ఏ అమ్మాయి అయినా తన తల్లి కంటే తండ్రికి ఎక్కువ దగ్గరగా ఉంటుంది. ఎంత అల్లరి చేసినా.. గొడవ పడినా తండ్రి దగ్గరే అమ్మాయిలు చనువుగా ఉంటారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం తన తండ్రి వలన నరకం అనుభవిస్తున్నానని వాపోతోంది. మూడు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించినా.. ఎవరో ఒకరు కాపాడుతూనే వచ్చారని బాధపడుతోంది. ఈమె స్టోరీ తెలిస్తే కన్నీళ్లు పెడతారు.
వివరాల్లోకి వెళితే.. పదవ తరగతి పరీక్షలకు ముందు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం బుగ్గోనిగూడ కు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన సోమవారం చోటు చేసుకుంది.
మృతి చెందిన విద్యార్థిని సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు, లలిత దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మనీషా ప్రస్తుతం పదవ తరగతి చదువుకుంటోంది. ఆమె తల్లి లలిత ఏడాది క్రితమే మృతి చెందారు. అయితే.. భార్య లలిత చనిపోయేసరికి నరసింహులు మానసికంగా కృంగిపోయాడు. తాగుడుకు బానిస అయ్యాడు. ఆ మైకంలో కుమార్తె తోనూ, కుమారుడి తోనూ గొడవ పడుతుండేవాడు.
ఆదివారం ఉదయం కూడా ఇదే జరిగింది. ఆరోజు మధ్యాహ్నం అయ్యేసరికి మనీషా ఉరి వేసుకుంది. మధ్యాహ్నం కుమారుడు తండ్రి నరసింహులు ఫోన్ చేసి.. చెల్లి ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుంది అని చెప్పాడు. దీనితో ఆ తండ్రి వెంటనే ఇంటికి వచ్చి చూసేసరికి మనీషా మెడ భాగంలో కమిలిపోయి ఉంది. ఆమె అప్పటికే మరణించింది. పక్కనే ఓ పుస్తకంలో “ఐ హేట్ మై డాడ్” అని నాలుగు సార్లు రాసి ఉంది. గతంలో తల్లి గురించి రాసిన లేఖ కూడా బయట పడింది. అందులో ” నా తండ్రి ఓ మూర్ఖుడు.. తాగి వచ్చి నరకం చూపిస్తున్నాడు. మా అమ్మ ఉన్నప్పుడు బానే ఉండేవాడు. తరువాత తాగుడుకు బానిసై మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. నాన్నా అని పిలవడానికి మనసు రావట్లేదు.. మూడు సార్లు ఉరి వేసుకున్నా ఎవరో ఒకరు కాపాడారు.. ఇంకొన్ని రోజుల్లో నా చావు వార్త అందరికి తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ మై డెత్..” అని ఆ లేఖలో రాసి ఉంది.



ఢిల్లీ ఎన్ పి ఆర్ మార్కెట్ లో 15 రోజుల కిందట కిలో చికెన్ 180 రూపాయలు ఉంటే రిటైల్ ధర ప్రస్తుతం 260 చేరింది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకునే వారైతే కిలోకి 320 రూపాయల నుంచి 340 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గత 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ ధరలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారం దెబ్బతింది.
ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అందుకే 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ కొరత ఏర్పడిందని దీనిద్వారా ధరలు పెరిగాయని అంటున్నారు. గత రెండు వారాల ముందు ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలకు ధర అందుబాటులో ఉండేదన్నారు.
కానీ ప్రస్తుతం దీని ఖర్చు మార్కెట్ ధరలు 200 వరకు రావడంతో వ్యాపారస్తులు 250 నుంచి 2020 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రోజురోజుకు ధర పెరుగుతూ, ఢిల్లీలో కిలో చికెన్ ధర 245 రూపాయల నుండి 270 వరకు ఉన్నది. ఇక ఆన్లైన్లో మాత్రం ధర దాదాపు కిలోకి 350 పైనే ఉంది.మళ్లీ ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, చికెన్ ప్రియులకు శుభవార్త ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.


ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, సబ్సిడీ ఫ్రీగా కేంద్రం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడాపెడా ఎలక్ట్రికల్ వాహనాలు కొనేస్తున్నారు. రోజుకో మోడల్ చొప్పున వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్లను తీసుకొస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో సుమారుగా 5 నుంచి 6 కంపెనీలు వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి.
ఇక్కడే మొదలైంది అసలు బాధ. ఇప్పటివరకు ఈ వాహనాలు కొనుగోలు చేసిన వాటిలో చాలా వాహనాలు కాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రికల్ మోటార్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు రావడం, ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంలో మంటలు వ్యాపించడానికి ప్రధానకారణం బ్యాటరీ లో లోపాలు అని వారు నివేదికలో తెలియజేశారు. ఆ లోపం వల్లనే ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.











