ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోతున్నాయి. ఇదే దారిలో మెగా డాటర్ నిహారిక చైతన్య దంపతులు కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది. 2020లో డిసెంబర్ 9న నిహారిక, చైతన్యల వివాహం ఘనంగా జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట సామాజిక మధ్యమాలలో సైలెంట్ కావడంతో అనుమానం మొదలైంది.
నిహారిక, చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లుగా కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. దానికి కారణం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య గత నెలలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫొటోలను తొలగించాడు. ఆ తర్వాత నిహారిక, చైతన్య ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో అయ్యారు. దాంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోనున్నారనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు మెగా కుటుంబంలో ఎవరూ స్పందించలేదు.
తాజాగా మెగా డాటర్ నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తమ పెళ్లి ఫోటోలతో పాటుగా, చైతన్యతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేసింది. అయితే ఒక్క ఫొటోను మాత్రం తొలగించలేదు. పెళ్లి మండపంలో నిహారిక చైతన్య పక్కనే కూర్చుని పెదాలపై వేలు ఉంచి ష్.. అనే ఫొటో. ఇందులో చైతన్య బ్లర్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోకి ‘నా వద్ద ఒక సీక్రెట్ ఉంది. కానీ దానిని మీకు చెప్తే అది రహస్యం ఎలా అవుతుంది? సారీయే, అని క్యాప్షన్ పెట్టి, షేర్ చేసింది.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో ఒకటి మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు? మర్చిపోయి అలాగే ఉంచేసావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటో మాత్రమే కాకుండా పెళ్లిలో చైతన్య లేకుండా ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను అలాగే ఉంచేసింది.
Also Read: ప్రభాస్ “సలార్” తో పాటు… సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వబోతున్న 4 “పాన్-ఇండియన్” సినిమాలు..!
https://www.instagram.com/p/CKL-jpopwVc/

1. ఖుషీ:
2. నందమూరి బాలకృష్ణ చిత్రం:
3. నేచురల్ స్టార్ నాని సినిమా:
4. సలార్:
Also Read:
షారుఖ్ ఖాన్ నటన పై ఉన్న ఆసక్తితో సినిమాలలో ప్రయత్నిస్తూనే, టెలివిజన్ లో వచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకున్నాడు. డిడిలో టెలికాస్ట్ అయిన సర్కస్ సీరియల్ లో నటించి, ఎంతో పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దీవానా, బాజీగర్, డర్, కుచ్ కుచ్ హోతాహై లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ బాద్షాగా షారుఖ్ ఖాన్ ఎదిగాడు. ఆ సమయంలో షారుఖ్ కు ఆయన భార్య గౌరీ ఆర్ధికంగా తోడ్పడుతూ అండగా నిలబడిందని షారుఖ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
బాలీవుడ్ లో తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం గౌరీ ఇచ్చిన ప్రోత్సాహమే అని కింగ్ ఖాన్ చెప్పాడు. ఈ అందమైన జంట లవ్ స్టోరి సినిమాకి తక్కువ కాదని చెప్పవచ్చు. షారుఖ్ ముస్లిం, గౌరీ పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వీరి ప్రేమను గౌరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అందువల్ల పెళ్లి సమయంలో షారూఖ్ పేరుని హిందువుగా అనుకునేలా అభినవ్ అనే పేరును పెట్టానని గౌరీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read: 

సిద్దూ మూసేవాలా చిన్న వయసులోనే గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ చనిపోయిన తరువాత సంపాదిస్తోంది. యూట్యూబ్ పాలసీల ద్వారా, వ్యూవ్స్ ద్వారా రాయల్టీలు ఇస్తోంది. ఒక వీడియో లేదా ఒక పాట కానీ మిలియన్ వ్యూస్ పొందినట్లయితే యూట్యూబ్ దానికి 1000 డాలర్లను ఇస్తుంది. రీసెంట్ గా రిలీజ అయిన సిద్ధూ కొత్త సాంగ్ 18 మిలియన్ల పైగా వ్యూస్ సంపాదించింది. అందువల్ల ఈ పాటకు యూట్యూబ్ ప్రస్తుతానికి రూ. 14.3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పాటకు మరిన్ని వ్యూస్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఇవే కాకుండా సిద్ధూ మూసేవాలా వింక్, స్పాటిఫై లాంటి ప్లాట్ఫామ్ల నుండి రాయల్టీ మరియు అడ్వర్టైజ్మెంట్ డీల్స్ ద్వారా చనిపోయిన తరువాత కూడా తన పాటల వల్ల రెండు కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా సంపాదించాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియోలో సిద్దు గాత్రానికి నైజీరియన్ గాయకుడు రాప్ ను అందించారు. ఈ వీడియోలో టెక్నాలజీ సహయంతో సింగర్ సిద్దు మూసే వాలా కనిపించేట్లుగా చేశారు.
Also Read: 


అంతగా పాపులర్ అయిన నాగరాజు సినిఇండస్ట్రీలో రాణిస్తాడని అందరు అనుకున్నారు. కానీ అతడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. సుమారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాల గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. నాగరాజు గురించి అతని మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం..
సింగర్ నాగరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిత అనే యువతిని ప్రేమించానని, అయితే తమ వివాహానికి అనిత ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో విడిపోయామని తెలిపాడు. ఆ బాధతోనే ‘అనిత ఓ అనిత’ పాటను రాశానని, ఈ సాంగ్ రాయడం కోసం నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు. తాను ఆ పాట రాయడానికి ముందు ఆర్కేస్ట్రాలో గాయకుడిగా చేసేవాడినని అన్నారు. తాను రాసిన మొదటి పాట ‘అనిత’ సాంగ్ ను తానే పాడినట్లు తెలిపారు.
అప్పట్లో నేను మరణించానని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ సమయంలో చాలా బాధ పడ్డానని తెలిపారు. అప్పుడు హైదరాబాద్ అంతా కొత్తగా అనిపించింది. దాంతో భయపడి మా ఊరికి వెళ్లిపోయాను. అనితకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. నాకు దేవిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకి చెవిటి, మూగ. చిన్నబాబు కూడా పెద్దవాడిలానే సైగలే చేస్తాడని అన్నారు. కొంతకాలం పాటు పాన్షాపుతో నెట్టుకొచ్చానని, కళామతల్లి కాపాడుతుందని ఫ్యామిలీతో పాటు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యామని తెలిపారు. ప్రస్తుతం తాను అనిత-2 పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


ఆయన మాట్లాడుతూ మహేష్ ఎంతో ప్రమాదకరమైన పర్సన్ అని, ఆయనతో ఒక్కసారి మూవీ చేస్తే, ఇంకో హీరోతో చేయాలనిపించదని అన్నారు. అంతలా మహేష్ మాయ చేస్తాడని, దాంతో మళ్లీ ఆయనతోనే మూవీ చేయాలని కోరుకుంటారని అన్నారు. అలా మహేష్ తో ఒక్కడు, సైనికుడు, అర్జున్ చిత్రాలను చేశానని తెలిపారు.
ఈ విధంగా ఈ జనరేషన్ హీరోలలో ఒకే దర్శకుడితో వరుసగా 3 చిత్రాలు చేసిన హీరోని చూశారా అని అడిగారు. ఇక మహేష్తో మాత్రమే చిత్రాలు చేస్తే బాగుండదనే ఉద్దేశ్యంతో విరమం తీసుకున్నానని ఆయన తెలియచేసారు. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఈ నెల 14 న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మధుబాల కీలక పాత్రలలో నటించారు.
Also Read:
ఈ టీజర్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే మ్యానరిజంలో చేతికున్న చిటికిన వేలు గోరు పెద్దగా ఉన్నట్టుగా చూపించారు. ఆ వీడియోలో విజువల్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ రంగులో ఉండడం, ఆ గోరు మాత్రమే రంగులో హైలైట్ గా చూపించారు. దీనితో దర్శకుడు సుకుమార్ బ్రిలియెన్స్ కనిపించింది. దాంతో ఆసక్తికర ప్రశ్న కూడా తలెత్తింది. అది దేనికి సూచన అంటూ చర్చిస్తున్నారు.
అయితే ఆ తరువాత విడుదల చేసిన పుష్ప ఫస్ట్ లుక్ తో ఆ గోరు విషయంలో క్లారిటీ వస్తుంది. ఫస్ట్ లుక్ లో బన్నీ అమ్మవారి వేషధారణలో కనిపించారు. ఆ వేషధారణ కోసమే గోరు పెంచారని తెలుస్తోంది. చిత్తూరు ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆచారం ప్రకారంగా మొక్కు తీర్చడం కోసం పురుషులు అమ్మవారిలా వేషం ధరిస్తారని, ఇప్పటికీ కూడా ఆ ఆచారం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఈ విషయం వైరల్ గా మారింది.
Also Read: