ఒకప్పుడు సినిమాల్లో నటించిన చాలా మంది ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు. వీళ్లలో చాలా మంది తెలుగు సినీ నటీనటులు కూడా ఉన్నారు. అందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఒక సమయంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్, ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు. చాలా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సినిమాల ద్వారా ఎంత మంది అభిమానులని అయితే సంపాదించుకున్నారో, ఇప్పుడు సీరియల్స్ ద్వారా కూడా అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సీనియర్స్ అయినా కూడా వీళ్ళకి ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అలా సీరియల్స్ లో, హీరోయిన్ పాత్రల్లో, లేదా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న కొంత మంది హీరోయిన్స్ చాలా ఎక్కువ పారితోషకం అందుకుంటున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 సుజిత
ఎన్నో సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యారు సుజిత. సుజిత గత కొన్ని సంవత్సరాల నుండి సీరియల్స్ చేస్తున్నారు. అయితే ఎపిసోడ్ కి 25 వేల పైన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సుజిత ప్రస్తుతం తెలుగులో జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న గీతాంజలి సీరియల్ లో నటిస్తున్నారు.

#2 కస్తూరి శంకర్
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన కస్తూరి శంకర్ రోజుకి 25 వేల పారితోషకం అందుకుంటున్నారు. ఒకవేళ వెబ్ సిరీస్, సినిమా షూటింగ్స్ అయితే 50 వేలకి పైగా పారితోషకం తీసుకుంటారు.

#3 రాశి
ఇటీవల వచ్చిన జానకి కలగనలేదు సీరియల్ లో హీరో తల్లి జ్ఞానాంబ పాత్రలో రాశి నటించారు. ఈ సీరియల్ కోసం రాశి రోజుకి 25 వేల పైన రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

సీరియల్స్ లో హీరోయిన్స్ కి కూడా సినిమా హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ అయినా కూడా, సీరియల్స్ లో వీళ్లలో చాలా మంది ఎక్కువగా హీరోయిన్ పాత్రలే పోషిస్తున్నారు. వీరి పాత్రల చుట్టూ సీరియల్ నడుస్తూ ఉంటుంది. వీరి పాత్రలకి సీరియల్ లో అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ లో వీళ్ళు కనిపించకపోయినా కూడా వీళ్ళ గురించి ప్రేక్షకులు దిగులు పడతారు. అందుకే వీళ్ళు కష్టపడి ప్రతి ఎపిసోడ్ లో కనిపించేలాగా పనిచేస్తూ ఉన్నారు. దానికి తగ్గ పారితోషకం కూడా అందుకుంటున్నారు.


వీళ్లిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారా అనే అనుమానం మొదలు అయ్యింది. కానీ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన ఫోటో అనే వార్తలు కూడా వస్తున్నాయి. నీరూ సెహగల్ పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా కూడా, చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళిపోయారు. అక్కడే మోడలింగ్ చేసి, 2015 లో మిస్ ఇండియా కాలిఫోర్నియా టైటిల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరం మిస్ ఇండియా అమెరికా పోటీల్లో కూడా పాల్గొని సెమీఫైనల్స్ వరకు వెళ్లారు. ఆర్జూ ఏ మన్ అనే ఒక సీరియల్ ద్వారా నీరూ సెహగల్ తన కెరీర్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా నీరూ సెహగల్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ ఫోటోని కూడా తనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

















