హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ వేడుక శుక్రవారం రాత్రి మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో గ్రాండ్గా జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి పై చేసిన కామెంట్స్ కి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వీరిద్దరు ఐదేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. వరుణ్, లావణ్య 2017లో మిస్టర్ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. గత రెండు సంవత్సరాల నుండి వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి గురించి రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే 2 రోజుల క్రితం ఎంగేజ్మెంట్ గురించి అఫిషియల్ గా ప్రకటించారు.
మణికొండలోని నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక జరుగింది. శుక్రవారం (జూన్ 9) సాయంత్రం వరుణ్-లావణ్య ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగా కుటుంబం మొత్తం అందరు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గతంలో అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడిన మాటలు ఎంగేజ్మెంట్ తరువాత వైరల్ అయ్యాయి.
లావణ్య త్రిపాఠి నటించిన చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో లావణ్య తెలుగులో మాట్లాడం చూసిన అల్లు అరవింద్, “ఈ అమ్మాయి ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకుని బాగా మాట్లాడుతుంది. ఇక్కడే ఒక కుర్రాడిని చూసి పెళ్లిచేసుకుంటే బాగుంటుంది కదా” అన్నారు. ఆ వీడియో చూసినా నెటిజెన్లు అల్లు అరవింద్ చెప్పిందే నిజం ఏయినడాని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఎవరో ఒకర్ని అంటే మెగా ఫ్యామిలీలోనే చూసుకుందిగా అంటున్నారు.
https://www.instagram.com/p/CtS4WZrJ19h/
Also Read: “అఖండ” తో పాటు… బాలకృష్ణ “డ్యూయల్ రోల్” లో నటించిన 10 సినిమాలు..!

ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. 600 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ పోస్టర్, ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టు ముట్టాయి. కార్టూన్ యానిమేషన్ ల ఉందని, రామాయణంలా లేదని, ముఖ్యంగా రావణుడు పాత్ర పై ఎన్నో విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరిగింది.
ఆ తరువాత గ్రాఫిక్స్ పై మరింత ఫోకస్ చేసి, మార్పులు చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ కన్నా బెటర్ గా ఉండడంతో ట్రైలర్ తో మూవీ పై అంచనాలు పెరిగాయి. అయితే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాక మరిన్ని వివాదాలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ చిత్రం పై, ప్రభాస్ లుక్స్ పై ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత సీరియల్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సీనియర్ హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తున్నారు. ఆమె ప్రభాస్ ఈ మూవీలో రాముడిలా కాకుండా కర్ణుడులా కనిపిస్తున్నారని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుండగా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆమె పై మండిపడుతున్నారు.
స్టోరీ :
అది ముఖ్యమైనది కావడంతో ఇంట్లో ఉన్న అందరిని అనుమానిస్తు ఉంటారు. చివరికి కూతురు ప్రేమించిన శ్రీనివాస్ ని అనుమానిస్తారు. అసలు దొంగతనం అయిన వస్తువు ఏమిటి? ఇంతకీ దొంగ ఎవరు, పోయిన వస్తువు తిరిగి దొరికిందా, ఆపైన ఆ తరువాత ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా మారాయి అనేది తెలియాలి అంటే ఇంటింటి రామాయణం చూడాల్సిందే.
రివ్యూ :
ఈ మూవీలోని రాములు క్యారెక్టర్ సీనియర్ నరేష్ మరొకసారి అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం నరేష్ పాత్ర యొక్క తీరు ఆకట్టుకుంటుంది. రాహుల్ రామకృష్ణ తన పాత్రలో బాగా నటించారు. నవ్య స్వామి ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, చేవెళ్ల రవి, అంజి, జీవన్ తదితరులు వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. మూవీలో ఉన్న 3 సాంగ్స్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :





















బాలయ్య కెరీర్ లోనే కాకుండా, తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలో బెస్ట్ మాస్ మూవీగా గా నిలిచి, ప్రేక్షకుల అందరికి నచ్చిన చిత్రంగా నిలిచిన మూవీ నరసింహ నాయుడు. ఈ మూవీ 2001 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ రికార్డ్స్ లను తిరగరాసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ లో 20 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఈ చిత్రం 95 కి పైగా సెంటర్స్ లో వంద రోజులు ఆడింది.
అలాంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీని బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10న 2 తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే నరసింహానాయుడు సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఏరియాలలో ఓపెన్ అయ్యాయి. బాలయ్య చిత్రాలకు సీడెడ్ లో హడావుడి ఎప్పుడూ ఉంటుంది. ఈ సారి అక్కడ హడావుడి ఉన్నా, అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా బుకింగ్స్ జోరుని ఏమాత్రం చూపించడం లేదు.
నైజాంలో మరియు ఆంధ్రలో కూడా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. రాయలసీమలో అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని ఏరియాలలో తప్ప మిగతా చోట్లా మాత్రం బుకింగ్స్ వీక్ గా ఉన్నాయి. ఈ ఏడాది విడుదలయిన రీ రిలీజ్ పుట్టిన రోజు చిత్రాలలో వీకేస్ట్ బుకింగ్స్ ఈ మూవీకే అని అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జూలై 27, 2023న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ సంబంధించిన పనులను మొదలు పెట్టింది. ఈ విషయం పై మేకర్స్ ప్రకటన కూడా చేశారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, సముద్రఖనితో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. బ్రో సినిమా షూటింగ్ లో సముద్రఖని టేకింగ్, వేగానికి పవన్ ఫిదా అయ్యడంట. అది మాత్రమే కాక ఈ మూవీలో పవన్ నటించే పోర్షన్ ను స్పీడ్ గా పూర్తి చేశాడట.
సముద్రఖని స్కిల్స్ నచ్చిన పవన్ కళ్యాణ్ సముద్రఖనితో మరోసారి సినిమా చేబోతున్నట్లు తెలుస్తోంది. బ్రో మూవీ రిలీజ్ అయిన తరవాత ఆ సినిమా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి రీమేక్ కాకుండా స్ట్రెయిట్ కథతో మూవీ చేయబోతున్నారని అంటున్నారు. ఈ మూవీ గురించి త్వరలో అఫిషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం.