మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ధమాకా. శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. త్రినాథ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రవితేజ కెరియర్ లో వచ్చిన అన్ని మూవీస్ తో పోలిస్తే హై బడ్జెట్ మూవీ గా ధమాకా రూపుదిద్దుకుంటుంది.
ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించాయి. డిసెంబర్ 23 న ఈ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ ఇయర్ రిలీజ్ అయిన రవితేజ మూవీస్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ అనుకున్న ఫలితాలు రానప్పటికీ ధమాకా నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది.

తెలిసిన సమాచారం ప్రకారం…ధమాకా నాన్ థియేట్రికల్ బిజినెస్ విలువ రూ.30 కోట్లు. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10 కోట్లు మరియు డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు, ఆడియో రైట్స్ అన్నీ కలుపుకుని మరో రూ.20 కోట్లు బిజినెస్ జరిగింది. రవితేజ మాస్ యాక్షన్ కి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. రవితేజ మూవీ అంటేని మంచి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ మరియు మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీన్స్ తో మూవీ ఇరగదీస్తుంది.

త్రినాథ్ రావు నక్కిన మూవీ పై ఉన్న భరోసా కూడా ఈ మూవీ కి ప్లస్ పాయింట్ గా నిలిచింది. పైగ రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం లో వచ్చిన కార్తికేయ 2 బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కాబట్టి తిరిగి ఆ బ్యానర్ లో వస్తున్న ధమాకా మూవీపై కూడా అంచనాలు విపరీతంగా పెరిగాయి.దాంతో ఈ మూవీకి భారీ ఎత్తున బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.






తమిళంలో విజయం పొందిన క్లాసిక్ ‘ఓ మై కడువులే’ మూవీకి రీమేక్గా ఈ సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం. వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా నటించి మెప్పించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు.మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్గా నటించారు. దీనిని పెరల్ వి. పొట్లూరి మరియు పరమ్ వి. పొట్లూరి పివిపి సినిమా బ్యానర్పై నిర్మించారు. మరియు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.
ఓరి దేవుడా ఏరియా వైజ్ వసూళ్లు చూస్తే, నైజాంలో రూ.2.06 కోట్లు, రాయలసీమ రూ. 0.56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 0.78 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 0.21 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 0. 29 లక్షలు,కృష్ణ రూ. 0.47 లక్షలు, గుంటూరు రూ. 0.38 లక్షలు, నెల్లూరు రూ. 0.12 లక్షలు, ఏపీ, తెలంగాణ కలిపి రూ. 4.87 కోట్లు, UA: రూ 0.78 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా పైనల్ కలెక్షన్స్ రూ. 5.72 కోట్లు (రూ. 10.50 కోట్ల గ్రాస్).








ఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.






