సాధారణంగా క్రికెట్ కి ఇంకా సినిమాలకి మధ్య ఏదో సంబంధం ఉంటుంది. ఈ రెండింటి ద్వారా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ పొందుతారు అనేది ఒక విషయం. అంతేకాకుండా క్రికెట్ రంగంలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీలను ఇష్టపడటం చాలా వరకు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇది చదవగానే మీలో చాలా మందికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గుర్తొచ్చే ఉంటారు. వీళ్లే కాకుండా యువరాజ్ సింగ్ – హజెల్ కీచ్, హర్భజన్ సింగ్ – గీతా బాస్రా, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – షర్మిల ఠాగూర్, జహీర్ ఖాన్ – సాగరిక ఘాట్గే కూడా క్రికెటర్ – యాక్టర్ పెయిర్ జాబితాలోకి వస్తారు. ఈ జాబితాలోకి ఇటీవల ఇంకొక జోడి కూడా చేరింది. వాళ్లే మనీష్ పాండే – ఆశ్రిత శెట్టి.


2010 లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్లు నిర్వహించిన క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ లో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి ఒక సంవత్సరం పాటు ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ అయ్యారు ఆశ్రిత శెట్టి. 2012 లో ఒక తుళు సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు.


అంతే కాకుండా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించారు ఆశ్రిత శెట్టి. 2013 లో సిద్ధార్థ్ హీరోగా నటించిన ఉదయం ఎన్ హెచ్ ఫోర్ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. ఈ సినిమా తెలుగులో ఎన్ హెచ్ ఫోర్ పేరుతో డబ్ అయ్యింది.

ashrita shetty in a commercial

ఉదయం ఎన్ హెచ్ ఫోర్ సినిమాలో ఆశ్రిత శెట్టి పర్ఫామెన్స్ ని ఎంతోమంది క్రిటిక్స్ అభినందించారు. తర్వాత 3 తమిళ సినిమాల్లో నటించారు ఆశ్రిత శెట్టి. అందులో రెండు విడుదలవ్వగా ఇంకొకటి షూటింగ్ దశలో ఉంది. 2019లో క్రికెటర్ మనీష్ పాండే ఇంకా ఆశ్రిత శెట్టి పెళ్లి చేసుకున్నారు.




















మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.
రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.
సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.
ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.
మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.
సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.




