సోషల్ మీడియాను సరైన పద్ధతులు వాడుకుంటే ఎన్నో మంచి పనులు జరుగుతాయి అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. స్కూల్ బ్యాగ్ ధరించి ఒంటికాలితో నడుస్తూ బీహార్ కు చెందిన బాలిక వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీహార్ లో జముయ్ జిల్లాలోని ఒక పల్లెటూరికి చెందిన సీమా అనే బాలిక రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు తన కాలును పోగొట్టుకుంది. ఐదో తరగతి చదువుతున్న సీమా ప్రతి రోజు ఒంటి కాలుతోనే ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా స్కూల్ కు వెళుతూ వస్తుంది.

చదువుకోవడం కోసం ఇంత కష్టపడుతున్న సీమా వీడియో చూసిన సోనూ సూద్ పాటు చాలామంది ప్రముఖులు మనసు కలచివేసింది. ఆ బాలికకు కృత్రిమ కాలు అమర్చేందుకు సహాయం చేస్తామంటూ ముందుకొచ్చారు.
ఎవరి అవసరం లేకుండానే బీహార్ విద్యాశాఖ చిన్నారికి కృత్రిమ కాలు అమర్చేందుకు ముందుకొచ్చింది. బీహార్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్, బగల్ శాఖ ఆధ్వర్యంలో సీమా కాలు కొలతలు తీసుకుని రెండు రోజుల తర్వాత కృత్రిమ కాలును తీసుకువచ్చి అమర్చింది. ప్రస్తుతం సీమా తన రెండు కాళ్ళతో నడవ కలుగుతుంది.

జముయ్ జిల్లా అధికారులు సీమాకు ఒక వీల్ చైర్ మరియు ట్రై సైకిల్ సహకారంగా అందించారు. సీమా ఘటనతో బీహార్ విద్యాశాఖ కదిలివచ్చింది. బీహార్ రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు లోపు వైకల్యంతో ఇబ్బందిపడుతూ ఉన్నా పిల్లలపై సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది. సీమాకు కాలు అమర్చడంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంత సోషల్ మీడియా పుణ్యమే అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.














ఢిల్లీ ఎన్ పి ఆర్ మార్కెట్ లో 15 రోజుల కిందట కిలో చికెన్ 180 రూపాయలు ఉంటే రిటైల్ ధర ప్రస్తుతం 260 చేరింది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకునే వారైతే కిలోకి 320 రూపాయల నుంచి 340 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గత 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ ధరలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారం దెబ్బతింది.
ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అందుకే 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ కొరత ఏర్పడిందని దీనిద్వారా ధరలు పెరిగాయని అంటున్నారు. గత రెండు వారాల ముందు ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలకు ధర అందుబాటులో ఉండేదన్నారు.
కానీ ప్రస్తుతం దీని ఖర్చు మార్కెట్ ధరలు 200 వరకు రావడంతో వ్యాపారస్తులు 250 నుంచి 2020 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రోజురోజుకు ధర పెరుగుతూ, ఢిల్లీలో కిలో చికెన్ ధర 245 రూపాయల నుండి 270 వరకు ఉన్నది. ఇక ఆన్లైన్లో మాత్రం ధర దాదాపు కిలోకి 350 పైనే ఉంది.మళ్లీ ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, చికెన్ ప్రియులకు శుభవార్త ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.


ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, సబ్సిడీ ఫ్రీగా కేంద్రం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడాపెడా ఎలక్ట్రికల్ వాహనాలు కొనేస్తున్నారు. రోజుకో మోడల్ చొప్పున వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్లను తీసుకొస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో సుమారుగా 5 నుంచి 6 కంపెనీలు వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి.
ఇక్కడే మొదలైంది అసలు బాధ. ఇప్పటివరకు ఈ వాహనాలు కొనుగోలు చేసిన వాటిలో చాలా వాహనాలు కాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రికల్ మోటార్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు రావడం, ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంలో మంటలు వ్యాపించడానికి ప్రధానకారణం బ్యాటరీ లో లోపాలు అని వారు నివేదికలో తెలియజేశారు. ఆ లోపం వల్లనే ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.