దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోళ్లలో పాత రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఫ్రాంచైజీలు తాము కావాలనుకున్న ప్లేయర్ ను దక్కించుకోవడం కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి.
ఈ వేలంలో ఆసీస్ పేసర్ స్టార్క్ ఆల్టైమ్ ధర పొందిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. మరో ఆసీస్ ప్లేయర్ కమిన్స్ రూ. 20.50 కోట్లుకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అయితే అంతగా తెలియని, కొందరు అన్క్యాప్డ్ ఆటగాళ్లు సైతం కోట్లు కొల్లగొట్టారు. వారిలో శుభమ్ దూబే ఒకరు. అతని గురించి ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ వేలం ఎప్పడూ సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతి వేలంలోనూ గత రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది. అలాగే ఈసారి కూడా గత వేలం రికార్డులను బద్దలు కొట్టింది. గత వేలం అత్యధిక ధర రికార్డును ఈసారి ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు బ్రేక్ చేశారు. కోల్కతా రూ. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ను సొంతం చేసుకోగా, సన్రైజర్స్ రూ. 20.50 కోట్లకు కమిన్స్ను సొంతం చేసుకుంది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ను ఫ్రాంఛైజీలు కోట్లు పోసి సొంతం చేసుకున్నాయి.
వారిలో ఒకరు శుభమ్ దూబే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శుభమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో రాత్రికి రాత్రే దూబే కోటీశ్వరుడిగా మారాడు. దూబే విదర్భ జట్టు తరుపున ఆడతాడు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన దూబే పవర్ఫుల్ లెఫ్టాండర్ మరియు మంచి ఫినిషర్. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ టోర్నీలో అద్భుతంగా ఆడిన శుభమ్ దూబే పేరు మారుమ్రోగింది. దాంతో ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు దూబే కోసం పోటీ పడ్డాయి. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ రూ. 5.80 కోట్లకు దక్కించుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫామెన్స్ జుబిన్ భరూచా శుభమ్ దూబే గురించి మాట్లాడుతూ, విదర్భ నుంచి వచ్చిన దూబే లైఫ్ లో ఉన్న కష్టాలు, క్రికెటర్ యశస్వి జైశ్వాల్కు వంటివే అని అన్నారు. శుభమ్ దూబే వద్ద ఈ ఏడాది కనీసం బ్యాట్ కొనడానికి కూడా డబ్బు లేదని చెప్పినట్లుగా వెల్లడించాడు. వేలంలో అతడిని కొనడానికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. భరూచా, చెప్పినట్లుగానే రాజస్థాన్ రాయల్స్ దూబేను కొనుగోలు చేసింది.
Also Read: డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ తో SRH టీం ప్రవర్తించే విధానం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?




ఎంబీఏ చదివినా, అందుకు తగ్గ జాబ్ రాలేదని బాధపడకుండా మానస అనే మహిళ తనకు లభించిన ఉపాధితో పారిశుద్ధ్య కార్మికురాలిగా వర్క్ చేస్తోంది. హన్మకొండ జిల్లా, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మానస, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటపుడు బంధువు అయిన దిలీప్ కుమార్ ను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త కూడా ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేశారు. 2016లో ఆమె ఎంబీఏను పూర్తి చేశారు. మంచి ఉద్యోగం సాధించి, మంచి జీవితాన్ని పొందాలనుకున్న మానస లైఫ్ లో కొన్ని పరిణామాలు జరిగాయి.
దాంతో ఆమె వెంకటాపూర్ పంచాయితీ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా, ఎనిమిది వేల రూపాయల జీతానికి పని చేస్తున్నారు. ఆమె భర్త దిలీప్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలా ఎంబిఎ చేసిన ఆ భార్యభర్తలు ఇద్దరు పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. మానస తండ్రి చనిపవడంతో, తల్లిని ఒంటరిగా వదిలేయలేక, ఆర్థిక పరిస్థితుల వల్ల సొంత గ్రామాన్ని వదల్లేక, ఇక్కడే ఉండిపోయామని మానస వెల్లడించారు. అక్కడే దొరికిన ఉపాధితో సంతోషంగా ఉన్నామని తెలిపారు.
ఇటీవల వచ్చిన పోలీస్ నోటిఫికేషన్ కు కూడా మానస దరఖాస్తు చేసింది. చాలా కష్టపడి పరీక్షలు రాసినప్పటికీ, ఆమె పోలీస్ సెలెక్షన్లలో సెలెక్ట్ కాలేదు. ఒక్క మార్కు తేడాతో ఉద్యోగాన్ని పొందలేకపోయానని మానస తెలిపారు. మానస తమ చదువుకు తగిన ఉద్యోగావకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వార్తను చూసిన నెటిజెన్లు ఎంబీఏ చదివి కూడా పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న మానస పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






