ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోయిన్ గా చలామణి అవుతున్న నటి సమంత. విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో తెరకెక్కిన రొమాంటిక్ మూవీ ఖుషి సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఖుషి సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
మొన్న స్టేజిపై విజయ్ దేవరకొండ తో సమంత చేసిన హాట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆన్లైన్ లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈవెంట్లో సమంత పార్టిసిపేట్ చేయడంతో ఖుషి మూవీ పై బజ్ పెరగడమే కాకుండా సినిమా బయట ఇంత కెమిస్ట్రీ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అన్న టాక్ కూడా ఎక్కువ అయింది.

మాయోసైటిస్ అని అరుదైన జబ్బుతో బాధపడుతున్న సమంత గత కొద్ది కాలంగా సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆరోగ్యం పైపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం సమంతకు అలవాటే.

తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ తో ఎప్పుడు ఫాన్స్ తో టచ్ లో ఉండే సమంత కొత్త ప్రేమ అని పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఒక గ్లాస్ లో ఉన్న వాటర్ ని చేతిలో పట్టుకొని తీసుకున్న ఫోటో కింద కొత్త ప్రేమ అనే పదం యాడ్ చేసి సమంత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ గ్లాస్ పట్టుకున్న సమంత చేతికి లవ్ అనే అక్షరాలతో కూడిన బ్రాస్లెట్ కూడా ఉంది. మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమను కనుగొన్నాను…అని సమంత పెట్టిన పోస్ట్ వెనక అంతరార్థం ఏమిటో ఎవరికి అర్థం కావడం. నీటిని ప్రేమించడం ఏమిటి.. దీని వెనక కథ వేరే ఉంది అని కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు.
ALSO READ : “సామజవరగమన” లో ఈ సీన్ ఎందుకు డిలీట్ చేసారో.? “వెన్నెల కిశోర్” కామెడీ మాములుగా లేదుగా.?

‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.
పదేళ్లు అమెరికాలో ప్రయత్నించినప్పటికీ కెరీర్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో 1971లో మళ్ళీ హాంకాంగ్ కి వెళ్ళిపోయారు. అక్కడే ‘ది బిగ్ బాస్’, ‘ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ’, ‘ది వే ఆఫ్ డ్రాగన్’ అనే 3 యాక్షన్ చిత్రాలతో విజయం సాధించారు. ది వే ఆఫ్ డ్రాగన్ మూవీకి కు బ్రూస్ లీ దర్శకుడుగా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన నటించిన మూవీ ఎంటర్ ది డ్రాగన్. ఈ మూవీ 1973 ఏప్రిల్ లో షూటింగ్ పూర్తయింది. అయితే మూవీకి డబ్బింగ్ చెప్పే సమయంలో బ్రూస్ లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే హాస్పటల్ కి తరలించారు.
అప్పుడే సెరిబ్రల్ ఎడెమీ(మెదడువాపు) వ్యాధి అని తెలిసింది. అయితే ఆ వ్యాధి రావడానికి కారణం వైద్యులు చెప్పలేకపోయారు. బ్రూస్ లీ కోలుకుని తిరిగి సినిమాల్లో నటిస్తారని వైద్యులు హామీ ఇచ్చారు. 2 నెలల తర్వాత బ్రూస్ లీ ప్రేయసి బెట్టీ టింగ్ పెయి ఇంట్లో ఉన్న సమయంలో బ్రూస్ లీ స్పృహ తప్పారు. అలా బ్రూస్ లీ 1973 జులైలో తన 32 ఏళ్ల వయసులో ఈలోకాన్ని విడిచారు. బ్రూస్ లీ చనిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికి అంతుచిక్కలేదు. ఆయన మరణానికి కారణం పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకోవడం అని అప్పట్లో డాక్టర్లు ప్రకటించారు.


టార్జాన్ లక్ష్మీనారాయణ మొదటిసారిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘గాయం’ మూవీలో శ్రీశైలం అనే క్యారెక్టర్ లో నటించాడు. ఆ తరువాత అనేక చిత్రాలలో విలన్ గ్యాంగ్ లో ఉండే మెంబర్ గా నటిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన మూవీలో మెయిన్ విలన్ గా నటించాడు. కానీ ఆ మూవీ హిట్ కాలేదు. దాంతో సినిమాల కన్నా తమ సొంత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బెటర్ అని భావించి, అటు వైపుగా వెళ్ళాడు.
అలా పది ఏళ్లపాటు ఆ బిజినెస్ చూసుకుంటూ గడిపిన టార్జాన్ లక్ష్మినారాయరణ, ఆ తరువాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. అలా పోకిరి మూవీలో నటించిన టార్జాన్, మహేష్ బాబు చేతిలో పన్ను విరగొట్టుకునే పాత్రలో నటించి, గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా శ్రీ ఆంజనేయం, ఆర్య 2, అతనొక్కడే, అనుకోకుండా ఒక రోజు, ఖతర్నాక్, ఆంజనేయులు, సెల్ఫీ రాజా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, నన్ను దోచుకుందువటే, అలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించాడు.
టార్జాన్ లక్ష్మీనారాయణ చాలా సినిమాలలో హాస్యనటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించాడు. ప్రస్తుతం తన నటన మెరుగుపరచుకోవడం కోసం నాటకాలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వందల సినిమాలలో నటించిన లక్ష్మీనారాయణ గుప్త తన కెరీర్ లో వివిధ రకాల పాత్రలను పోషించారు.
మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్తగా, గ్యాంగస్టర్ గా కనిపించారు. ఈ సినిమాలో సాధారణ వ్యక్తి, ముంబైకి వెళ్ళి సూర్య భాయ్ గా ఎదుగుతాడు. ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటనకు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ నటించింది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మర్చిపోలేని మూవీ అని చెప్పవచ్చు. మూవీ అంతా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది.
అయితే బిజినెస్ మెన్ మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కథ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. అలా ముంబైకి వెళ్లి గ్యాంగస్టర్ గా ఎదిగిన వ్యక్తి పేరు సతువాచారి వరదరాజన్ ముదలియార్. ఆయన 1960 లో సాధారణ వ్యక్తిగా ముంబైకి వెళ్లి, ఒక ముంబై డాన్ వరదా బాయ్ గా ఎదిగారట. సతువాచారి 1926 లో అక్టోబర్ 9న జన్మించారు.
వరదా బాయ్ ని వర్ధ అని కూడా అనేవారంట. అంతేకాకుండా ఇండియన్ క్రైమ్ బాస్ అని కూడా పిలిచేవారట. వరదా బాయ్ 1988లో జనవరి 2న మరణించారు. వరదా బాయ్ నిజ జీవిత కథ ఆధారంగానే డైరెక్టర్ పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మెన్ మూవీని తీశారు. కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా కూడా వరదా బాయ్ ని కథతో తెరకెక్కింది.
యాంకర్ మరియు నటి అనసూయ ఏడుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో చిన్న వీడియోతో పాటుగా సుదీర్ఘమైన నోట్ కూడా షేర్ చేసి ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఆమె సుధీర్ఘమైన పోస్టును చూస్తే సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోలింగ్ కి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అనసూయ పెట్టిన పోస్టు సారాంశం, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను సమాచారం, కమ్యూనికేషన్ కోసం మొదట్లో వాడాం. ఆ తరువాత ప్రపంచంలోని జీవన శైలి, డిఫరెంట్ సంస్కృతి, సంప్రదాయల గురించి, నాలెడ్జ్ కోసం ఉపయోగించేవాళ్ళం. ఇక్కడికి ఒకరికొకరు సపోర్ట్ గా నిలవాలనే వస్తాం. ఆనందం, బాధ వంటి వాటిని పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంటాం. నే సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి జ్ఞాపకం, ఫోటోలు, డాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్లు, కంబ్యాక్ లు అన్ని నా జీవితంలో భాగమే.
గత ఏడాది ‘పోకిరి’ తో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్ లో హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే గతంలో నిరాశపరిచిన రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో రీరిలీజ్ చేశారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత యావరేజ్ గా నిలిచిన చిన్న సినిమా ‘ఈనగరానికి ఏమైంది’ రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించి, పెద్ద సినిమాల లిస్ట్ లో నిలిచింది.
తాజాగా రీరిలీజ్ అయిన యోగికి కూడా అలాంటి రెస్పాన్స్ రావడంతో వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు రీరిలీజ్ సిద్ధం అయ్యాయి. అయితే స్టార్ హీరోలందరికి కాలంతో పని లేకుండా ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్లాపే అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు. రాఖీ, ఒక్క మగాడు, లయన్ సినిమాలను త్వరలో రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
తమిళ హీరో శివకార్తికేయన్ కు టాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ అనే తెలుగు సినిమాను చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ శివకార్తికేయన్ ముందు సినిమాల కన్నా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది.
ఈ మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉందనే టాక్ వచ్చింది. శివకార్తికేయన్ మార్క్ కామెడితో రూపొందింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూస్తూ, అందులో ఉండే పొరపాట్లను గమనించి, మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి కాస్త వైరల్ అవడం సాధారణం అయిపోయింది.
ఓటీటీలో ఈ మూవీని చూసి, ఇందులోని ఒక పొరపాటును గమనంచిన ఒక నెటిజెన్, హర్ష్ మీమర్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో దానికి సంబంధించిన వీడియోకి ‘ఎడిటింగ్ చూసుకోవాలి కదా’ అంటూ షేర్ చేశాడు. ఆ వీడియోలో బోర్డు పై ముందు తమిళంలో మా భూమి అని, వెంటనే తెలుగులోకి మారుతుంది. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న తీవ్రమైన ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఈ మూవీలోని సీన్స్ ను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ సినిమాలకు ఇతర విషయాలతో ఉన్న కనెక్షన్స్ వెతికి పట్టుకొని మరి నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి మొన్న మెహర్ రమేష్ సినిమాలు ప్లాప్ అయిన ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఇండియకే వచ్చిందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాలో మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ గురించి ముందే చెప్పారనే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నేనింతే మూవీలో బ్రహ్మానందం తీసిన మూవీ పేరు షాడో. ఆ మూవీలోని పోస్టర్ పై ఉన్న షాడో ఫాంట్, మెహర్ రమేష్ తీసిన మూవీ షాడో ఫాంట్ ఒకేలా ఉంటాయి. నేనింతే మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది. ఇక మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ 2013 లో రిలీజ్ అయ్యింది. దాంతో మెహర్ రమేష్ షాడో మూవీ గురించి పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో ముందే చెప్పారా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.