బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా, తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా జవాన్. ఎప్పుడో మొదలు అయిన ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా హిందీ సినిమా అయినా కూడా, తమిళ్, తెలుగు భాషల్లో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : జవాన్
- నటీనటులు : షారూఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే.
- నిర్మాత : గౌరీ ఖాన్
- దర్శకత్వం : అట్లీ
- సంగీతం : అనిరుధ్ రవిచందర్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 7, 2023

స్టోరీ :
విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్) ఒక జవాన్. దేశానికి, ప్రజలకి సేవ చేయాలి అనుకుంటాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రజలందరికీ దూరంగా బతకాల్సి వస్తుంది. అతని భార్య (దీపికా పదుకొనే) కూడా అతనికి దూరం అవుతుంది. వీటన్నిటికి కాళీ (విజయ్ సేతుపతి) చేసిన పనులు కారణం అవుతాయి. అయితే విక్రమ్ భార్య ఒక కొడుకుకి జన్మనిస్తుంది. ఆ కొడుకు ఆజాద్ రాథోడ్ (ఇంకొక షారుఖ్ ఖాన్) పెద్ద అయ్యి పోలీస్ అవుతాడు. అయితే ఆజాద్ ని కొంత మంది ఇబ్బంది పెడతారు.

తన కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు అని తెలుసుకుని, తాను బయటికి రావాల్సిన సమయం వచ్చింది అని అర్థం చేసుకొని విక్రమ్ అప్పుడు బయటికి వచ్చి తన కొడుకుని కాపాడుతాడు. అప్పుడు విక్రమ్ ఏం చేశాడు? అక్కడ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాడు? అసలు ఎందుకు అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది? తర్వాత ఆ తండ్రి కొడుకులు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
చేసినవి కొద్ది సినిమాలే అయినా కూడా తమిళ్ తో పాటు, తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్న వ్యక్తి డైరెక్టర్ అట్లీ. అట్లీ చేసిన 4 సినిమాల్లో 3 సినిమాలు విజయ్ తోనే చేశారు. ఆ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అవి విజయ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు అని కూడా అందరూ అన్నారు. అంత బాగా అట్లీ ఆ సినిమాలని డైరెక్ట్ చేశారు.

ఇప్పుడు అట్లీ బాలీవుడ్ హీరోతో చేస్తున్నారు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ, దాంతో పాటు తమ హీరోని ఎలా చూపించబోతున్నారు అని బాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ట్రైలర్ చూస్తే దాదాపు చాలా వరకు కథ అర్థం అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే అట్లీ సినిమాలు ఒక నాలుగు ఐదు మంచి కమర్షియల్ సినిమాలని మిక్స్ చేసి తీసినట్టు ఉంటాయి. ఈ సినిమా కూడా దాదాపు అలాగే ఉంటుంది.

సినిమా మొదటి నుండి కూడా ఆ తర్వాత ఏమవుతుంది అనే విషయాన్ని తెలుగు, తమిళ్ లో వచ్చిన కమర్షియల్ సినిమాలు బాగా చూసిన ఒక ప్రేక్షకుడు ఈజీగా కనిపెట్టగలుగుతాడు. కానీ బాలీవుడ్ వాళ్లకి ఇలాంటి సినిమాలు కొత్త. అంతే కాకుండా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించారు. ఒక సౌత్ డైరెక్టర్ విజన్ నుండి ఒక నార్త్ హీరో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాతో చూపించారు. అట్లీ బాలీవుడ్ లో ఉండే నియమాలు ఏవి ఆలోచించకుండా, వాళ్ల స్టాండర్డ్స్ దృష్టిలో పెట్టుకోకుండా తన మార్క్ టేకింగ్ తోనే వెళ్లారు. ఒకరకంగా చెప్పాలంటే అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది.

ఎందుకంటే షారుఖ్ ఖాన్ ని ఒక డాన్ గా, లేకపోతే ఇంకేదో రోల్ లో చూసిన వాళ్ళకి, ఇలా ఒక పోలీస్ పాత్రలో చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పటి వరకు ఒక రకమైన సినిమాలు చేసిన అక్షయ్ కుమార్, విక్రమార్కుడు రీమేక్ అయిన రౌడీ రాథోడ్ సినిమా చేసి తనలోని ఒక కొత్త కోణాన్ని హిందీ ప్రేక్షకులకు ఆవిష్కరించారు. ఒకరకంగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అదే చేశారు. కథ రొటీన్ అయినా కూడా టేకింగ్ పరంగా బాగుంది. దాంతో కథ అర్థం అయిపోతున్న ప్రేక్షకుడిని కూడా సినిమా చివరి వరకు కూర్చోబెట్టగలిగారు.

సినిమా పేరుకి హిందీ సినిమా అయినా కూడా సగం పైన తమిళ్, తెలుగు వారికి తెలిసిన నటీనటులు ఉన్నారు. యాక్టర్స్ మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి చాలా మంది తమిళ్ వాళ్లే ఉన్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నవారు కావడంతో వారి పనితనం తెరపై బాగా కనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు పాత్రల్లో చాలా బాగా నటించారు. లుక్ పరంగా కూడా డిఫరెంట్ గా ఉన్నారు.

నయనతార పాత్ర నటనకి ఆస్కారం ఉన్న పాత్ర ఏమీ కాకపోయినా సినిమాకి ఒక ముఖ్యమైన పాత్ర అంతే. తన పాత్ర పరిధి మేరకు నయనతార నటించారు. దీపికా పదుకొనే కూడా ఒక ఎక్స్టెండెడ్ కేమియోలో కనిపించారు. తనకి ఇచ్చిన పాత్రలో తను బాగా నటించారు. షారుఖ్ ఖాన్ తర్వాత సినిమాకి అంత పెద్ద హైలైట్ అయిన పాత్ర విజయ్ సేతుపతి పాత్ర. లుక్ పరంగా చాలా స్టైలిష్ గా ఉన్నారు.

హిందీ నేర్చుకొని మరి డబ్బింగ్ చెప్పారు. సహాయ పాత్రల్లో నటించిన ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వీరు కాకుండా సినిమాకి మరొక హీరో అనిరుధ్. అనిరుధ్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. కానీ కథనం విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- నిర్మాణ విలువలు
- కొన్ని ఎమోషనల్ సీన్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- సౌత్ వాళ్ళకి బాగా తెలిసిన టెంప్లేట్ కథనం
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
మాస్ మసాలా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలని ఎంజాయ్ చేసే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. తెలిసిన కథే అయినా కూడా ఒక ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టగలిగే ఫార్ములా ఉన్న కథ ఇది. షారుఖ్ ఖాన్ అభిమానులు అయితే ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒక మంచి సినిమాగా జవాన్ సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ హీరోలు అయ్యారు..! ఎవరో తెలుసా..?

పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అబ్బాయిలు అన్నదమ్ముళ్లు. వారిద్దరూ ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. వారి కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో నటించారు. అది మాత్రమే కాకుండా వైవిధ్యమైన చిత్రాలతో ఆడియెన్స్ మనసులలో స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వాస్తవానికి వీరిద్దరు కోలీవుడ్ హీరోలు. అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఈ హీరోలు మరెవరో కాదు. కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య మరియు కార్తీ.
డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన ఈ సోదరులు నటించిన సినిమాలు తెలుగులో విడుదల అయ్యి, మంచి కలెక్షన్స్ రాబడతాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగులో హిట్ అందుకున్నారు. తమిళ హీరోలు అయినప్పటికీ టాలీవుడ్ లో వీరికి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు విలక్షణమైన నటన, విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అనుష్క ఎన్నో హిట్ సినిమాలలో నటించి, స్టార్ హీరోయిన్ గా రాణించారు. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించి, మెప్పించింది. టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పేరు గాంచింది. కన్నడ అమ్మాయి అయినా, తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ అభిమానాన్ని పొందింది. అరుంధతి మూవీతో మహిళా ఆడియెన్స్ ఆకట్టుకున్న అనుష్క బాహుబలి మూవీలో తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకుంది.
బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీ తరువాత అలాంటి చిత్రాలే చేస్తుంది అనుకున్నారు. ఆ తరువాత భాగమతి మూవీ చేసింది. ఆ మూవీ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా తరువాత అనుష్క సైలెంట్ అయ్యింది. చాలా కాలం తరువాత సి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది.
దానికి కారణం అనుష్క సైజ్ జీరో మూవీ కోసం బరువు పెరిగింది. అయితే అప్పటి నుంచి ఆమె అదే ఫిజిక్ కొనసగిస్తున్నారని అంటున్నారు. ఇక ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీలో కూడా అనుష్క బొద్దుగానే ఉంది. అందువల్లే అనుష్క మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనట్లేదని ఇండస్ట్రీలో టాక్.

1. జవాన్ :
2. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి :
ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు/ సిరీస్ లు :


ఉదయనిధి స్టాలిన్మాట్లాడుతూ సనాతన ధర్మం బడుగు, బలహీన వర్గాలు మరియు దళితులను అణగదొక్కి, బ్రాహ్మణిజాన్ని పోషిస్తోందని అన్నారు. సనాతన ధర్మం పేరుతో కొందరు దళితులకు ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. రాజకీయంగా పలువురు నేతలు ఉదయనిధి చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నారు.
తాజాగా ఉదయనిధి వాఖ్యల పై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరని అన్నారు. ఉదయనిధి లాంటివారిని ఇప్పటికే చాలామందిని ఈ దేశం చూసిందని అని అన్నారు. మన దేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేశారని, కానీ వారంతా కూడా కాలగర్భంలో కలిశారని చెప్పారు. హిందూ దేవలయాలపై ఎన్నో దాడులు చేశారని, అయినా హిందూ ధర్మం నిలిచే ఉందని అన్నారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని, ముందు ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ భావజాలం అంటే అర్ధం తెలుసుకోవాలని రంగరాజన్ చెప్పారు. సనాతన ధర్మం నిర్మూలించాలని చెపుతున్న ఉదయనిధి స్టాలిన్ తమిళ సంస్కృతి కోసం, అభివృద్ధి, పరిరక్షించడం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు సనాతన ధర్మాన్ని గౌరవించే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవాలని రంగరాజన్ కోరారు.



ధనుష్, మంజు వారియర్ నటించిన సినిమా అసూరన్. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో ధనుష్ కు అక్క కూతురు మరియమ్మ పాత్రలో అమ్ము అభిరామి నటించింది. ధనుష్ శివసామిగా నటించాడు. శివసామి, మారియమ్మలు ప్రేమించుకుంటారు. ఆమె కుటుంబంతో సహా గుడిసెలలో సజీవదహనం అవుతుంది.
అయితే డైరెక్టర్ వెట్రిమారన్ మరియమ్మ పాత్రను చదువుకోవడానికి స్కూల్ కు వెళ్ళే పాత్రలో చూపించారు. ఈ మూవీ చదువు నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2019లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యి, ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డ్ తో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ధనుష్ ఉత్తమ నటుడి అవార్డును అసురన్ చిత్రానికి గాను పొందారు. ఇదే సినిమాని తెలుగులో నారప్ప టైటిల్ తో తెరకెక్కించారు.
ఈ మూవీలో అగ్ర హీరో వెంకటేష్, ప్రియమణి జంటగా నటించారు. ఒరిజినల్ మూవీలో మరియమ్మ పాత్రను చేసిన అమ్ము అభిరామి నారప్ప ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో అక్క కూతురి పాత్రలో కన్నమ్మగా నటించింది. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కన్నమ్మ పాత్రను టైలరింగ్ నేర్చుకున్నట్టుగా చూపించారు. ఈ విషయాన్ని గమనించిన నెటిజెన్లు అసలు సినిమానే విద్య గురించి, కాబట్టి తమిళంలో చదువుకున్నట్టుగా చూపించారు. కానీ తెలుగులో ఆ పాయింట్ ఎందుకు మార్చారు అని కామెంట్స్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ నటిస్తున్న మూవీ ఓజి. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సాహో డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్, సుజిత్ కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ సినిమా పై అంచనాలను పెంచుతూ వస్తున్నారు.
పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలి మరింతగా పెరిగిపోయాయి. పవన్ లుక్స్, యాక్షన్ తో ఉన్న టీజర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యూత్ అంతా ఓజి టీజర్ తో ఊగిపోతున్నారు. ఇప్పటికీ ఈ టీజర్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతునే ఉన్నాయి.
ఒకటని కాకుండా కాస్ట్యూమ్స్, కత్తి, గన్ ఇలా టీజర్ లో చూపించిన ప్రతి ఒక్క దాని గురించి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు సినీ స్టార్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి. ఈ మూవీలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకరు కోలీవుడ్ నటి శ్రియారెడ్డి. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.