Tollywood: గత కొద్ది రోజులుగా హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్.
అయితే మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇంతకుముందు వినిపించిన వార్తలన్నీ రూమర్స్ అని తెలిపోయాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం శరీరంలో వచ్చిన కొన్ని మార్పులే అని రక రకాలుగా రూమర్స్ వచ్చాయి. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చాల్ చేస్తోంది.
గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో పాల్గొన్న దర్శకుడు బోయపాటి చేసిన వాఖ్యలను బట్టి నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. బోయపాటి మాట్లాడిన సమయంలో బాలకృష్ణ కూడా పక్కనే ఉన్నారు. మోక్షజ్ఞని మీరే పరిచయం చేస్తారా అని ప్రశ్నించగా బోయపాటి అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా, అతన్ని సిని పరిశ్రమకి ఎలా, ఎప్పుడు పరిచయం చేయాలి అని వారి కుటుంబానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. మోక్షజ్ఞకి ఏ డైరెక్టర్ సెట్ అవుతాడు. అతని బాడీ లాంగ్వేజ్,ఇమేజ్ కి ఎలాంటి స్టోరీ అయితే సెట్ అతనే లాంచ్ చేస్తాడని బోయపాటి అన్నారు.
ఇంకా మాటాడుతూ నేనే పరిచయం చేస్తానని చెప్పలేను.ఆ సమయం వస్తే, ఎంట్రీ అలా జరిగిపోతుంది. మన చేస్తుల్లో ఏం లేదు, అంతా దైవేచ్చ. ఆ అప్పటిదాకా మనమంతా ఎదురుచూడాలి అని మోక్షజ్ఞ ఎంట్రీ గురిచి చెప్పారు. పక్కనే ఉన్న బాలయ్య చిన్నగా నవ్వాడు.కానీ ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం వీరసింహారెడ్డితో సంక్రాంతి పండుగాకి బరిలోకి దిగుతున్నారు.












తమిళంలో విజయం పొందిన క్లాసిక్ ‘ఓ మై కడువులే’ మూవీకి రీమేక్గా ఈ సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం. వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా నటించి మెప్పించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు.మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్గా నటించారు. దీనిని పెరల్ వి. పొట్లూరి మరియు పరమ్ వి. పొట్లూరి పివిపి సినిమా బ్యానర్పై నిర్మించారు. మరియు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.
ఓరి దేవుడా ఏరియా వైజ్ వసూళ్లు చూస్తే, నైజాంలో రూ.2.06 కోట్లు, రాయలసీమ రూ. 0.56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 0.78 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 0.21 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 0. 29 లక్షలు,కృష్ణ రూ. 0.47 లక్షలు, గుంటూరు రూ. 0.38 లక్షలు, నెల్లూరు రూ. 0.12 లక్షలు, ఏపీ, తెలంగాణ కలిపి రూ. 4.87 కోట్లు, UA: రూ 0.78 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా పైనల్ కలెక్షన్స్ రూ. 5.72 కోట్లు (రూ. 10.50 కోట్ల గ్రాస్).








ఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.