సినీ రంగంలో నెగ్గుకు రావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడవ్వాల్సిందే. ఎంత ప్రతిభ ఉన్న అదృష్టం కలిసి రాకపోతే ఒకటి, రెండు సినిమాలకే కనుమరుగైపోతారు. ముఖ్యంగా హీరోయిన్లు, డైరెక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా ప్లాప్ అయ్యింది అంటే మరో అవకాశం రావాలంటే చాల కాలమే పడుతుంది ఇండస్ట్రీ లో.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వరుస సినిమాలతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్నాడు. ఒక వైపు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ కూడా అక్కడ బ్రేక్ తీసుకొని ఏ దర్శకులను నిరాశపరచకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన కొందరు డైరెక్టర్లు హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..
#1 వేణు శ్రీరామ్
పవన్ కళ్యాణ్ గతంలో మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. రీమేక్ సినిమా అయినా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు వేణు శ్రీరామ్.

#2 సాగర్ కె చంద్ర
వకీల్ సాబ్ తర్వాత పవన్ కి వచ్చిన మరో హిట్ బీమ్లా నాయక్. దీనికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఈయన కూడా ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఏం ప్రకటించలేదు.

#3 కిషోర్ కుమార్
పవన్ కళ్యాణ్ తో కాటంరాయుడు సినిమా తీసిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు.

#4 యస్ జె సూర్య
పవన్ తో ఖుషి వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన డైరెక్టర్ యస్ జె సూర్య, తర్వాత కొమరం పులి తీసాడు. ఈ సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఇంకో సినిమా చెయ్యలేదు.

#5 ధరణి
పవన్ తో ఈ తమిళ దర్శకుడు బంగారం చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఇంకో తెలుగు సినిమా చెయ్యలేదు.

#6 జయంత్ సి. పరాంజీ
తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన జయంత్ సి. పరాంజీ.. పవన్తో తీన్మార్ చిత్రం చేసారు. ఆ తర్వాత మరో తెలుగు చిత్రం చెయ్యలేదు.







హీరో నాని హిట్ 2 సినిమాకు హిట్ టాక్ వచ్చిన సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడారు. నాని ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. హిట్ 2 జర్నీలో మూవీ యూనిట్ గురించి మాట్లాడుతూ ‘వాల్ పోస్టర్ సినిమా మొదలు పెట్టి, కొత్త ఐడియాలతో న్యూ టాలెంట్ను ప్రోత్సహించాలని అనుకున్నాను. రొటీన్ సినిమాలు చేయకూడదనే ఈ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ని ప్రారంభించాను. డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేస్తే ఎవరు చూడరు. అసలు ఇది వర్కవుట్ అవుతుందా? అని చాలా మంది నన్ను భయపెట్టారు.
అయితే తెలుగు ఆడియెన్స్ డిఫరెంట్ మూవీస్ చూస్తారనే ధైర్యం, నమ్మకం ఉంది. ఇప్పడది ఇంకోసారి హిట్ 2 తో రుజువైంది’ అన్నారు. హీరో నాని సమర్పకుడిగా, ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా మరి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ను మొదలు పెట్టారు. ఈ బ్యానర్లో తీసిన మొదటి సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మారారు. ఆ తరువాత శైలేష్ కొలనుని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ హిట్ యూనివర్స్ మొదలుపెట్టారు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్, రాజమౌళి సినిమా పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జక్కన్న మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవి నేపథ్యంలో సాగుతుందని టాక్. రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ మూవీ ఉంటుందని చెప్పారు.
తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయేంద్ర ప్రసాద్ గురించి చెప్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న నటుడు. మహేష్ నటించిన యాక్షన్ సన్నివేశాలు చూసినప్పుడు చాలా ఇంటెన్సిటి కనిపిస్తుంది అని అన్నారు . ఆయన ఇంటెన్స్ వల్ల ఏ రచయితకైనా తన పని ఈజీ అవుతుంది. చాలా మంది రచయితలు మహేష్ గురించి అదే చెప్తారు అని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సి.అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. విశాల్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించారు. యుద్ధంతో రాసిన ప్రేమకథగా, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటుగా సిని ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇటీవల ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి 9.6 టిఆర్పి వచ్చింది. ఈమధ్య కాలంలో విడుదలై, హిట్ అందుకున్న పలు మూవీస్ కంటే కూడా ఇది ఎక్కువ.
వెండితెర పై సూపర్ హిట్ అయిన సీతారామం ఇటు టెలివిజన్ ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇక్కడ కూడా సత్తా చూపించింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ 51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెట్టిన పెట్టుబడి తేవడమే కాకుండా 30 కోట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వసూళ్ల పరంగా రూ.80 కోట్ల క్లబ్లో చేరింది.
ఆ వీడియోలో బాబీ విదేశాల్లో చదువు కొనసాగించాడని బండ్ల గణేష్ చెప్పాడు. అల్లు బాబీ విద్యావంతుడని, తన తండ్రి అల్లు అరవింద్కు విధేయత చూపుతాడని,కానీ అల్లు అర్జున్ తన తండ్రి మాటని పట్టించుకోలేదని, అయితే నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ అన్నారు. అందుకే తండ్రి మాట విన్నవారు అల్లు బాబీలా, తండ్రి మాట వినని వారు, తమకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్లా అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. బాబీ గారు అవ్వాలా, బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండని బండ్ల గణేష్ అన్నారు.
వీరిని ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ మనసు చెప్పినట్టు వెళ్లాలని బండ్ల గణేష్ కోరారు. ఈ వీడియోతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మించాలని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.





మేకర్స్ కనుక ట్విస్ట్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే మూవీకి ప్లస్ గా మారేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సంజన అనే బాధితురాలిని దారుణంగా హత్య చేసిన కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి వచ్చిన ఎస్పీ రేంజ్ పోలీసు కృష్ణ దేవ్ (అడివి శేష్) చుట్టూ సినిమా తిరుగుతుంది. సంజనలాగే అనేక మంది మహిళలకు జరిగిందని అతను తరువాత తెలుసుకుంటాడు. కృష్ణ దేవ్ కిల్లర్ని ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా కథ.
హిట్: ది సెకండ్ కేస్ థియేట్రికల్ రిలీజ్ మొదటి రోజు, ఇండియా వైడ్ గా అన్ని కేంద్రాల నుండి దాదాపు రూ. 6 కోట్లు రాబట్టింది. థియేటర్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా డీసెంట్గా నమోదైంది మరియు రోజు చివరి నాటికి మెరుగుపడింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిచింది. సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేసిన హిట్ వర్స్ లో HIT 2 రెండవ సినిమా.