బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా జవాన్. ఈ సినిమాకి అట్లీ దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ టాక్ సంపాదించుకుంది.
సినిమా కథ చాలా మందికి తెలిసిన కథ అయినా కూడా బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు రావడం చాలా తక్కువ కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. అందులోనూ షారుఖ్ ఖాన్ ని ఇలాంటి మాస్ రోల్ లో చూడడం ఎప్పుడో ఒకసారి తప్ప అవ్వదు కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మరొక వైపు ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళ్ కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగిన ఒక ప్రేక్షకుడిని ఈ సినిమా చూడడానికి కూర్చోబెడితే మొదటి రెండు సీన్స్ చూడంగానే సినిమా మొత్తం చెప్పగలుగుతాడు. అంత రొటీన్ కథ ఉంది. ఈ సినిమాలో చాలా మంది సౌత్ కి సంబంధించిన నటులు, టెక్నీషియన్స్ ఉన్నారు. చాలా మంది తమిళ్ వాళ్లే ఉన్నారు. అయితే తెలుగుకి సంబంధించిన ఒక నటి కూడా ఈ సినిమాలో నటించారు.

ఆమె ప్రేక్షకులందరికీ టెలివిజన్ ద్వారా చాలా పరిచయం అయిన యాక్టర్. అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగులో కూడా పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్లారు. ఆమె ఎవరో కాదు సిరి. సిరి ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ పక్కన కానిస్టేబుల్ పాత్రలో నటించారు. కొడుకు షారుఖ్ ఖాన్ పోషించిన ఆజాద్ రాథోడ్ పాత్ర కనిపించినప్పుడు సిరి కూడా కనిపిస్తారు. సిరి అంతకుముందు చాలా టెలివిజన్ షోస్ లో కనిపించారు. బిగ్ బాస్ ప్రోగ్రాం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఆ తర్వాత పులి మేక అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా చేశారు. ఇప్పుడు జవాన్ సినిమాలో ఒక పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి సిరి మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ పక్కన నటించడం తనకి చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలని కూడా షేర్ చేశారు. సిరి టెలివిజన్ లో కూడా ఇప్పుడు పండగలకి, లేదా ఏమైనా ప్రత్యేక వేడుకలకి వచ్చే ఎన్నో స్పెషల్ షోస్ కి హోస్ట్ గా చేస్తున్నారు.
ALSO READ : “అనుష్క శెట్టి” లాగానే… తమకంటే “తక్కువ వయసు” ఉన్న హీరోలతో నటించిన 15 హీరోయిన్స్..!

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తొలిరోజు హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించిన మూవీ జవాన్. ఈ చిత్రంలో విజయయ సేతుపతి, దీపికా పదుకొనే, అతిథి పాత్రలో సంజయ్ దత్ నటించారు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించిన జవాన్ తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.
షారుక్ ఖాన్ మొదటిసారి సౌత్ దర్శకుడి సినిమాలో హీరోగా నటిస్తుండడం, అది కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ వంటి దర్శకుడితో కావడంతో ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే జవాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ చిత్రాలు ఎలా ఉంటాయో దక్షణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ రొటీన్ అయినా కొంచెం కొత్తగా, మాస్ పల్స్ తో స్టైలిష్గా చూపిస్తుంటాడు. ఈ విషయంలో అట్లీ ఆరితేరిపోయాడని ఆయన తీసిన సినిమాలే చెప్తాయి.
అలా అట్లీ తన స్టైల్లో, అలవాటైన ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో షారుఖ్ ఖాన్ను సరికొత్తగా చూపించాడు. అదే నార్త్ ప్రేక్షకులకు చాలా నచ్చింది. బాలీవుడ్లో ఈ మూవీకి 3, 4, నాలుగున్నర రేటింగ్స్ వచ్చాయి. అయితే తెలుగులో యావరేజ్, తమిళంలో నార్మల్ టాక్ రాగా, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
















ఉదయనిధి స్టాలిన్మాట్లాడుతూ సనాతన ధర్మం బడుగు, బలహీన వర్గాలు మరియు దళితులను అణగదొక్కి, బ్రాహ్మణిజాన్ని పోషిస్తోందని అన్నారు. సనాతన ధర్మం పేరుతో కొందరు దళితులకు ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. రాజకీయంగా పలువురు నేతలు ఉదయనిధి చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నారు.
తాజాగా ఉదయనిధి వాఖ్యల పై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరని అన్నారు. ఉదయనిధి లాంటివారిని ఇప్పటికే చాలామందిని ఈ దేశం చూసిందని అని అన్నారు. మన దేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేశారని, కానీ వారంతా కూడా కాలగర్భంలో కలిశారని చెప్పారు. హిందూ దేవలయాలపై ఎన్నో దాడులు చేశారని, అయినా హిందూ ధర్మం నిలిచే ఉందని అన్నారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని, ముందు ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ భావజాలం అంటే అర్ధం తెలుసుకోవాలని రంగరాజన్ చెప్పారు. సనాతన ధర్మం నిర్మూలించాలని చెపుతున్న ఉదయనిధి స్టాలిన్ తమిళ సంస్కృతి కోసం, అభివృద్ధి, పరిరక్షించడం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు సనాతన ధర్మాన్ని గౌరవించే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవాలని రంగరాజన్ కోరారు.










#2
#3
#4
#5
#6
#7
#8
#9