తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగులో వారసుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.
వారసుడు చిత్రానికి గాను దళపతి విజయ్ 109 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. నిజానికి విజయ్ సినిమాలకు కోలీవుడ్లో మంచి గిరాకీ ఉంటుంది. విజయ్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా కూడా కోలీవుడ్లో మంచి వసూళ్లు వస్తాయి. అందుకే విజయ్కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వస్తుంటారు. దీంతో విజయ్ రెమ్యూనరేషన్ పై చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో ప్రభాస్కే ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాకు దాదాపు రూ. 120 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మిగిలిన హీరోలు 70 కోట్ల వరకు తీసుకుంటున్నారు. విజయ్ తన గత సినిమా విజిల్ కోసం దాదాపుగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో టాక్ నడిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం విజయ్ రెమ్యూనరేషన్ వివరాలు అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న వారసుడు సినిమా టోటల్ బడ్జెట్ సుమారు 250 కోట్ల రూపాయలని తెలుస్తోంది. దీంట్లో సగం బడ్జెట్ హీరో రెమ్యూనరేషన్ కి వెళ్ళింది అని కోలీవుడ్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తెలుస్తోంది. దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాత గట్టెక్కినట్టేనని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్, రాజమౌళి సినిమా పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జక్కన్న మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవి నేపథ్యంలో సాగుతుందని టాక్. రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ మూవీ ఉంటుందని చెప్పారు.
తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయేంద్ర ప్రసాద్ గురించి చెప్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న నటుడు. మహేష్ నటించిన యాక్షన్ సన్నివేశాలు చూసినప్పుడు చాలా ఇంటెన్సిటి కనిపిస్తుంది అని అన్నారు . ఆయన ఇంటెన్స్ వల్ల ఏ రచయితకైనా తన పని ఈజీ అవుతుంది. చాలా మంది రచయితలు మహేష్ గురించి అదే చెప్తారు అని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని సి.అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. విశాల్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించారు. యుద్ధంతో రాసిన ప్రేమకథగా, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటుగా సిని ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇటీవల ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి 9.6 టిఆర్పి వచ్చింది. ఈమధ్య కాలంలో విడుదలై, హిట్ అందుకున్న పలు మూవీస్ కంటే కూడా ఇది ఎక్కువ.
వెండితెర పై సూపర్ హిట్ అయిన సీతారామం ఇటు టెలివిజన్ ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇక్కడ కూడా సత్తా చూపించింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ 51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెట్టిన పెట్టుబడి తేవడమే కాకుండా 30 కోట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వసూళ్ల పరంగా రూ.80 కోట్ల క్లబ్లో చేరింది.
ఆ వీడియోలో బాబీ విదేశాల్లో చదువు కొనసాగించాడని బండ్ల గణేష్ చెప్పాడు. అల్లు బాబీ విద్యావంతుడని, తన తండ్రి అల్లు అరవింద్కు విధేయత చూపుతాడని,కానీ అల్లు అర్జున్ తన తండ్రి మాటని పట్టించుకోలేదని, అయితే నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ అన్నారు. అందుకే తండ్రి మాట విన్నవారు అల్లు బాబీలా, తండ్రి మాట వినని వారు, తమకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్లా అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. బాబీ గారు అవ్వాలా, బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండని బండ్ల గణేష్ అన్నారు.
వీరిని ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ మనసు చెప్పినట్టు వెళ్లాలని బండ్ల గణేష్ కోరారు. ఈ వీడియోతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మించాలని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.





మేకర్స్ కనుక ట్విస్ట్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే మూవీకి ప్లస్ గా మారేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సంజన అనే బాధితురాలిని దారుణంగా హత్య చేసిన కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి వచ్చిన ఎస్పీ రేంజ్ పోలీసు కృష్ణ దేవ్ (అడివి శేష్) చుట్టూ సినిమా తిరుగుతుంది. సంజనలాగే అనేక మంది మహిళలకు జరిగిందని అతను తరువాత తెలుసుకుంటాడు. కృష్ణ దేవ్ కిల్లర్ని ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా కథ.
హిట్: ది సెకండ్ కేస్ థియేట్రికల్ రిలీజ్ మొదటి రోజు, ఇండియా వైడ్ గా అన్ని కేంద్రాల నుండి దాదాపు రూ. 6 కోట్లు రాబట్టింది. థియేటర్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా డీసెంట్గా నమోదైంది మరియు రోజు చివరి నాటికి మెరుగుపడింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిచింది. సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేసిన హిట్ వర్స్ లో HIT 2 రెండవ సినిమా.










కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.
