ఆంధ్రప్రదేశ్ లో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన 2024 10వ తరగతి ఫలితాలు ఈరోజు (22 ఏప్రిల్) విడుదలయ్యాయి. 6.23 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవ్వగా…5,34,574 మంది అంటే 86.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 , బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 . 96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉంది. 62.47 శాతం ఉత్తీర్ణతతో కర్నూల్ జిల్లా చివరి స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో 2803 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డ్ సృష్టించాయి. 17 పాఠశాలల్లో మాత్రం ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వలేదు. ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ స్కూల్స్ ఉండడం ఆశ్చర్యకరం. ఈ ఫలితాల్లో 69.26 శాతం మంది ఫస్ట్ క్లాస్లో పాస్ కాగా, 11.87 శాతం సెకండ్ క్లాస్, 5.56 శాతం మంది థర్డ్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్ 23 నుండి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇది ఇలా ఉంటె…పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంకర్గా నిలిచింది. హిందీ సబ్జెక్ట్లో వందకు 99 మార్కులు వచ్చాయి. మిగిలిన అన్ని సబ్జెక్టు లలో వందకి వంద మార్కులు వచ్చాయి. స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్న మనస్వికి తెలుగుఅడ్డ తరపున కంగ్రాట్యులేషన్స్.





మే 2014న ఇండియాకి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఆయన గుజరాత్ లో 1950లో జననం సెప్టెంబర్ 17న వాద్నగర్లో జన్మించారు. అక్కడే ఆయన సెకండరీ విద్యను కంప్లీట్ చేశారు. 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. మోదీ పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వాద్నగర్ స్టేషన్ దగ్గరలో ఉన్న తండ్రి టీ దుకాణానికి వెళ్లేవారు. టీ అమ్మడంలో తండ్రికి సహాయం చేసేవారు.
తన కుంటుంబం చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారంగా మోడి 18 ఏళ్ల వయస్సులో, 17 ఏళ్ల వయసు ఉన్న జశోదాబెన్ మోడీని వాద్నగర్ కుల సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన వెంటనే ఆమెను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోదీ కుటుంబాన్ని కలిశారు. మోడి తల్లి ఒత్తిడితో, జశోదాబెన్ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మోడి ఇంటికి వచ్చింది. కానీ మోడి ఈ ఏర్పాటును వ్యతిరేకించాడు.
తన సిద్ధాంతాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. అంతే కాకుండా జశోదాబెన్ చదువు కోవాలని ప్రోత్సహించాడు. ఆ తరువాత ఆమెను ఎప్పుడు భార్యగా వెల్లడించలేదు. ఆ తర్వాత 1985లో బీజేపీతో కలిశారు. నాలుగు దశాబ్దాల తర్వాత చట్టబద్ధంగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించాల్సి రావడం, ఆయన పెళ్లి గురించి గుజరాత్ రాజకీయాలలో గుసగుసలు వినిపించడంతో జశోదాబెన్ ని భార్యగా బహిరంగంగా ఒప్పుకున్నారు. 2014 లో ఎన్నికల అఫిడవిట్లో వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో అందరికీ తెలిసింది. జశోదాబెన్ మోడి ఒక రిటైర్డ్ టీచర్.











