సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయం అయిన క్షణాల్లో వైరలవుతోంది. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సామాన్యులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా వారి పెళ్లి, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
సోషల్ మీడియా వాడకం అందరికి అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీల వార్తలు ఏవైనా సరే వెంటనే ఫ్యాన్స్ కి చేరుతున్నాయి. సోషల్ మీడియా సెలబ్రిటీలు ఫ్యాన్స్కు మధ్య వారధిగా మారింది. తాజాగా ఒక నటి రహస్యంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మరి ఆ నటి ఎవరో? ఏవరిని పెళ్లి చేసుకుందో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొందరు రహస్యంగా, సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నారు.పెళ్లి తరువాత ఆ ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక నల్కారి సీక్రెట్గా వివాహం చేసుకుని అందరికి షాకిచ్చింది. పెళ్లి ఇక్కడ కాకుండా విదేశాల్లో చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రియాంక నల్కారి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కి సుపరిచితామే. బాలనటిగా కూడా చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్నింటిలో ముఖ్యమైన పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి యాంకర్గా చేసింది. అయితే ఆ ప్రోగ్రామ్ అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రియాంకకు యాంకర్ గా గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఆఫర్స్ లేకపోవడంతో ప్రియాంక తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమె నటిస్తోన్న రోజా సీరియల్ తమిళంలో టాప్ రేటింగ్తో రన్ అవుతోంది. దాంతో అక్కడ ప్రియాంకకు పాపులారిటీ విపరీతంగా వచ్చింది.
ఈ క్రమంలో మార్చి 23న ప్రియాంక పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి వ్యక్తితో ఆడంబరాలకు పోకుండా ఎంతో సింపుల్గా దేవాలయంలో పెళ్లి చేసుకుంది. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఆమె ఫాలోవర్లు అందరు సడెన్గా, సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటూనే శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రియాంక తన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
Also Read: సొంత అన్నదమ్ములు కాకపోవడం వల్లే మంచు సోదరుల మధ్య గొడవలు అవుతున్నాయా?
https://www.instagram.com/p/CqIXjLqLBtM/



మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు విష్ణును ఇద్దరు మనుషులు ఆపుతున్నారు. విష్ణు కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు. కానీ ఆ తరవాత ఎందుకో డిలీట్ చేశాడు. అయితే గతంలోనే వీరి మధ్య గొడవలు ఉండేవని, మనోజ్ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకోవడం వల్ల విభేదాలు తారాస్థాయికి వెళ్లాయని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మంచు మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములు కారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మి. పిల్లలు చిన్న వయసులోనే విద్యాదేవి మరణించడంతో మోహన్ బాబు విద్యాదేవి చెల్లి నిర్మలాదేవిని రెండవ పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవి కుమారుడే మనోజ్. ఇక మనోజ్ కు మంచు లక్ష్మీతో పాటు విష్ణుతో కూడా విభేదాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే మనోజ్ పెళ్లిని అక్క లక్ష్మీనే దగ్గరుండి మరి తల్లిలా జరిపించారు.
Also Read:
ఉపాసన అందించిన సేవలకు ఈ ఘనత లభించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. ఇందుకు గాను ఉపాసన కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేసింది. పర్సనల్ జీవితాన్ని మరియు ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా నిర్వహిస్తున్న వారిలో ఉపాసన ఒకరని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉపాసన తల్లి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. వీటన్నిటితో మెగా కుటుంబంలో సంతోషాలు నిండాయని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఉపాసన తరచుగా సామజిక కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కూడా చేస్తోంది. ఆమె ఇప్పుడు అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తోంది. అంతే కాకుండా ఎడిటర్గా ‘బి పాజిటివ్’ హెల్త్ మ్యాగజైన్కు వ్యవహరిస్తున్నారు. ఆమె చిన్నతనం నుండే బిజినెస్ మెలకువలను నేర్చుకుంటున్నారు. ఆమె ‘యు ఎక్స్చేంజ్’ సంస్థ స్థాపించి, పాత స్కూల్ బుక్స్ ను సేకరించి, వాటిని పేదవారి పిల్లలకు అందచేసేవారు. అలాగే మురికివాడల్లో అనారోగ్యంతో ఉన్న పిల్లలకు తమ అపోలో హెల్త్ సిటీలో ఉచితంగా చికిత్స చేయించేవారు.
Also Read:
ఆ నటి పేరు వడివుక్కరసి. ఆమె కోలీవుడ్ లో పాపులర్ యాక్టర్. ఆమె ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. తెలుగులో కూడా తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె తన వయసు కన్నా ఎక్కువ వయసు పాత్రలలో మెప్పించింది. వడివుక్కరసి సుమారు 350 పైగా సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది.
అయితే ఆమె తొలిసారి తెలుగు ఆడియెన్స్ కి కనిపించింది అరుణాచలం సినిమాతోనే. ఈ మూవీలో వడివుక్కరసి క్యారెక్టర్ కీలకమైనది. ఈ చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్ కి బాగా గుర్తుండిపోయాయి. ఈ మూవీలో బామ్మగా, వంగిన నడుముతో గూని ఉన్నట్టుగా కష్టపడుతూ కూడా షూటింగ్ అంతా సింగిల్ షాట్ లోనే చేసిందట.
ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్న వయసు అయినా కూడా ఆమె బామ్మ పాత్రలో మెప్పించింది. ఇక ఈ చిత్రంలో ఆమె యాక్టింగ్ చూసి, రజనీకాంత్ వడివుక్కరసి గట్టిగా హత్తుకున్నారట. అంతే కాకుండా నువ్వు ఎంతో ప్రతిభ ఉన్న నటివి అని ఎంకరేజ్ చేశారంట. ఈ విషయాన్ని వడివుక్కరసి ఎప్పటికీ మర్చిపోలేను అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆమె రజినీకాంత్ తో శివాజీ సినిమాలో ఆయనకు తల్లిగా నటించింది.
Also Read:
పాపులర్ జ్యువెలరీ డిజైనర్ అయిన నీతు లుల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని వసుంధర జ్యువెలర్స్ శాకుంతలం చిత్రం కోసం ప్రత్యేకంగా ఏడు నెలలు కష్టపడి ఈ బంగారు నగలను తయారు చేశారని వెల్లడించారు. శాకుంతలం చిత్రంలో హీరోయిన్ సమంత పదిహేను కిలోల బంగారు నగలను ధరించారని చెప్పారు. వాటిలో దాదాపు పద్నాలుగు రకాల నగలను సమంత వేసుకుందని దర్శకుడు గుణశేఖర్ తెలియచేశారు. దుష్యంతుడి క్యారెక్టర్ చేసిన నటుడు దేవ్ మోహన్ ధరించడానికి 8-10 కిలోల స్వర్ణాభరణాలను డిజైన్ చేయించామని తెలిపారు.
మేనక పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ మధుబాల దాదాపు 6 కోట్లు ఖరీదు చేసే వజ్రాలతో డిజైన్ చేసిన దుస్తులు ధరించారని వెల్లడించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా శాకుంతలం సినిమాలో శకుంతల మరియు దుష్యంతుడు ధరించిన బంగారు నగలను వసుంధర జ్యువెలర్స్ లో ప్రదర్శించారు. ఈ విధంగా శాకుంతలం చిత్రంలో 14 కోట్ల ఖరీదు చేసేటువంటి బంగారు మరియు వజ్రాభరణాలను ఉపయోగించారని డైరెక్టర్ గుణశేఖర్ వెల్లడించారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:





















అలా ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది అఖిల చిన్ననాటి ఫోటో. అందులో తల పై హ్యట్, చేతితో గన్ పట్టుకుని కౌబాయ్ గెటప్ లో ఉన్న చిన్నారి అఖిల్ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. అక్కినేని ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇదిగో మా ఫేవరెట్ హీరో చిన్ననాటి ఫోటో అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఫోటో 2002లో టక్కరి దొంగ సెట్ లో తీసిన ఫోటో.
మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ హీరోగా ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు చేసినా మంచి హిట్ అయితే రాలేదు. అఖిల్ ఇప్పుఉ ఏజెంట్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఈ సినిమాను ఈ ఏడాదిలైన్ విడుదల చేయాలని మూవీ యూనిట్ అనుకుంటున్నారు. ఈసారైనా అఖిల్ మంచి హిట్ రావాలని అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.
Also Read:
1. శర్వానంద్ శ్రీకారం:
2. జాను:
3. ఊపిరిలో కార్తి పాత్ర:
4. మహానటిలో నాగేశ్వరరావు పాత్ర:
5. తడాఖాలో నాగ చైతన్య పాత్ర:
6. సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్:
7. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల:
8. నితిన్ గుండెజారి గల్లంతయిందే:
9. ఆది సాయికుమార్ సుకుమారుడు:
10. సీతారామం:
Also Read:
ఒక థియేటర్ లో మాత్రం దాస్ క ధమ్కీ సినిమాకి బదులుగా ధమాకా సినిమాని వేశారు. దాస్ క ధమ్కీ చిత్రం చూడడానికి ధియేటర్ కి వెళ్తే అక్కడ మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ధమాకా’ మూవీని వేశారు. దాంతో ఆడియెన్స్ అందరు ఆశ్చర్యపోయారు. ధమ్కి బదులు వేరే మూవీ ప్రదర్శిస్తున్నారని ఆడియెన్స్ కి అర్థం అవడంతో థియేటర్ లో గోల చేశారు. దాంతో తప్పుని గ్రహించిన థియేటర్ యాజమాన్యం వెంటనే `ధమ్కీ` సినిమాని ప్రదర్శించారు.
ఈ వింత ఘటన వైజాగ్ సుకన్య ధియేటర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్లు, సటైర్స్ వేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి దాస్ క ధమ్కీ మూవీకి బదులు ‘ధమాకా’ మూవీ డౌన్ లోడ్ చేసి ఉంటాడు. 2 సినిమాల ట్రైలర్లు మరియు టైటిల్స్ కూడా ఒకేలా ఉండటంతో ధియేటర్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారేమో అని కామెంట్లు చేస్తున్నారు.
నెటిజెన్లు కామెడీ ఎమోజీలు కూడా పెడుతున్నారు. ఇంకొందరు రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో పాపం అని కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ నటించిన `ధమాకా` సినిమా గత సంవత్సరం విడుదలై, ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఈ ఇన్సిడెంట్ తో వైజాగ్ సుకన్య ధియేటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ చిత్రం కూడా వార్తల్లో నిలిచింది.
Also Read: