నిన్నటి తరం తెలుగు సినిమా ప్రేక్షకులకు కళ్ళు చిదంబరం సుపరిచితులు. ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేవి. ఆయన పేరు కొల్లూరు చిదంబరం అయినప్పటికీ ఆయన “కళ్ళు” సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో అందరికి కళ్ళు చిదంబరంగానే గుర్తుండిపోయారు.
కొల్లూరు చిదంబరం ఆయన కళ్ళతోనే మనకి గుర్తుండిపోయారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయనను “కళ్ళు” చిదంబరం గా పిలుస్తుంది. అంతే కాదు. ఆయన నటించిన కళ్ళు సినిమా ఆయనకీ మంచి గుర్తింపు ను తెచ్చింది.
ఆయనకు ఈ సినిమాకి గాను రాష్ట్ర నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. తెలుగు లో ఆయన నటించిన “అమ్మోరు” సినిమా కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. చిదంబరం సినిమాల్లోకి వచ్చే ముందు ఆయన ఇంజనీర్ గా పనిచేసేవారట. ఆయన 2015 లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన అనారోగ్య కారణాల వలెనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కళ్ళు చిదంబరం కుమారుడు ఆయన మరణం వెనకాల ఉన్న కారణాలను వివరించారు.
సినిమాల్లోకి రాకముందు కళ్ళు చిదంబరం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. అంతేకాక నాటకాలపై ఆసక్తి ఉండడంతో ఆయన నాటకాలలో కూడా నటించేవారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు నాటకాలలో నటించడం కోసం కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఉద్యోగం విజయవాడలో చేస్తూ.. మరోవైపు నాటకాల కోసం హైదరాబాద్, చెన్నై ల మధ్య ప్రయాణాలు చేసేవారు. సమయానికి సరైన నిద్ర ఉండేది కాదు. దీనితో ఆయన కంటికి ఓ నరం పక్కకి జరిగి మెల్లకన్నులా వచ్చింది.
కళ్ళు చిదంబరానికి మొదట్లో మెల్లకన్ను ఉండేది కాదు. కానీ నాటకాలపై, సినిమాలపై ఉన్న ప్రేమ కారణంగా ఆయన ఆరోగ్యం మీదకు తెచ్చుకున్నారు. ఇక డాక్టర్లు కూడా ఇతర చికిత్స విధానాల ద్వారా మెల్లకన్నుని సరి చేసుకోవచ్చని చెప్పినప్పటికీ.. సినిమాల్లోకి వచ్చాక మెల్లకన్ను కలిసి వచ్చిందని.. కళ్ళు చిదంబరం చికిత్స చేయించుకోలేదు. ఆ తరువాత అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.
Watch Video:




టార్జాన్ లక్ష్మీనారాయణ మొదటిసారిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘గాయం’ మూవీలో శ్రీశైలం అనే క్యారెక్టర్ లో నటించాడు. ఆ తరువాత అనేక చిత్రాలలో విలన్ గ్యాంగ్ లో ఉండే మెంబర్ గా నటిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన మూవీలో మెయిన్ విలన్ గా నటించాడు. కానీ ఆ మూవీ హిట్ కాలేదు. దాంతో సినిమాల కన్నా తమ సొంత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బెటర్ అని భావించి, అటు వైపుగా వెళ్ళాడు.
అలా పది ఏళ్లపాటు ఆ బిజినెస్ చూసుకుంటూ గడిపిన టార్జాన్ లక్ష్మినారాయరణ, ఆ తరువాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. అలా పోకిరి మూవీలో నటించిన టార్జాన్, మహేష్ బాబు చేతిలో పన్ను విరగొట్టుకునే పాత్రలో నటించి, గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా శ్రీ ఆంజనేయం, ఆర్య 2, అతనొక్కడే, అనుకోకుండా ఒక రోజు, ఖతర్నాక్, ఆంజనేయులు, సెల్ఫీ రాజా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, నన్ను దోచుకుందువటే, అలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించాడు.
టార్జాన్ లక్ష్మీనారాయణ చాలా సినిమాలలో హాస్యనటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించాడు. ప్రస్తుతం తన నటన మెరుగుపరచుకోవడం కోసం నాటకాలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వందల సినిమాలలో నటించిన లక్ష్మీనారాయణ గుప్త తన కెరీర్ లో వివిధ రకాల పాత్రలను పోషించారు.
మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్తగా, గ్యాంగస్టర్ గా కనిపించారు. ఈ సినిమాలో సాధారణ వ్యక్తి, ముంబైకి వెళ్ళి సూర్య భాయ్ గా ఎదుగుతాడు. ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటనకు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ నటించింది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మర్చిపోలేని మూవీ అని చెప్పవచ్చు. మూవీ అంతా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది.
అయితే బిజినెస్ మెన్ మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కథ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. అలా ముంబైకి వెళ్లి గ్యాంగస్టర్ గా ఎదిగిన వ్యక్తి పేరు సతువాచారి వరదరాజన్ ముదలియార్. ఆయన 1960 లో సాధారణ వ్యక్తిగా ముంబైకి వెళ్లి, ఒక ముంబై డాన్ వరదా బాయ్ గా ఎదిగారట. సతువాచారి 1926 లో అక్టోబర్ 9న జన్మించారు.
వరదా బాయ్ ని వర్ధ అని కూడా అనేవారంట. అంతేకాకుండా ఇండియన్ క్రైమ్ బాస్ అని కూడా పిలిచేవారట. వరదా బాయ్ 1988లో జనవరి 2న మరణించారు. వరదా బాయ్ నిజ జీవిత కథ ఆధారంగానే డైరెక్టర్ పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మెన్ మూవీని తీశారు. కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా కూడా వరదా బాయ్ ని కథతో తెరకెక్కింది.
యాంకర్ మరియు నటి అనసూయ ఏడుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో చిన్న వీడియోతో పాటుగా సుదీర్ఘమైన నోట్ కూడా షేర్ చేసి ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఆమె సుధీర్ఘమైన పోస్టును చూస్తే సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోలింగ్ కి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అనసూయ పెట్టిన పోస్టు సారాంశం, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను సమాచారం, కమ్యూనికేషన్ కోసం మొదట్లో వాడాం. ఆ తరువాత ప్రపంచంలోని జీవన శైలి, డిఫరెంట్ సంస్కృతి, సంప్రదాయల గురించి, నాలెడ్జ్ కోసం ఉపయోగించేవాళ్ళం. ఇక్కడికి ఒకరికొకరు సపోర్ట్ గా నిలవాలనే వస్తాం. ఆనందం, బాధ వంటి వాటిని పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంటాం. నే సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి జ్ఞాపకం, ఫోటోలు, డాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్లు, కంబ్యాక్ లు అన్ని నా జీవితంలో భాగమే.
గత ఏడాది ‘పోకిరి’ తో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్ లో హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే గతంలో నిరాశపరిచిన రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో రీరిలీజ్ చేశారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత యావరేజ్ గా నిలిచిన చిన్న సినిమా ‘ఈనగరానికి ఏమైంది’ రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించి, పెద్ద సినిమాల లిస్ట్ లో నిలిచింది.
తాజాగా రీరిలీజ్ అయిన యోగికి కూడా అలాంటి రెస్పాన్స్ రావడంతో వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు రీరిలీజ్ సిద్ధం అయ్యాయి. అయితే స్టార్ హీరోలందరికి కాలంతో పని లేకుండా ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్లాపే అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు. రాఖీ, ఒక్క మగాడు, లయన్ సినిమాలను త్వరలో రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
తమిళ హీరో శివకార్తికేయన్ కు టాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ అనే తెలుగు సినిమాను చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ శివకార్తికేయన్ ముందు సినిమాల కన్నా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది.
ఈ మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉందనే టాక్ వచ్చింది. శివకార్తికేయన్ మార్క్ కామెడితో రూపొందింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూస్తూ, అందులో ఉండే పొరపాట్లను గమనించి, మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి కాస్త వైరల్ అవడం సాధారణం అయిపోయింది.
ఓటీటీలో ఈ మూవీని చూసి, ఇందులోని ఒక పొరపాటును గమనంచిన ఒక నెటిజెన్, హర్ష్ మీమర్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో దానికి సంబంధించిన వీడియోకి ‘ఎడిటింగ్ చూసుకోవాలి కదా’ అంటూ షేర్ చేశాడు. ఆ వీడియోలో బోర్డు పై ముందు తమిళంలో మా భూమి అని, వెంటనే తెలుగులోకి మారుతుంది. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న తీవ్రమైన ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఈ మూవీలోని సీన్స్ ను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ సినిమాలకు ఇతర విషయాలతో ఉన్న కనెక్షన్స్ వెతికి పట్టుకొని మరి నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి మొన్న మెహర్ రమేష్ సినిమాలు ప్లాప్ అయిన ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఇండియకే వచ్చిందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాలో మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ గురించి ముందే చెప్పారనే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నేనింతే మూవీలో బ్రహ్మానందం తీసిన మూవీ పేరు షాడో. ఆ మూవీలోని పోస్టర్ పై ఉన్న షాడో ఫాంట్, మెహర్ రమేష్ తీసిన మూవీ షాడో ఫాంట్ ఒకేలా ఉంటాయి. నేనింతే మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది. ఇక మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ 2013 లో రిలీజ్ అయ్యింది. దాంతో మెహర్ రమేష్ షాడో మూవీ గురించి పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో ముందే చెప్పారా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ మూవీని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా, ఆయన భార్యగా రమ్యకృష్ణ, కొడుకుగా యంగ్ హీరో వసంత్ రవి, కోడలిగా మిర్నా మేనన్ నటించారు. మనవడిగా నటించిన బాలనటుడు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. దాంతో నెటిజెన్లు ఆ అబ్బాయి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు.
ఆ బాలనటుడి పేరు రిత్విక్ అతన్ని రీతు రాక్స్ అని కూడా పిలుస్తారు. జైలర్ మూవీ కన్నా మూడు పలు సినిమాలలో రిత్విక్ నటించాడు. అతని మొదటి సినిమా O2 (ఆక్సిజన్). ఈ మూవీలో నయనతార కుమారుడి పాత్రలో నటించాడు. ఆ తరువాత కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీలో లైలా కొడుకుగా కీలక పాత్రలో నటించాడు. ఈ అబ్బాయికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాని ద్వారానే అతను సినిమాల్లోకి వచ్చాడు.
యూట్యూబ్ చైల్డ్ గా పాపులర్ అయిన రిత్విక్, తన యూట్యూబ్ ఛానెల్ ‘రీతు రాక్స్’ లో డిఫరెంట్ గెటప్లు ధరించి, నటించిన వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ ఛానెల్ ను రిత్విక్ తండ్రి జోతిరాజ్ చూసుకుంటాడు. ఆగస్ట్ 2023 నాటికి, రిత్విక్ యూట్యూబ్ ఛానెల్ రీతు రాక్స్ 2.36 మిలియన్ సబ్స్క్రైబర్ లు ఉన్నారు. అతని వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో మిలియన్ల వ్యూస్ ను సంపాదించాయి.
మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కి హీరో నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాబోయేగా సీజన్ కి కూడా ఆయనే హోస్ట్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రోమోలు ఈ సీజన్ పై అంచనాలను పెంచుతున్నాయి. ఏడవ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున ప్రోమోలలో హింట్ ఇస్తూ, ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచారు. ఇక ఈసారి ప్రోమోలను కూడా భిన్నంగా ప్లాన్ చేశారు.
తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో నటించిన అమ్మాయి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తూ, ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమో కనిపించిన అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. కొత్త నటి కాదు. ఆమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో నటించింది. అయితే ఆమె చేసింది ఎక్కువగా సైడ్ రోల్స్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ ప్రోమోతో ఆమె ప్రేక్షకుల దృష్టిలో పడడంతో ఆమె గురించి వెతుకుతున్నారు.
అలేఖ్య రెడ్డి ఇంటింటి రామాయణం, అశోక వనంలో అర్జున కల్యాణం , అర్థమైందా అర్జున్ కుమార్ వంటి చిత్రాలలో సినిమాల్లో నటించింది. అలేఖ్య రెడ్డి ఒక్క ప్రోమోలోనే నటించిందా? లేదా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా కూడా ఉంటుందా అనే విషయం తెలియాల్సిఉంది. ఇక రాబోయే బిగ్ బాస్ సీజన్లో దాదాపు ఇరవై మంది పోటీదారులు పాల్గొంటున్నారని సమాచారం.వీరిలో ఎక్కువగా సెలెబ్రెటీలు ఉన్నట్టు తెలుస్తోంది.
గుంటూరు కారం సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మూవీ పై ఎన్నో ప్రచారాలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం మూవీ షూటింగ్ కొనసాగుతుందా? ఆగిపోతుందా? అన్న విషయం సస్పెన్స్గా మారింది. ఈ మూవీ నుంచి హీరోయిన్ పూజాహెగ్డేతో పాటుగా సినిమాటోగ్రాఫర్ మధ్యలోనే మూవీ నుండి తప్పుకోవడం, షూటింగ్ కూడా పలుమార్లు వాయిదా పడుతుండడం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది.
ఈ సినిమా స్టోరీకి సంబంధించి ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఎమ్డీబీ సైట్లో గుంటూరు కారం మూవీ స్టోరీకి సంబంధించిన సినాప్సిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్బాబు గుంటూరు సిటీకి డాన్గా నటిస్తున్నట్లు ఆ సినాప్సిస్ లో పేర్కొన్నారు. గుంటూరు సిటీలో జరుగుతున్న అన్యాయాల పై, అక్రమాల పై పోరాటం చేస్తున్న ఒక జర్నలిస్ట్తో సూపర్ స్టార్ మహేష్బాబు ప్రేమలో పడతాడు.
ఆమె లక్ష్యాన్ని సాధించడం కోసం ఆ డాన్ ఎలా తోడుగా నిలుస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ అని ఈ సినాప్పిస్లో కనిపిస్తోంది. త్రివిక్రమ్ మహేష్బాబు క్యారెక్టర్ను సర్ప్రైజ్ ట్విస్ట్తో డిజైన్ చేసినట్లుగా దానిలో చూపించారు. ఈ విషయం నిజమా? కాదా? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఇక ఈ మూవీలో జర్నలిస్ట్ గా మీనాక్షిచౌదరి, మహేష్బాబుకు మరదలి పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది.