ఇండస్ట్రీ లో ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడం అనేది ప్రతి డైరెక్టర్ కి ఛాలెంజ్ లాంటిది. ఆ సినిమా వారి భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. దీంతో ఆ చిత్రాలను చాలా జాగ్రత్తగా తీస్తారు డైరెక్టర్స్. అలా మన టాలీవుడ్ లో కొందరు తెలుగు డైరెక్టర్స్ తమ ఫస్ట్ మూవీస్ తో సెన్సషనల్ హిట్స్ తీశారు. అలా తీసిన వారిలో కొందరు తమ రెండో సినిమాతో ఏకంగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసారు.
ఇప్పుడు అలా రెండో సినిమాకే సూపర్ కాంబినేషన్ సెట్ చేసిన డైరెక్టర్స్ ఎవరో చూద్దాం..
#1 కృష్ణవంశీ
డైరెక్టర్ కృష్ణ వంశీ తన మొదటి చిత్రం ‘గులాబీ’ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో రెండో చిత్రాన్ని కింగ్ నాగార్జున తో తీశారు. ఆ చిత్రమే ‘నిన్నే పెళ్లాడతా’.

#2 వి వి వినాయక్
తన ఫస్ట్ మూవీ ఆది తో సూపర్ హిట్ కొట్టిన వినాయక్, తన రెండో చిత్రాన్ని బాల కృష్ణతో తీశారు. అదే ‘చెన్నకేశవరెడ్డి’.

#3 కొరటాల శివ
ప్రభాస్ నటించిన మిర్చి తో హిట్ కొట్టిన కొరటాల శివ.. రెండో సినిమా మహేష్ బాబు తో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

#4 శ్రీకాంత్ అడ్డాల
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తీసిన కొత్త బంగారు లోకం చిత్రం సూపర్ హిట్ కావడంతో రెండో సినిమాతో ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టి మరో హిట్ కొట్టారు. అదే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

#5 క్రిష్
శర్వానంద్ తో గమ్యం సినిమా తీసిన క్రిష్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో వేదం చిత్రం తీశారు.

#6 పరశురామ్
నిఖిల్ తో యువత మూవీ తీసి హిట్ కొట్టిన పరశురామ్ కి సెకండ్ మూవీ మాస్ మహారాజ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆంజనేయులు మూవీ తో పరశురామ్ యావరేజ్ హిట్ ఇచ్చారు.

#7 వంశీ పైడిపల్లి
ప్రభాస్ తో ఫస్ట్ సినిమా మున్నా ని తీసిన వంశి.. రెండో సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసాడు.

#8 గౌతమ్ తిన్ననూరి
సుమంత్ తో మళ్ళీ రావా చిత్రాన్ని తీసిన డైరెక్టర్ గౌతమ్.. రెండో చిత్రం జెర్సీ తో నాని ని డైరెక్ట్ చేసాడు.

#9 సుజీత్
శర్వానంద్ తో రన్ రాజా రన్ చిత్రాన్ని తీసిన సుజీత్ రెండో చిత్రానికి ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేసాడు. ప్రభాస్ తో పాన్ ఇండియా చిత్రం సాహో ని తెరకెక్కించాడు సుజీత్.

#10 సందీప్ రెడ్డి వంగా
అర్జున్ రెడ్డి చిత్రం తో ఆ సినిమాకి పని చేసిన అందరూ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తర్వాత ఆ చిత్ర డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి ని హిందీ లో రీమేక్ చేసాడు. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

#11 బుచ్చిబాబు
ఉప్పెన సినిమా తో దర్శకుడిగా తన ప్రతిభ చూపాడు బుచ్చిబాబు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు రెండో చిత్రాన్ని రామ్ చరణ్ తో చేయనున్నాడు.


కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.


ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.
జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.
ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.























