ప్రభాస్ ప్రస్తుతం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 500 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్బి అమితాబ్తో పాటు దీపికా పదుకొణె నటిస్తుండడం విశేషం.
ఇక ఈ సినిమా కథ కథెంటీ అన్న దానిపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. టైమ్ ట్రావెల్ కథ అని ఇప్పటికే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు కథకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అలాగే మహాభారతంలోని ఒక చాప్టర్ ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్కిస్తున్నారని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా విభిన్నం గా ఉన్నాయి. దీన్ని బట్టి ఇది భవిష్యత్ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. తన తండ్రిని వెతకడం కోసం ప్రభాస్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. అతడికి దీపికా, అమితాబ్ బచ్చన్ ఎలా సహాయం చేసారు అన్నదే ఈ సినిమా కథ అని నెట్టింట పలు కథనాలు వస్తున్నాయి. పూర్తి టెక్నాలజీ ఆధారిత చిత్రం అని తెలుస్తోంది. దీన్ని బట్టి కొన్ని ఊహాజనిత ఫోటోలని కూడా నెట్టింట మనం చూడొచ్చు.

మా డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ లో భూమిపైన ఉంది. ఈ చేతికి సంబంధించిన బాడీ కనిపించడం లేదు. కానీ, ఆ చేయి చాలా చాలా పెద్దది. దాని ముందు ముగ్గురు మనుషులు గన్ తో నిలబడి ఉన్నారు. చాలా మిస్టీరియస్ గా ఉన్న ఈ పోస్టర్ ఏం చెబుతుందో అర్థం కావట్లేదు. The World is Waiting అని క్యాప్షన్ పెట్టారు పోస్టర్ లో. అంటే ఈ స్పేస్ సూట్స్ లాంటివి వేసుకున్న మనుషులది ఏ గ్రహం. లేదా భారీ మనిషి వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తా. ప్రశ్నలు చాలా చాలానే ఉన్నాయి. ఇది కచ్చితంగా సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అనేది అర్థం అవుతోంది.

అలాగే అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్ అని ఓ చేతి పోస్టర్ రిలీజ్ చేశారు. అదే నెలలో అంటే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హీరోస్ ఆర్ నాట్ బార్న్ దే రైజ్ అంటూ మరో చేతిని పోస్టర్ గా రిలీజ్ చేశారు. దీపికా పదుకోన్ బర్త్ డే రోజు… హిప్పీ క్రాఫ్ ఫేస్ మీద డార్క్ షేడ్, దుమ్ముతో కప్పుకుపోయి ఉన్న దీపికా ఫోటోను రిలీజ్ చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే ఈ చిత్రాన్ని చూసి అప్పుడే తెలుసుకోవాలి కథ ఏంటి అనేది.

గతేడాది రీ ఇన్వెంటింగ్ ద వీల్ అని వైజయంతీ మూవీస్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. భారీగా కనిపిస్తున్న టైర్ అది. అంతకు ముందు తమ సినిమా కోసం భారీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈవీ వెహికల్స్ కావాలని నాగ్ అశ్విన్ పోస్ట్ చేస్తే..ఆనంద్ మహీంద్రా స్పందించారు. సో అఫీషియల్ గా ప్రాజెక్ట్ కే టెక్నాలజీ విషయంలో మహీంద్రా సపోర్ట్ తీసుకుంటోంది.

మహానటి హిట్ తర్వాత ఇన్నేళ్ల పాటు ప్రాజెక్ట్ కే పైనే నాగ్ అశ్విన్ పనిచేస్తున్నారు. అది కూడా వైజయంతీ మూవీస్ తమ 50 ఏళ్ల సినీ నిర్మాణ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేస్తున్న ఈ సినిమా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, స్టార్ హీరో అయిన సల్మాన్ బయటికి వస్తే తమ అభిమాన స్టార్ తో సెల్ఫీలు తీసుకోవడం కోసం, సల్మాన్ తో షేక్ హ్యాండ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల సల్మాన్ ఖాన్ చంపేస్తామంటూ ఎక్కువగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ సెక్యూరిటీని బాగా టైట్ చేశారు.
ఇక సల్మాన్ కు సెక్యూరిటీ ఇవ్వాలంటే ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. గత ఇరవై ఐదు ఏళ్లుగా సల్మాన్ కి షేరా అనే వ్యక్తి బాడీగార్డ్ గా పని చేస్తున్నాడు. ఇతను సల్మాన్ కి చాలా నమ్మకస్తుడు. షేరా హాలీవుడ్ హీరో విల్ స్మిత్, జస్టిన్ బీబర్, మైక్ టైసన్, జాకీ చాన్, మైఖేల్ జాక్సన్ల వంటి చాలా మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ముంబైకి వచ్చిన సమయంలో వారికి కూడా సెక్యూరిటీగా ఇచ్చేవారు. ఈ విషయలను బట్టి షేరా ఇచ్చే భద్రత, అతనికున్న పేరును అర్థం చేసుకోవచ్చు.
ఎంతో నమ్మకమైన బాడీగార్డ్ అయిన షేరాకు శాలరీ గురించి తెలిస్తే షాక్ అవుతారు. సల్మాన్ కు ఇంత నమ్మకమైన సెక్యూరిటీ ఇస్తున్న షేరాకు నెలకు దాదాపు 15 లక్షల వరకు జీతం ఇస్తారని తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా షేరా ‘టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్’ అనే సంస్థను స్టాపించాడు. ప్రస్తుతం దానికి సీఈఓగా ఉన్నాడు. షేరాకున్న ఆస్తుల విలువ సుమారు వంద కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బాడీగార్డ్ హీరోల రేంజ్ లో ఆస్తులను సంపాదించడం అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రస్తుతం అతను ఓ సెలబ్రిటీగా మారారు.





















తేజ్ కి యాక్సిడెంట్ జరిగినపుడు అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేశారు. కిందపడిన తేజ్ ను లేపి, నీళ్లు తాగించాడు. అయితే ఆ సమయంలో అతనికి ప్రమాదం జరిగింది సాయి ధరమ్ తేజ్ కు అని తెలియదంట. మానవత్వంతోనే సాయి ధరమ్ తేజ్ ను కాపాడాడు. అయితే తేజ్ కోలుకున్న తర్వాత అబ్దుల్ ను తేజ్ కలిశాడని, అలాగే అతనికి ఏ సాయం కావాలన్నా అడగమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
అంతే కాక మెగా కుటుంబం లక్షల రూపాయలు, కారు, బంగ్లా వంటివి బహుమతిగా ఇచ్చారని కూడా ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే ఇటీవల తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ నిజం కాదని, ఎలాంటి రివార్డు కూడా అబ్దుల్ కి ఇవ్వలేదని స్వయంగా చెప్పాడు. అయితే ఫోన్ నెంబర్ అబ్దుల్ కి ఇచ్చానని, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు కాల్ చేయమన్నానని తెలిపాడు.
ఇదే విషయాన్ని అబ్దుల్ ఫర్హాన్ అడుగగా సాయి ధరమ్ తేజ్ కానీ, మెగా కుటుంబం కానీ తనకు ఎటువంటి సాయం చేయలేదని అబ్దుల్ అన్నారు. తేజ్ తనను కలవలేదని, ఫోన్ నంబర్ ఇవ్వలేదని, ఈ ఫేక్ ప్రచారాలు వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాడు. చేసే ఉద్యోగం కూడా వదిలేశానని అన్నాడు.
అప్పట్లో ఒక షాప్ లో వర్క్ చేసేవాడిని, తేజ్ ను కాపాడినందుకు మెగా కుటుంబం డబ్బులు, కారు, బిల్డింగ్ ఇచ్చినట్టు రూమర్స్ రావడంతో షాప్ కు వచ్చిన వారందరూ బాగా డబ్బు ఇచ్చారంట కదా అని బాగా వేధించారని అది తట్టుకోలేక ఆఖరికి ఉద్యోగం మానేశాను. 4 నెలల నుండి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
సమంత అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన అప్పటి నుండి ఆమె ఏం చేసినా? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఆమెకు సంబంధించిన చిన్న విషయం అయిన సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విడాకుల తరువాత ఆమె పెట్టే పోస్ట్ లపై నెటిజన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే సమంత వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యింది. ఆమె సామాజిక మధ్యమాలలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన పై ఎవరైనా కామెంట్ చేసినా, వారికి ధీటుగా కౌంటర్ ఇస్తూనే ఉంది.
ఫ్యామిలీ మ్యాన్, పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ పాటతో బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. యశోద మూవీ షూటింగ్ సమయంలో ఆమె అనారోగ్యానికి గురి అయిన విషయం అందరికి తెలిసిందే. అనారోగ్యంతోనే షూటింగ్ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి, ఆమె తన తరువాతి సినిమాల పై దృష్టి సారించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత యాడ్స్ కోసం తీసుకునే రెమ్యునరేషన్ విషయం పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సమంత ఒకరు. గతంలో పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ కోసం సమంత కోటిన్నర పారితోషికం తీసుకుందంట. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక్కో సినిమాకి 3-4 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక యాడ్ పోస్ట్ చేయడం కోసం ఇంతకు ముందు 8 లక్షలు తీసుకునేదట. ప్రస్తుతం ఆమె యాడ్ పోస్ట్ కి 20 లక్షలకు పెంచిందంట. సమంత ఇన్స్టాగ్రామ్ లో కమర్షియల్ యాడ్ పోస్ట్ చేయడం కోసం 15- 20 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందని సినీ వర్గాల్లో టాక్ .
కోడి రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం అనే గ్రామంలో 1883లో నవంబర్ 3న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి తండ్రి స్పూర్తితో బాబాయి కోడి నారాయణస్వామి వద్ద పెరిగారు. అక్కడ ఉండే ఒక వ్యాయామశాలలో చేరి కుస్తీ నేర్చుకుంటూ దేహధారుడ్యాన్ని పెంచుకునేవాడు. 21 ఏళ్ల వయసులోనే చెస్ట్ పై 1 1/2 టన్నుల బరువును మోసేవారు. ఆ తరువాత మూడు టన్నుల బరువు కూడా మోసేవారు.
మద్రాసులో ఒక కాలేజిలో ఏడాది వ్యాయామశాలలో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ అందుకుని వ్యాయామ ఉపాధ్యాయుడుగా తాను చదివిన విజయనగరంలో హైస్కూలులోనే చేరారు. అక్కడే తన మిత్రుడు పొట్టి పంతులు సహాయంతో సర్కస్ కంపెనీ పెట్టారు. తుని రాజాగారి సహకారం కూడా లభించింది. రామమూర్తి సర్కస్ కంపెనీ చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
1912లో మద్రాసుకు చేరుకున్నారు. చైనా, జపాన్ కళాకారుల సహకారంతో కోడి రామ్మూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంది. వీటిలో భాగంగా రామ్మూర్తి గట్టిగా గాలి పీల్చుకుని కండలను బిగించి, ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను సైతం తెంచేవారు. ఆయన తన చెస్ట్ పై ఏనుగును ఎక్కించుకుని 5 నిముషాల పాటు అలాగే ఉండేవారు. ఆయన 2 కార్లను తాళ్ళతో కట్టి 2 చేతులుతో పట్టుకుని వాటిని కదలకుండా ఆపేవారు. అంతే కాకుండా ఒక్క చేత్తోనే రైల్ ఇంజను ఆపేవాడు. ఆ రోజుల్లోనే లండన్ కు వెళ్లి అక్కడ బకింగ్ హామ్ ప్యాలెస్ లో కుస్తీ పోటీలో సత్తా చాటాడు.
అప్పుడే బ్రిటిష్ రాణి రామ్మూర్తికి ఇండియన్ హెర్క్యులెస్ అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయన జీవితంలో ఎన్నో బిరుదులు అందుకున్నారు. అంత గొప్ప మల్లయుద్ధ యోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథ పై త్వరలోనే ఒక సినిమా రానుందని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 మూవీ కోడి రామ్మూర్తి బయోపిక్ ఆని సమాచారం.
గోపీచంద్ , శ్రీవాస్ కలయికలో వస్తున్న 3వ చిత్రం ఇది. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మే 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో మొదలుపెట్టింది. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదల అయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. డైరెక్టర్ శ్రీవాస్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే సెన్సార్ సభ్యులు తమ చిత్రాన్ని ప్రశంసించారని కూడా తెలిపారు.
ఈ చిత్రంలో ఎలాంటి కట్స్ కానీ మ్యూట్ కానీ చేయకుండా సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. ఈ మూవీని చూసిన తరువాత సెన్సార్ సభ్యులు తనని, కో ప్రొడ్యూసర్ వివేక్ ని పిలిచి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారని, కట్ చేసే అడియొకని, వీడియో కానీ లేవని చెప్పి అభినందించారని పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్ల యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిపారని రాసుకొచ్చారు. అలాగే సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.
మే 5న మా సినిమా విడుదల అయినప్పుడు ప్రేక్షకులు ఈ విధంగా అనుభూతి చెంది మా ‘రామబాణం’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి కుష్బూ కీలక రోల్ లో నటిస్తున్నారు. ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ డైరెక్టర్ తేజతో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మూవీ సాధించే వసూళ్ల ఆధారంగా గోపీచంద్ నెక్స్ట్ చేసే చిత్రాల బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.