సోషల్ మీడియా పుణ్యమా అంటు చరిత్రలో దాగి ఉన్న ఫోటోలు ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఫోటోలు చూసినప్పుడు దాని వెనకాల ఉన్న విషయం తెలుసుకోవాలని ఆసక్తి కూడా కలుగుతూ ఉంటుంది.1972వ సంవత్సరంలో భారత దేశ చరిత్రను మార్చేసిన ముగ్గురు వ్యక్తులు కలిసి విందు చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరో కాదు. పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్.
ఆ సమయంలో ఒక ప్రత్యేక సందర్భంగా పీవీ నరసింహారావు మద్రాసు వెళ్లారు. అక్కడ ఆయనను ఎన్టీ రామారావు తన ఇంటికి ఆహ్వానించారు. అదే సమయంలో ఎంజి రామచంద్రాన్ కి కూడా ఎన్టీ రామారావు ఆహ్వానం పలికారు. ఇద్దరూ మంచి మిత్రులు కూడా.

సాంప్రదాయం, సంస్కృతి పట్ల గౌరవం ఉన్న ముగ్గురు కలిసి కుర్చీలు, డైనింగ్ టేబుల్ ఉన్న కూడా చాపపై కూర్చుని తమ చేతులతో తినడానికే ఇష్టపడేవారు. రాజకీయాలు, సినిమాల నుంచి సామాజిక సమస్యలు, వ్యక్తిగత విషయాల వరకు వివిధ అంశాల గురించి వారు సంభాషణలు చేసినట్లు కూడా సమాచారం ఉంది.వారు తమ అభిప్రాయాలను పంచుకుని ఒకరి అనుభవాల నుంచి ఒకరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఒకరు సాధించిన విజయాలను సమాజానికి చేసిన కృషిని గౌరవిస్తూ వారు తమ అభిమానాన్ని ప్రశంసలు కూడా వ్యక్తం చేసేవారు.

ప్రధానిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిపి ఒకచోట చేర్చిన ఈ విందు అరుదైన మరుపురాని సంఘటన. పీవీ నరసింహారావు 1991లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచారు. ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకి గుర్తింపును అందించిన ఘనత ఎన్టీఆర్ ది.

ఎంజీ రామచంద్రన్ 1972లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజకంలో చేరారు. 1977లో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రజాకర్షణ గల నాయకుడిగా, బహుజన శ్రేయోభిలాషిగా గౌరవించబడ్డారు. సాధారణంగా సోషల్ మీడియాలో అర్థన విలువైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని ఫోటోలు మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్తాయి. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి మనుషులు ఎలా ఉండేవారు అని అవగాహన కల్పిస్తాయి.అలాంటి అరుదైన ఫోటోల్లో ఈ ఫోటో కూడా స్థానం సంపాదించుకుంటుంది.
Also Read:1971 నాటి కిరాణా షాప్ బిల్…అప్పటి సరుకుల ధరలు ఎంత ఉన్నాయో చూడండి.!

సాధారణంగా స్కూటర్, కారు, బస్సు, ట్రక్కువంటి వాహనాలకు మైలేజీ ఉండడం వల్ల 1 లీటర్ డీజిల్, పెట్రోల్ కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాయో తెలిస్తుంది. మరి రైలు మైలేజీ గురించి ఎప్పుడైనా అని ఆలోచించారా? ఇతర వాహనాల లాగానే రైళ్ల మైలేజీ చాలా విషయాల పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా రైళ్లకి ప్రమాణాలు కూడా ఉన్నాయి. అయితే రైలు మైలేజీని ఇతర వాహనాల మైలేజీ వలె నేరుగా చెప్పడం కష్టమైన విషయం.ఎందువల్ల అంటే ట్రైన్ మైలేజ్ అనేది అది ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైలు మరియు రైలు కోచ్ల నంబర్ పైన ఆధారపడి ఉంటుంది.
రైలు మైలేజీకి చెందిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రైన్ లోని కోచ్లు సంఖ్య. తక్కువ కంపార్ట్మెంట్ల ఉన్నట్లయితే రైలు ఇంజిన్పై ఎక్కువగా లోడ్ పడదు. ఇటువంటి సందర్భంలో రైలు ఇంజిన్ శక్తి పెరుగుతుంది. ఇక డీజిల్ రైలు ఇంజిన్ మైలేజీని గంటల ప్రాతిపదికన లెక్కిస్తారు. 24 నుండి 25 కోచ్లు ఉన్న ట్రైన్స్ లో ఒక కిలోమీటరుకు డీజిల్ సుమారు 6 లీటర్ల పడుతుందని కొన్ని నివేదికలలో తెలుపబడింది. అయితే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ తో పోల్చినట్లయితే ప్యాసింజర్ రైళ్లకే డీజిల్ ఎక్కువగా ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
ప్యాసింజర్ ట్రైన్ లో ఒక కిలోమీటరు దూరం వెళ్లేందుకు ఐదు నుండి ఆరు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఇలా అవడానికి కారణం ప్యాసింజర్ రైలు ఎక్కువ స్టేషన్లలో ఆగడమే. అయితే 12 కోచ్ లు కలిగిన ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంజిన్కు 1 కిలోమీటరు ప్రయణించడానికి సుమారు 4.5 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఒక ట్రైన్ యొక్క మైలేజ్ దాని ఇంజిన్ శక్తి పై ఆధారపడి ఉంటుంది. దీనిలో తరచుగా ఎత్తు ఎక్కడం,బ్రేకింగ్, లోడ్ లాగడం వంటివి కూడా ఉంటాయని సమాచారం.
Also Read: 


భక్తి టీవీలో ప్రసారం అవుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమంలో తల్లితండ్రులు పెట్టిన శాపనార్ధాల ఫలిస్తాయా అని ఒకరు అడిగిన సందేహానికి డాక్టర్ శ్రీ మైలవరపు శ్రీనివాసరావుగారు ఇలా సమాధానం చెప్పుకొచ్చారు. “జ్ఞానంతో తిట్టినా, అజ్ఞానంతో తిట్టినప్పటికి ఆ వాక్కు ఫలిస్తుంది. అందువల్లనే పాతకాలంలో అమ్మమ్మలు, బామ్మలు వంటివారి నోటి నుండి ఒక్కమాట కూడా అపశబ్ధం వచ్చేది కాదు.
కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఏం చేస్తున్నామో తెలియదు. ఎవరిని తిడుతున్నామో కూడా తెలియదు. ఎవరిని శపించే స్థాయికి వాక్కు వెళ్తుందో మనసుకు, బుద్ధికి తెలియదు. సాధారణంగా తల్లి దండ్రులు పిల్లల ప్రవర్తన పై కోపం వచ్చినపుడు తిడుతూ, శాపనార్ధాలు పెడుతుంటారు. అయితే ఏ తల్లి దండ్రులు కూడా తమ పిలల్లని మనస్పూర్తిగా దూషించరు, శపించరు. కోపంలో పిల్లలను, తిట్టడం, శపించడం అనేది జరుగుతుంటుంది. అవి మనస్పూర్తిగా వచ్చినవి కానప్పటికీ, ఆ తిట్లు, శాపనార్ధాలు ఫలిస్తాయని చెప్పుకొచ్చారు.
వాస్తవంగా పిల్లలు తప్పు చేసినపుడు ఎప్పుడు కూడా మందలించాలి. కోపంతో కళ్ళతో మందలించాలి. అవసరం అయితే చిన్నపాటి దెబ్బ వేసి మందలించాలి. అది తప్పు కాదు కానీ, నోటితో మాత్రం పిల్లలను ఏమి అనకూడదు. ఎంత కోపం వున్నప్పటికీ, నోటితో మాత్రం తిట్టడం, శపించడం లాంటివి చేయకూడదు. వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితం అయ్యి బయటికి వస్తుంది. కాబట్టి ఫలించే అవకాశం ఉంటుంది”. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి..












