సుంగధ ద్రవ్యాలలో యాలకులు ప్రత్యేకమైనవి. వీటి ఖరీదు కూడా ఎక్కువే. యాలకుల కేజీ ఖరీదు వాటి నాణ్యత ప్రకారంగా వెయ్యి నుండి 6 వేలకు వరకు ఉంటుంది. యాలకులను కొన్ని ప్రాంతాల్లో ఏలకులు అని కూడా పలుకుతారు. మన దేశంలో ప్రాచీనమైన కాలం నుంచి యాలకులను ఉపయోగిస్తున్నారు.
యాలకులలో ఎన్నో పోషకాలను ఉన్నాయి. అందువల్లనే యాలకులను పోషకాల భాండాగారం అని పిలుస్తారు. పచ్చి యాలకులను తినడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. యాలకులను వంటకాలలో వాడితే అవి మంచి వాసనతో గుమగుమలాడుతాయి. ఫైబర్ కంటెంట్ యాలకుల గింజలలో అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి యాలకులు తినడం వల్ల పోషకాల యొక్క లోపం తొలగిపోతుంది.
యాలకులలో ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్, కాల్షియం లాంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సాధారణంగా వచ్చే సమస్యలలో ఊబకాయం కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా తినాలని, అదే సమయంలో అందంగా కనిపించాలని అనుకుంటారు. అయితే రోజువారీ లైఫ్ స్టైల్ ను మార్చుకోవడానికి అంతగా ఇష్టపడరు.
ఇక ఆఫీసులలో కూర్చుని వర్క్ చేసేవారికి, ముఖ్యంగా కడుపులో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం గంటలు గంటలు కూర్చుని వర్క్ చేయడమే. శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటే సమస్యలు తీవ్రమవుతాయి. అందువల్ల రోజు రాత్రిపూట నిదురించే ముందు రెండు యాలకులను వేడి నీటితో తీసుకోవడం వల్ల పొట్టలోని కొవ్వు కరుగుతుంది.
యాంటీ బాక్టీరియా లక్షణాలు పచ్చి యాలకులలో మెండుగా ఉన్నాయి. అందువల్ల పచ్చి యాలకులను రోజూ తినడం వల్ల బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. అంతే కాకుండా యాలకులలో ఉండే పొటాషియం, ఫైబర్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే రోజూ యాలకులు తినడం వల్ల మూత్రనాళ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వారికి ప్రయోజనకరంగా ఉంటుందట. పచ్చి యాలకులను ప్రతిరోజూ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదంట.. అవి ఏమిటంటే..

ఈ మూవీ తరువాత ‘టైగర్ నాగేశ్వరావు’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ మరో మల్టిస్టారర్ చిత్రంలో నటిస్తున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల సినిమాల హవా పెరుగుతొందని చెప్పవచ్చు. రవితేజ, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రవితేజ మరో మల్టిస్టారర్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ నటించినప్పటికి ఆ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాగానే పేరు వచ్చింది అందువల్ల ఈసారి చేయబోయే మల్టిస్టారర్ చిత్రంలో యంగ్ హీరోతో కలిసి నటించడానికి రవితేజ ఒకే చేసినట్టు సమాచారం. ఇక ఆ యంగ్ హీరో ఎవరో కాదు శర్వానంద్. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయేది ఒక యంగ్ టాలెంటెడ్ దర్శకుడు. ఆయన రవితేజ, శర్వానంద్ లకు కథ చెప్పాడంతో ఇద్దరికి ఆ కథ నచ్చిందంట. స్టోరీ ఐడియా కొత్తగా ఉండటంతో ఇద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది.
Also Read:
ఆర్థరైటిస్ బాధితులు:
ఎముకలు బలహీనంగా ఉన్నవారు:
పైల్స్ ఉన్నవారు:
కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు:
అతిగా వంకాయ తినడం:
సర్జరీ అయినవారు:
Also Read:
ఇక ఇప్పుడు మెగాడాటర్ నిహారిక కొణిదెల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ వార్తలు రావడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతలో ఉన్న ఆమె భర్త చైతన్యకు ఉన్న ఫోటోలు తొలగించింది. ఒక ఫోటోను, వీడియోను తొలగించకుండా ఉంచింది. ఇక చైతన్య కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లోని వారి వివాహ ఫోటోలు అన్నింటిని తొలగించాడు. అంతే కాకుండా ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ ఒకరి సోషల్ మీడియా ఖాతాలను ఇంకొకరు అన్ఫాలో కూడా చేశారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే నీహారిక ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఉండడంతో విడాకుల ప్రచారాలు ఎక్కువ అయ్యాయి. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు డైవర్స్ తీసుకోవడానికి ముందు సోషల్ మీడియాల్లో తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడం ద్వారా చెప్పకనే చెప్తున్నారు.
దానివల్ల కూడా నీహారిక-చైతన్య విడాకులు తీసుకోబోతున్నారేమో అని మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా విడాకుల ప్రచారం అనంతరం నిహారిక తొలిసారి తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. నిహారిక ఈ ఫోటోలలో లంగా వోణీలో సంప్రదాయ లుక్ లో మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read:
ఆడియెన్స్ కి మూవీ నచ్చడంతో ఆస్కార్ కోసం క్యాంపెయిన్ చేయాలని భావించామని, పబ్లిసిటీ బడ్జెట్ ప్రకారమే ఖర్చు చేసామని చెప్పారు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా బడ్జెట్ ప్రకారమే చేశామని, డబ్బులు పెట్టి ఆస్కార్ కొనుక్కోవడం అనేది పెద్ద జోక్ అని అన్నారు. 95 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థ అది. అందులో ప్రతి ఒక్కటి కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాగే ఫ్యాన్స్ ప్రేమను కొనలేము.
ఈ చిత్రం గురించి జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ మాటలను కొనగలమా? సినిమాకు బాగా ప్రచారం చేసింది అభిమానులే అని కార్తికేయ చెప్పారు. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఆస్కార్ క్యాంపెయిన్ చేయడం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తారు. కానీ మాకు ఆ అవకాశం లేదు. మొదట క్యాంపెయిన్ చేయడం కోసం పెట్టాలనుకున్న బడ్జెట్ 5 కోట్లు. అయితే ఆ డబ్బు కూడా ఎక్కువే అనిపించింది. అందుకే ఆ బడ్జెట్ లో వీలైనంత ఖర్చు తగ్గించడానికే చూసాము.
ఆ డబ్బును కూడా 3 దశల్లో వెచ్చించాలనుకున్నాము. మొదట మూడు కోట్లు పెట్టాం. నామినేషన్స్ స్థానం పొందడంతో కొంచెం బడ్జెట్ ను పెంచాం. క్యాంపెయిన్కు మొత్తం ఐదారు కోట్లు ఖర్చు అవుతుందని భావించాము. ఫైనల్ గా రూ.8.5 కోట్లు ఖర్చు అయింది. ఎందుకంటే లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ లలో ఎక్కువ స్క్రీనింగ్స్ లో మూవీ వేయాల్సి వచ్చిందని వివరించారు. ఇక రామ్ చరణ్,ఎన్టీఆర్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవలు, రాహుల్ సిప్లిగంజ్ లను ఆస్కార్ కమిటీ వారు ఆహ్వానించారు. చంద్రబోస్, కీరవాణి బాబాయి ఇద్దరు నామినేషన్లో ఉన్నారు.
నామినేషన్లో ఉన్నవారికి,కమిటీ ఆహ్వానించిన వారు కాకుండా వెళ్ళినవారంతా కూడా ఆస్కార్ టికెట్లు కొనుగోలు చేయాలి. దాని కోసం నామినేషన్స్లో ఉన్న వ్యక్తులు ఆస్కార్ కమిటీకి వారికి ఈ-మెయిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ టికెట్లలో రక రకాల క్లాస్లు కూడా ఉంటాయి. కీరవాణి బాబాయ్ మా కుటుంబం కోసం ఆస్కార్ కమిటీకి ఈ-మెయిల్ పెట్టారు. తరువాత వారు లింక్ పంపించారు.
ఆ విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కో టికెట్ కి 1500 డాలర్లు చొప్పున కొనుకున్నాము. అదీ కూడా లోయర్ లెవల్. మరో నలుగురికి టాప్లో కూర్చొని చూడడానికి 750 డాలర్ల టికెట్లు కొనడం జరిగింది. ఈ మొత్తం ప్రాసెస్ కూడా అధికారికంగానే జరిగిందని కార్తికేయ వెల్లడించారు.
కొందరు ఆరోగ్య నిపుణుల చెప్తున్న దాని ప్రకారంగా అరటిపండు బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. ఎందుకంటే బరువు తగ్గించడానికి సాయపడే చాలా గుణాలు దీనిలో ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లను తినవచ్చు. ఆకుపచ్చగా ఉండే అరటికాయలో అధికంగా పిండి పదార్ధం ఉంటుంది. అందువల్ల అరటికాయను ఆహారంలో చేర్చుకుంటే మేలు.
ఇక పసుపు రగులో ఉండే అరటిపండులో ప్రోటీన్స్ చాలా తక్కువ. ఇది కండరాలకు అవసరమైన పోషకం. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు మీడియం సైజ్అరటిపండును కొన్ని గింజలతో కలిపి తినడం మంచిది. అంతే కాకుండా అరటిపండ్లు పేగు హెల్దీగా ఉంచడానికి సాయం చేస్తుంది. దీనిలో పెక్టిన్ కూడా ఉంటుంది. పెక్టిన్ అనేది కరిగే ఫైబర్. పెక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే అరటిపండు కడుపులో మంటను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్ధం కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటి పండు తినడం వల్ల చాలా సమయం పాటు పొట్టనిండుగా ఉంటుంది. అందువల్ల త్వరగా ఆకలి అవదు. దీనివల్ల అనారోగ్యకరమైన ఫుడ్ ను తినకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అరటిపండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. తద్వార గుండె వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధితమైన సమస్యలను నివారిస్తుంది.
Also Read:
ఇదిలా ఉండగా ఐపీల్ 2023 కోసం కామెంటేటర్ కనిపించబోతున్నారు బాలయ్య. ఇప్పటి వరకు హీరోగా సినీ అభిమానులను అలరించిన బాలయ్య, గత ఏడాది టాక్ షో హోస్ట్ గా ప్రేక్షకులతో అలరించారు. ఇక ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి కామెంటెటర్ గా బాలయ్య రెడీ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలయ్య తనదైన శైలిలో కామెంటరీ చేయబోతున్నట్లు స్టార్ స్పోర్ట్స్ అనౌన్స్ చేసింది. మార్చి 31న మొదలయ్యే ఐపీఎల్ తొలి రోజున బాలయ్య కామెంటరీ ఉండబోతుందని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. ఈ విషయన్ని ట్వీట్ చేసింది.
ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి మొదలవనుంది. ప్రస్తుతం అందరి దృష్టి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మీదనే ఉంది. తాజాగా బీసీసీఐ ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ మ్యాచ్ ల యొక్క వివరాలను రిలీజ్ చేసింది. నరేంద్రమోడీ స్టేడియంలో ఈ సీజన్ ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించ బోతున్నారు. ఈ ఐపీఎల్ ప్రారంభ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించడం కోసం బీసీసీఐ మరియు ఐపిఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ సిద్ధం అవుతోంది.
Also Read:
ఇక దీని కోసం శంకర్ 11 వెర్షన్లు సిద్ధం చేయించాడని సమాచారం. చివరగా వాటిలో ఒకటి ఖరారు చేసి నేడు విడుదల చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ శంకర్ భారీగానే ఖర్చు పెట్టించాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి 200 కోట్ల బడ్జెట్ అనుకుంటే దర్శకుడు శంకర్ ఇప్పటిదాకా దాదాపు 280 కోట్లు ఖర్చు పెట్టించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి వరకు డెబ్బై శాతం మాత్రమే అయ్యింది.
ఆగస్టు వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అప్పటి వరకు ఈ మూవీ బడ్జెట్ ఎంత అవుతుందో చూడాలి మరి. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియార అద్వానీ, అంజలి కథానాయకలుగా నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్, జయరామ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read:
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న దేవి శ్రీ ప్రసాద్ తండ్రిగారే ఈ గొర్తి సత్యమూర్తి. ఆయన ఏపీలోని తూర్పుగోదావరిలోని వెదురుపాక అనే గ్రామంలో మే 24న 1953లో జన్మించారు. సత్యమూర్తి దర్శకేంద్రుడు కే. కే.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ‘దేవత’ సినిమాతో రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుండి బావా మరదళ్లు, ఖైదీ నంబర్ 786, కిరాయి కోటిగాడు, పోలీస్ లాకప్, అభిలాష,ఛాలెంజ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథలు అందించారు.
1980, 90లలో విడుదల అయిన బంగారు బుల్లోడు, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, అమ్మ దొంగా, చంటి, శ్రీనివాస కళ్యాణం, పెదరాయుడు, మాతృదేవోభవ, రౌడీ అన్నయ్య లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకి రచయితగా చేశారు. సత్యమూర్తి 400కు పైగా చిత్రాలకు రచయితగా చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరచిపోలేని చిత్రాలు అయిన అభిలాష, ఖైదీ నెం 786, ఛాలెంజ్ లాంటి సినిమాలకి రైటర్ ఆయనే. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గుడుంబా శంకర్, జానీ సినిమాలకి రచయితగా చేశారు. ఆయన చెన్నైలో డిసెంబర్ 14, 2015లో కన్నుమూశారు.
Also Read:
అన్నదమ్ముల మధ్య గోడవకు కారణమైన సారధి ఎవరో కాదు మంచు ఫ్యామిలికి చాలా దగ్గరివాడని తెలిపారు. అంతే కాకుండా మోహన్ బాబు పర్సనల్ పనులన్ని చూసేది ఆ సారధే అని అన్నారు. మోహన్ బాబు ఎప్పుడో ఆస్తులన్నిటిని పంచి ఇచ్చారని, ఇక మంచు విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీ పనులను తీసుకున్నారని, కానీ ఒక విషయంలో క్లారిటీ రావాల్సి ఉందని చెప్పారు.
దాని కోసమే విష్ణుకి సారధితో చిన్నపాటి గొడవ అయ్యిందని చిట్టిబాబు తెలిపారు. సారధి క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకుని తిరిగేసరికి, విష్ణు ఆ విషయం గురించే సారధి ఇంటికి వెళ్లాడని అన్నారు. సారధి ఇంటి దగ్గర గొడవ అయ్యిందని, అయితే ఆ టైమ్ లో మోహన్ బాబుకి కాల్ చేస్తే గొడవ అయ్యేది కాదని అన్నారు.
సారధి ఇంటికి వెళ్లి మంచు విష్ణు గొడవ చేయడం తప్పు. ఇక ఈ విషయన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడం మంచు మనోజ్ తప్పని చిట్టిబాబు తెలిపారు. మోహన్ బాబు ఏ సమస్య అయిన బయటికి రాకుండా నాలుగు గోడల మధ్యనే సరి చేసేవాడు. ఇప్పుడు కొడుకులు ఇద్దరు దాన్ని క్రాస్ చేసి, మంచు ఫ్యామిలిని విమర్శించే వాళ్లకి ఛాన్స్ ఇచ్చారని అన్నారు.
Also Read: