హైదరాబాద్ కూకట్పల్లిలో ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన లులు మాల్ సెప్టెంబర్ 27న ఘనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మాల్ ఓపెన్ అవడమే ఆలస్యం నగర వాసులు మాల్ లో పోటెత్తారు.
ఈ క్రమంలో 3 రోజులు సెలవులు కావడంతో రద్దీ బాగా పెరిగింది. ఇక ఆదివారం (అక్టోబర్ 1)నాడు ఈ మాల్కు వేలాదిగా నగర వాసులు షాపింగ్ కోసం పోటెత్తారు. మాల్ లోపల మరియు బయట జనంతో కిక్కిరిసిపోయింది. అయితే ఈ క్రమంలో కొంత మంది చేసిన పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహానగరం హైదరాబాద్ లో దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కూకట్పల్లిలో లులు మాల్ నగరవాసులకు అతిపెద్ద షాపింగ్ స్పాట్గా నిలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఓపెనింగ్ రోజు ఈ మాల్ కి విపరీతమైన ప్రచారం లభించింది. నెట్టింట్లో కూడా ఈ మాల్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలనుకుంటారు. దీనికి తోడు 3 రోజుల సెలవుల రావడంతో పెద్ద సంఖ్యలో లులు మాల్ ను సందర్శిస్తున్నారు. ఈ మాల్ కు వచ్చే జనాల వల్ల కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం నాడు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా, ఆదివారం నాడు వీకెండ్ కావడంతో మాల్ కు జనం ఒక్కసారిగా వేల సంఖ్యలో పోటెత్తారు. మాల్ లోపల జనాలు నిండిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎక్కడ చూసినా జనాలే ఎస్కలేటర్లు, బిల్లింగ్ కౌంటర్లు ఇలా అన్నీ చోట్ల పూర్తిగా జనాలతో మాల్ నిండిపోయింది.
ఈ రద్దీలో కొంతమంది మాల్ లో అందినంతవరకు దోచుకున్నారు. ఆహార పదార్థాలను సీసీ కెమెరాల కళ్లుగప్పి మరీ దోచేశారు. మాల్లో ఉన్న ఆహార పదార్థాలన్నిటిని కస్టమర్లు తినేశారు. బిస్కెట్లు, సమోసాలు, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ఏది చేతికి దొరికితే దానిని తినేశారు. కొంతమంది సగం తినేసి సగం మాల్ లో నచ్చినట్టు విసిరి పడేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజెన్లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లో నగర వాసులు మన పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసారని కామెంట్లు చేస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/Cx7NvUgxiu3/?igshid=NTc4MTIwNjQ2YQ==
Also Read: ఆడి కారులో కూరగాయలు అమ్ముతున్న హైటెక్ రైతు…అతను ఎవరో తెలుసా.?





వినాయకచవితి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. గణేష్ నిమజ్జన సందర్భంగా జరిగే ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రతి ఏడాది మందు షాపులను క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా 3 రోజుల పాటు అంటే 26, 27, 28 మందు షాపులను మూసేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. అంటేకాకుండా మద్యం సేవించి నిమజ్జంలో పాల్గొనటాన్ని కూడా నిషేధించారు.
అయితే కొందరు మందు షాప్స్ మూసేస్తారని 3 రోజుల ముందుగానే మద్యాన్ని కొని, పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా గణేష్ నిమజ్జంలో భాగంగా జరిగే ఊరేగింపులో కొందరు మద్యం సేవించారు. అది కూడా పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే మద్యం సేవించారు. ఇలా చాలా చోట్ల కనిపించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ హుస్సేన్సాగర్లో జరిగిన నిమజ్జనంలో చైన్ స్నాచింగ్లు, పిక్ పాకెటింగ్, మొబైల్ ఫోన్ల దొంగతనాలు పెద్ద సంఖ్యలో జరిగాయి.
గురువారం నాడు ఒక్కరోజే ఆ పరిసరాలు 67 దొంగతనాల కేసులు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రజలందరు గణేష్ నిమజ్జనం చూస్తుంటే, జేబు దొంగలు తమ చేతివాటాన్నిప్రదర్శించారు. ఈ దొంగతనాల పై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ దృశ్యాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వినికిడి లోపం ఉన్న లాయర్ల కోసం సంకేత భాష ద్వారా ఒక కేసు యొక్క విచారణను అనువదించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. రీసెంట్ గా సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ సంచిత సీజేఐ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని బధిర లాయర్ సారా సన్నీ సైగల సహాయంతో వికలాంగుల హక్కులకు చెందిన కేసును వాదించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరింది. సీజేఐ అనుమతించారు. దాంతో ఇండియాలో మొట్టమొదట, వినికిడి లోపం ఉన్న న్యాయవాది సారా సన్నీ, సంకేత భాషల సహాయంతో సుప్రీంకోర్టులో కేసును సమర్పించారు.
కలలను సాకారం చేసుకోవడానికి శరీరంలోని లోపం అడ్డుకాదని, నిరూపిస్తూ సారా సన్నీ సుప్రీంకోర్టులో వాదించి, భారత దేశ చరిత్రలో, మొదటిసారిగా వినికిడి లోపం ఉన్న న్యాయవాదిగా నిలిచింది. సారా సన్నీ సుప్రీంకోర్టులో న్యాయ విచారణకు హాజరయ్యారు. సౌరభ్ రాయ్ సాయంతో కోర్టులో సైగలతో సారా సన్నీ మొదటిసారి వాదనలు వినిపించారు. కేరళలోని కొట్టాయం నుండి వచ్చిన సారా బెంగుళూరుకు చెందిన వినికిడి లోపం ఉన్న లాయర్.
ఆమె ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ మరియు హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్లో యాక్టివ్ మెంబర్. సన్నీకి మరియ అనే కవల సోదరి కూడా ఉంది. ఇద్దరూ అక్కడే జ్యోతినివాస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. మరియ తన తండ్రి కెరీర్ను ఎంచుకుని, చార్టర్డ్ అకౌంటెంట్ వైపు వెళ్ళగా, సారా లాయర్ అయ్యింది. కేసు వాదించిన అనంతరం సుప్రీంకోర్టులో వాదించడం తన కల అని, అది ఇంత త్వరగా నిజం అవుతుందని ఉహించలేదని కోర్టులో తెలిపింది.
ఏఎస్పీ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ భవ్యశ్రీ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 18న భవ్యశ్రీ తండ్రి తన కుమార్తె అదృశ్యం అయ్యిందని స్థానికంగా ఉన్న పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారన్నారు. దాంతో మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి, ఎంక్వైరీ మొదలుపెట్టామని అన్నారు. ఒక బావిలో సెప్టెంబర్ 20న ఒక యువతి మృతదేహం దొరికిందని, ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
భవ్య శ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తె పై అఘాయిత్యం చేసి, చంపేశారని ఆరోపించారని చెప్పారు. నలుగురి పై సందేహం ఉందని చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నామని అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిదండ్రుల ఎదుటే మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ చేశారని, మృతురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవని, అఘాయిత్యానికి ఏమైన పాల్పడి ఉంటారనే సందేహంతో మృతురాలి నుండి శాంపిల్స్ సేకరించి, తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపించామని తెలిపారు. ఎవరైన ఊహాగానాలు, అవాస్తవాలు వ్యాప్తి చేస్తే వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు.
ఎస్పీ రిషాంత్ రెడ్డి భవ్యశ్రీ మృతి పై ట్వీట్ చేశారు. అందులో “పెనుమూరులో కలకలం రేపిన 16 సంవత్సరాల అమ్మాయి అదృశ్యం, అనుమానాస్పద మృతి కేసులో సామాజిక మధ్యమలలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఆ అమ్మాయి పై ఎలాంటి అత్యాచారం లేదా శరీరం పై గాయాలేమి లేవు అని అన్నారు. గుండు కొట్టి అమ్మాయిని చంపారు అనేది నిజం కాదని, ఊడిపోయిన జుట్టు ఆమె మృతి చెందిన బావిలో లభ్యం అయ్యిందని అన్నారు. తల పై కూడా గుండు కొట్టినట్టుగా ఎలాంటి గుర్తులు లేవని” వెల్లడించారు.
రీసెంట్ గా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో 362 మార్కులను సాధించింది. వారిది ఎస్సీ కేటగిరి అవడంతో ఎంబీబీఎస్ సీటు తప్పకుండా వస్తుందని ఫ్యామిలీ అంత సంతోషాపడ్డారు. కానీ ఆరవ తరగతిలో కీర్తన చేరిన ఏడాదికి ఎటపాక నవోదయ విద్యాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయింది. దాంతో కీర్తన ఆంధ్రప్రదేశ్ కు లోకల్ గా, తెలంగాణకు నాన్ లోకల్ గా మారింది. దానివల్ల కేఎన్ఆర్ యూనివర్సిటీలో ఆమె ఎంబీబీఎస్ సీటు కోల్పోయింది.
కీర్తన తండ్రి సూర్య తమ పూర్వీకుల నుండి తెలంగాణలో ఉంటున్నామని అన్నారు. ధ్రువపత్రాలన్ని కలిగి ఉన్నామని తన కుమార్తెను నాన్ లోకల్ గా పరిగణించడం ఎంతవరకు కరెక్ట్ అని, తన కుమార్తె కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వారికి కూడా సీటు వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయం మీద హైకోర్టుకు వెళ్ళగా కీర్తనకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. యూనివర్సిటీలో కోర్టు ఆర్డర్ తో సంప్రదించగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తమకు ఆర్డర్స్ ఉన్నాయని, కీర్తనను నాన్ లోకల్ గా లెక్కిస్తామని చెప్పారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.
విద్యార్థుల పేరంట్స్ స్థానికత అనుగుణంగా ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలని కోర్టు చెప్పినప్పటికీ, ఆ యూనివర్సిటీ దానిని పరిగణలోకి తీసుకోలేదని, దానివల్ల విద్యార్థిని ఉన్నత చదువుకు దూరమయ్యే కండిషన్ ఏర్పడింది. ఈ విషయం పై తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలని కీర్తన పేరెంట్స్ కోరుతున్నారు.
స్వాతంత్ర్య సమరంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ సహచరులను లాహోర్ కుట్రకేసులో ఈ జైలుకు ఖైదీలుగా తరలించారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వివిధ ఉద్యమాలకు లీడర్ గా ఉన్నవారిని కూడా ఈ జైలులో ఖైదీలుగా ఉంచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వైశాల్యం పరంగా దేశంలో 4వ పెద్ద జైలు. ఇది 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 39.02 ఎకరాల్లో జైలు నిర్మించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా సెంట్రల్ జైలును నిర్మించారు.
ఈ జైలులో దాదాపు 3 వేల మంది ఖైదీలను ఉంచడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. 2015లో ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలుని ఆధునీకరించారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడుతో ములాఖత్కు వెళ్ళిన ఆయన సతీమణి భువనేశ్వరి బయటికి వచ్చిన తరువాత ‘‘ఆయన నిర్మించిన బ్లాకులోనే ఆయనను ఖైదీగా ఉంచారు’’ అని వాపోయారు.
ఇక ఈ జైలులో చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖైదీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ జైలులో కొంతకాలం ఉన్నారు. అయితే, ఆయన సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఈ జైలులో కొద్ది రోజులు ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఆదేశాలను ధిక్కరించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళారు. ప్రకాశం పంతులు కూడా సీఎం కాక ముందు జైలుకు వెళ్లారు.
అయితే పోస్టుమార్టంలో బాధితురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవనే విషయం ప్రాథమికంగా తెలిసినట్టు ఎస్ఐ అనిల్కుమార్ వెల్లడించారు. ఆమె పై అఘాయిత్యం కానీ, విషప్రయోగం కానీ, జరిగిందా అనేది పరీక్షించడానికి సాంపిల్స్ ను తీసుకున్నట్లు వెల్లడించారు. బావిలో మునిగి ఊపిరాడక మరణించిందా? లేదా వేరే ఎక్కడైనా చంపి, ఆమె మృతదేహాన్ని తెచ్చి బావిలో పడేశారా అనే విషయం నిర్ధారించడం కోసం స్టెరమ్బోన్ సాంపిల్స్ను సేకరించి కెమికల్ అనాలసిస్ చేయడం కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు.

