తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. వారిలో ప్రధానంగా కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ లాంటి యాక్టర్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. క్యారెక్టర్ ఏదైనా సరే ఆ పాత్రలలో వారి నటన అద్భుతం అని చెప్పవచ్చు.
కోట శ్రీనివాసరావు వయసు మీద పడడంతో సినిమాలలో చేయడం లేదు. ఇక ప్రకాశ్ రాజ్ ఒకవైపు పాలిటిక్స్ లో కొనసాగుతూనే, ఇంకో వైపు సినిమాలలో తన ప్రతిభను చూపిస్తూ రాణిస్తున్నాడు. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ పోషించిన క్యారెక్టర్స్ లో నటిస్తాడు అనేదాని కన్నా జీవిస్తాడు అని చెప్పవచ్చు. ఆయన చేసేది ఏ పాత్ర అయిన అందులో లీనమై నటిస్తాడు. అందువల్లనే టాలీవుడ్ లోని దాదాపుగా టాప్ డైరెక్టర్స్ అందరు ప్రకాశ్ రాజ్ ని తమ చిత్రాల్లో తీసుకుంటారు. అలాంటి నటుడిని జక్కన్న మాత్రం విక్రమార్కుడు మినహా ఏ సినిమాలోనూ తీసుకోలేదు. మరి రాజమౌళి విలక్షణ నటుడు అయిన ప్రకాశ్ రాజ్ ని ఎందుకు తన సినిమాలలో తీసుకోలేదో ఇప్పుడు చూద్దాం..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో చిన్న క్యారెక్టర్ ఆది కూడా 5 నిమిషాలు మాత్రమే తెర మీద కనిపించే పాత్రలో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నాడు. ఇక ఆ ఒక్క సినిమాలో మాత్రమే రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ కనిపించాడు. అంత మంచి నటుడు ప్రకాశ్ రాజ్ ని రాజమౌళి ఎందుకు తీసుకోరు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయన్ని రాజమౌళిని ఒక సందర్భంలో అడుగగా ఇలా చెప్పుకోచ్చారు.
ప్రకాశ్ రాజ్ ఇప్పటి దాకా చేయని క్యారెక్టర్ ఏది లేదు. ఆయన ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల పాత్రల్లో కనిపించారు. తన చిత్రంలో కూడా మళ్ళీ అలాంటి పాత్రలో నటిస్తే ఆడియెన్స్ కి బోర్ కొడుతుంది. అందువల్ల ఆయనను తీసుకోలేదు.ఇప్పటి దాకా ప్రకాశ్ రాజ్ చేయని క్యారెక్టర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆయనతో నా మూవీలో తీసుకుంటానుని రాజమౌళి వెల్లడించారు.
అయితే రాజమౌళి చూపించే ఎలివేషన్స్ లకి ప్రకాశ్ రాజ్ లాంటి నటుడు విలన్ గా చేస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాగే రాజమౌళి చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో ప్రకాశ్ రాజ్ నటిస్తే బాగుండేదని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక రాబోయే రాజమౌళి చిత్రాల్లో అయిన ప్రకాశ్ రాజ్ కి నటించే అవకాశం వస్తుందో వేచి చూడాలి.
Also Read: ఉపేంద్ర “కబ్జ” ఫస్ట్ రివ్యూ..!! సినిమా ఎలా ఉందంటే..?













బాలు తండ్రి హరికథా కళాకారుడు అవడంతో ఆయన సంగీతం పై ఆసక్తిని ఏర్పరుచుకున్నారు. అయితే బాలు తన తల్లీ ఇష్టం మేరకు ఇంజనీరింగ్లో చేరారు. అయినప్పటికీ పాటల పోటీలలో పాల్గొనేవారు. 1964లో ఆయన మొదటి అవార్డు అందుకున్నారు. అనంతరం ఇళయరాజాతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ ను మొదలుపెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ కోదండపాణి బాలసుబ్రమణ్యంకు అవకాశం ఇచ్చారు. పైన కనిపిస్తున్న ఫోటో అప్పుడు తీసినదే.
ఆ సమయంలో వారు ఒక గాన గంధర్వుడుని సంగీత ప్రపంచానికి అందిస్తున్నామని అనుకోని ఉండరేమో. పైన ఫోటోలో బాలుకి షేక్ హ్యాండ్ ఇస్తున్న వ్యక్తి అప్పటి హాస్యనటుడు పద్మనాభం. ఇక బాలుకి ఎడమ వైపు ఉన్నవ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ పి కోదండ పాణి. ఈ ఇద్దరు బాలసుబ్రమణ్యంకు తొలి అవకాశం ఇచ్చారు. పద్మనాభం ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన ‘శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమాలో బాలు మొదటి పాటను పాడారు.
Also Read: 

దర్శకుడు వంశీ ఈ సినిమాలో హీరోగా జగపతి బాబుని తీసుకోవాలని భావించారు. అప్పటికే ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయిన జగపతి బాబు దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారంట. కథ విన్న జగపతి బాబు కారణం ఏమిటో కానీ, ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
ఆ తరువాత వంశీ రవితేజకు కథ చెప్పి, ఒప్పించారు. హీరోయిన్ గా కళ్యాణిని తీసుకున్నారు. అలా తెరకెక్కిన సినిమా సూపర్ హిట్ గా నిలిచి, డైరెక్టర్ వంశీని తిరిగి సినిమాలు చేయడానికి ఆయనకి నమ్మకాన్ని ఇచ్చింది. వంశీ తాను రాసుకున్న కథని అలాగే స్క్రీన్ మీద చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే చెప్పవచ్చు. అలా ఆయన సినిమాలను చేయడం మెల్లిగా తగ్గించారు.
Also Read:
దాదాపు అప్పటి అగ్ర హీరోలందరికి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరావు, సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోల సరసన నటించారు. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నసమయంలోనే పెద్ద వ్యాపావేత్తను వివాహం చేసుకుని, సెటిలయ్యారు. పెళ్లి తరువాత ఆమె మహారాణి వంటి జీవితాన్ని గడిపారు. ఆమె భర్త వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, ఆమెకు అప్పట్లోనే సొంత హెలికాప్టర్ కూడా ఉండేది.
దానిని కేఆర్ విజయ భర్తే నడిపేవారట. ఆమెకి ఎక్కడ మూవీ షూటింగ్స్ ఉన్నా తన సొంత హెలికాప్టర్లోనే వెళ్ళి వచ్చేవారంట. అయితే ఆరోజుల్లో స్టార్ హీరోలకు సైతం సొంత హెలికాప్టర్ లేవు. ఇక ఆమె భర్తకు ఎన్నో రకాలు వ్యాపారాలు ఉండేవని, దాంతో మద్రాస్ దగ్గరలో 67 ఎకరాల తోట కొన్నారు. అంతేకాకుండా కేఆర్ విజయ రాజభవనం వంటి ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారట. ఆ ఇంటి పై భాగంలోహెలికాప్టర్ ఆగేదంట.
విజయ వైభోగం గురించి సినీ పరిశ్రమలో అంతా చెప్పుకునేవారంట. ఆమె ఇంటిలో స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక వసతులు ఉండేవట. అవన్నీ చూసి అప్పట్లో అగ్ర హీరోలు ఎంతో ఆశ్చర్యపోయేవారట.కేఆర్ విజయ భర్త మరణాంతరం కుమార్తెతో కలిసి చెన్నైలో జీవిస్తోంది. అయితే ఆమె గతంలో ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలన్నీటిని ఆమె స్వయంగా చెప్పింది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
సినిమా ప్రమోషన్స్ లో బాలీవుడ్ మీడియా మీ పై వస్తున్నట్రోల్స్ గురించి మీ రియాక్షన్ ఏమిటి అని అడగడంతో కీర్తి ఇలా సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో తన పై వచ్చే ట్రోల్స్ ను మరియు నెగిటివ్ కామెంట్స్ తాను పట్టించుకోను అని తెలిపింది. మహానటి చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు తన పై దారుణమైన ట్రోల్స్ చేశారని కీర్తి సురేశ్ చెప్పారు.
సావిత్రి క్యారెక్టర్ చేయడానికి మొదట తాను చాలా భయపడ్డానని, అందుకే ఆ సినిమాకి మొదట నో చెప్పానని అన్నారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ నువ్వు చేయగలవు అని ప్రోత్సహించడంతో ఆ మూవీ చేయగలిగానని తెలిపింది. ఈ పాత్ర చేయడం నీకే సాధ్యం అని డైరెక్టర్ చెప్పడంతో ఆయనకి అంత నమ్మకం ఉండడంతో మహానటి సినిమాలో నటించానని కీర్తి సురేష్ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే కీర్తి సురేష్ కెరీర్ మహానటి తరువాత ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు మహానటి చిత్రం అంత పాపులారిటీని తీసుకొచ్చింది.
Also Read:
ఈ విధంగా 3 వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో పది మిలియన్ ఫాలోవర్లు కలిగిన ఒకే ఒక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డ్ మహేష్ బాబుకు మాత్రమే ఉండడంతో ఆయన అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. మహేష్ 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.
ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి అని వినిపిస్తోంది. ఈ సినిమాని జక్కన్న పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. అంతే కాకుండా రాజమౌళి గత చిత్రాల కన్నా రెట్టింపు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని వినిపిస్తోంది. మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆ కారణంగానే మహేష్ బాబు అరుదైన రికార్డును నమోదు చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. రాజమౌళి మూవీతో మహేష్ బాబు 100 కోట్ల పారితోషికం తీసుకునే సెలబ్రిటీల లిస్ట్ లో చేరనున్నారు.
Also Read: 





