కంపెనీ చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
1912లో మద్రాసుకు చేరుకున్నారు. చైనా, జపాన్ కళాకారుల సహకారంతో కోడి రామ్మూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంది. వీటిలో భాగంగా రామ్మూర్తి గట్టిగా గాలి పీల్చుకుని కండలను బిగించి, ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను సైతం తెంచేవారు. ఆయన తన చెస్ట్ పై ఏనుగును ఎక్కించుకుని 5 నిముషాల పాటు అలాగే ఉండేవారు. ఆయన 2 కార్లను తాళ్ళతో కట్టి 2 చేతులుతో పట్టుకుని వాటిని కదలకుండా ఆపేవారు. అంతే కాకుండా ఒక్క చేత్తోనే రైల్ ఇంజను ఆపేవాడు. ఆ రోజుల్లోనే లండన్ కు వెళ్లి అక్కడ బకింగ్ హామ్ ప్యాలెస్ లో కుస్తీ పోటీలో సత్తా చాటాడు.
అప్పుడే బ్రిటిష్ రాణి రామ్మూర్తికి ఇండియన్ హెర్క్యులెస్ అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయన జీవితంలో ఎన్నో బిరుదులు అందుకున్నారు. అంత గొప్ప మల్లయుద్ధ యోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథ పై త్వరలోనే ఒక సినిమా రానుందని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 మూవీ కోడి రామ్మూర్తి బయోపిక్ ఆని సమాచారం.
గోపీచంద్ , శ్రీవాస్ కలయికలో వస్తున్న 3వ చిత్రం ఇది. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మే 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో మొదలుపెట్టింది. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదల అయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. డైరెక్టర్ శ్రీవాస్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే సెన్సార్ సభ్యులు తమ చిత్రాన్ని ప్రశంసించారని కూడా తెలిపారు.
ఈ చిత్రంలో ఎలాంటి కట్స్ కానీ మ్యూట్ కానీ చేయకుండా సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. ఈ మూవీని చూసిన తరువాత సెన్సార్ సభ్యులు తనని, కో ప్రొడ్యూసర్ వివేక్ ని పిలిచి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారని, కట్ చేసే అడియొకని, వీడియో కానీ లేవని చెప్పి అభినందించారని పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్ల యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిపారని రాసుకొచ్చారు. అలాగే సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.
మే 5న మా సినిమా విడుదల అయినప్పుడు ప్రేక్షకులు ఈ విధంగా అనుభూతి చెంది మా ‘రామబాణం’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి కుష్బూ కీలక రోల్ లో నటిస్తున్నారు. ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ డైరెక్టర్ తేజతో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మూవీ సాధించే వసూళ్ల ఆధారంగా గోపీచంద్ నెక్స్ట్ చేసే చిత్రాల బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో కృష్ణ కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. ఒకరు మహేష్ బాబు, మరొకరు సుధీర్ బాబు మరియు గల్లా అశోక్. కృష్ణ జీవించి ఉండగానే హీరో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు గల్లా అశోక్. అలాగే కృష్ణ కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల పై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించిన నిజం సినిమా మనం అంతా ఈజిగా మారిచిపోలేం. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలతో పాటు నంది అవార్డ్ కూడా దక్కాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్లో ‘చందమామ రావే’ అంటూ ఓ పాట ఉంది.
టైటిల్ సమయంలో వచ్చే ఈ పాటలో ఓ తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. ఆ అబ్బాయి ఎవరో కాదు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణ చిన్న కర్మనాడు ఆ విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినిమా రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కృష్ణ ప్రోత్సాహం మేరకు అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణ చనిపోయిన తర్వాత జయకృష్ణ ఆయన్ను చూసేందుకు కూడా రాలేకపోయారు. అమెరికా నుండి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది.
ఇటీవల హైదరాబాద్కు చేరుకున్న ఆయనతో కలిసి మహేష్ బాబు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయకృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణ లేకపోవడంతో అన్నయ్య రమేష్ బాబు కుటుంబ బాధ్యతలను మహేష్ బాబు చూసుకుంటాడని అంటున్నారు. ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే పాన్-ఇండియా సినిమాలతో భారతీయ చిత్రసీమలో స్టార్ హీరోయిన్. పూజా హెగ్డే సినిమాల నుండి, ఎండార్స్మెంట్ల నుండి భారీగా సంపాదీస్తోంది. పూజా హెగ్డే ఆస్తుల విలువ సుమారుగా 50 కోట్లు. ఆమెకు ఖరీదైన కార్లు, హ్యాండ్బ్యాగులు సేకరించే అభిరుచి ఉంది.ఇక పూజా హెగ్డే లగ్జీరియస్ లైఫ్ గురించి, ఆమె దగ్గరున్న విలువైన 9 ఖరీదైన వస్తువులు ఏమిటో ఇక్కడ చూద్దాం..
2. హైదరాబాద్లో రూ. 5 కోట్ల విలువైన ఇల్లు తీసుకుంది.
3. ముంబైలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్మెంట్ తీసుకుంది.దీని విలువ రూ. 6-8 కోట్లు
5. బుట్టబొమ్మ వద్ద రూ. 80 లక్షల విలువైన BMW 350d కారు ఉంది.
6. ఆమె దగ్గరున్న ఆడి క్యూ7 విలువ రూ. 85 లక్షలు.
7. పూజా హెగ్డే దగ్గర క్రిస్టియన్ డియర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ విలువ రూ. 1.3 లక్షలు
8. లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ. 1.4 లక్షలు.
9. లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 1.91 లక్షలు
ప్రభుదేవా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడ స్టార్ హీరోలతో వరుస మూవీస్ చేస్తూ బిజీ డైరెక్టర్గా అయ్యాడు. ప్రభుదేవా ఎక్కువగా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందుకున్నారు. ప్రస్తుతం మరోసారి నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారిన తర్వాత ప్రభుదేవా కొరియోగ్రాఫర్గా కొనసాగలేదు. ఒకరిద్దరు స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసారు.
తాజాగా ప్రభుదేవా గురించిన ఒక పోస్ట్ పై సోషల్ మీడియాలో పై చర్చ జరుగుతోంది. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముంది అంటే ప్రభుదేవా ఇంస్టాగ్రామ్ అఫిసియల్ అకౌంట్ మరియు ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటు ఫోటోలను కలిపి పెట్టారు. అయితే ప్రభుదేవాకి 380k ఫాలోవర్స్ ఉండగా, ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటుకి 473k ఫాలోవర్స్ ఉన్నారు. పెట్టిన కొన్ని గంటల్లోనే పోస్ట్ కి 14 k లైక్స్ వచ్చాయి. దీంతో ఆ పోస్ట్ పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అక్కౌంట్లో ఎక్కువ పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కామెంట్ చేస్తే, మరి కొంతమంది ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు మరి అంటున్నారు.


